Vishwak Sen: ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ తీస్తాను: విష్వక్ సేన్
యంగ్ హీరో విష్వక్ సేన్ తాజాగా ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) చిత్రంతో పలకరించాడు. ఈ సినిమా విజయంపై మీడియాతో మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: విష్వక్ సేన్ (Vishwak Sen) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మంచి టాక్ తెచ్చుకుంది. విష్వక్ నటనకు, దర్శకత్వానికి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ విజయం గురించి మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు విష్వక్ సేన్. మరి అందులో విష్వక్ పంచుకున్న సంగతులేంటో చూసేద్దాం.
సినిమా సక్సెస్ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
విష్వక్ సేన్: చాలా ఆనందంగా ఉంది. కాళ్లు నిలవడం లేదు అంటారు కదా.. అలా ఉన్నాను. అనుకున్న దానికంటే మంచి ఫలితం వచ్చింది. నాకు సినిమారంగమంటే చాలా ఇష్టం. అందుకే దీనికోసం ఎంత కష్టమైనా పడడానికి సిద్ధపడతాను. ‘దాస్ కా ధమ్కీ’ సినిమా తీసేటప్పటి కంటే విడుదల సమయంలో ఎక్కువ కష్టం అనిపించింది. కొంచెం ఆలస్యమైనా ప్రతి విషయాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి విడుదల చేశాను. ప్రేక్షకులకు మంచి సినిమా అందించానని సంతృప్తిగా ఉంది.
ఈ సినిమాలో కామెడీ గురించి చెప్పండి?
విష్వక్ సేన్: ఓ దర్శకుడిగా నేను యాక్షన్, డ్రామా సన్నివేశాలకు బాగా దర్శకత్వం వహిస్తాను. ఇక ఈ సినిమాలో కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఒక డైరెక్టర్గా ఇది నేను సాధించిన గొప్ప విజయం అనుకుంటాను. తాజాగా ఎన్టీఆర్ నన్ను అభినందిస్తూ మెసెజ్ చేశారు.
నివేదా పేతురాజ్ను కొత్తగా చూపించారని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం?
విష్వక్ సేన్: ఈ సినిమాలో పాత్ర గురించి చెప్పగానే తను ఓకే చేసింది. ఇది చాలా కీలకమైన పాత్ర. ఒక కథను తెరకెక్కించాలంటే స్క్రిప్ట్లో చాలా మార్పులు చేస్తారు. ఈ స్క్రిప్ట్లో రెండు సార్లు మాత్రమే మార్పులు చేశా. ఇందులో నటించిన ప్రతి ఒక్కరిని నేనే ఎంపిక చేశా. హోటల్ మేనేజర్ పాత్ర కోసం మొదట పోసాని గారిని అనుకున్నా. కానీ అక్షరని ఎంపిక చేశా. తను ఆ పాత్రలో చాలా బాగా నటించింది. మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ అద్భుతమైన పాటలు అందించారు. నేను తీసే తర్వాత సినిమాకు కూడా ఆయనే సంగీత దర్శకుడు.
డ్యుయల్ రోల్ చెయ్యడం ఎలా అనిపించింది?
విష్వక్ సేన్: మొదట చెయ్యగలనా అనిపించింది. కానీ సినిమాకు వచ్చిన స్పందన చూసి చాలా సంతోషం వేసింది. నా పాత్రకు నేను న్యాయం చెయ్యగలిగా అనుకున్నా. నెగెటీవ్ క్యారెక్టర్లో బాగా నటించానని అంటున్నారు. నేను ఏ పాత్ర చేసినా దానిలో లీనమవుతాను.
భవిష్యత్తులో నెగెటీవ్ రోల్స్లో నటించే అవకాశం ఉందా?
విష్వక్ సేన్: తెలీదు. నేను ఏదీ ప్లాన్ చేసుకోలేదు. త్వరలోనే నా సొంత ప్రొడక్షన్లో ఎవరూ ఊహించని ప్రకటన చేస్తాను. అలాగే ‘దాస్ కా ధమ్కీ’ సినిమాను వచ్చే నెలలో హిందీలో విడుదల చెయ్యాలని అనుకుంటున్నాం.
సినిమాలో సెకండాఫ్లో కామెడీ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని మధ్యలో యాడ్ చేశారా?
విష్వక్ సేన్: కొన్ని సన్నివేశాలు కావాలని పెట్టాం. వరుసగా సీన్లు ఉంటే ప్రేక్షకులకు నచ్చదని మధ్యలో పాటలు పెట్టాం. విడుదలకు నెల ముందు సినిమాలో మరీ ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయనిపించింది. అప్పుడు పాట పెట్టాం.
మంచి ఓపెనింగ్స్ వచ్చాయని అనుకుంటున్నారా?
విష్వక్ సేన్: కచ్చితంగా. ఇప్పటి వరకు నా సినిమాలు వేటికీ ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. మొదటి రోజు రూ.8 కోట్లకు పైగానే వసూలు వచ్చాయి.
నివేద మిమ్మల్ని త్రివిక్రమ్తో పోల్చారు. అప్పుడు ఎలా అనిపించింది?
విష్వక్ సేన్: థ్యాంక్స్ చెప్పా (నవ్వుతూ). తను నన్ను త్రివిక్రమ్తో పోల్చలేదు. ఆయన తర్వాత నాకు అంత ఎనర్జీ ఉందని చెప్పింది.
త్వరలోనే మీ దర్శకత్వంలో మరో సినిమా ఆశించవచ్చా?
విష్వక్ సేన్: లేదు. ప్రస్తుతం చాలా సినిమాలు అంగీకరించాను. ఇప్పటికే ఆ నిర్మాతలు నా కోసం సంవత్సరం నుంచి వేచి చూస్తున్నారు. మరో 4 సినిమాల తర్వాత అప్పుడు దర్శకత్వం వహిస్తా. ‘దాస్ కా ధమ్కీ2’, ‘ఫలక్నుమా దాస్2’ రెండు సినిమాలకు సీక్వెల్స్ తీయాలి. వీటిలో ఏది ముందు వస్తుందో చెప్పలేను. ప్రస్తుతం వీటికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.
తర్వాత ప్రాజెక్ట్లు ఏంటి? పాన్ ఇండియా చిత్రాలపై మీ అభిప్రాయం?
విష్వక్ సేన్: ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాను. ఒకటి కామెడీ యాక్షన్ థ్రిల్లర్, మరొకటి గ్యాంగ్స్టర్ చిత్రం. వీటి తర్వాత నా సొంత ప్రొడక్షన్లో ఓ సినిమా వస్తుంది. నేను నటించిన ‘గామి’ సినిమా రెండు నెలల్లో విడుదలవ్వనుంది. మనం ఓ సినిమా తీసి అది పాన్ ఇండియా చిత్రం అని అనకూడదు. దానికి ఆ స్థాయి ఉందా లేదా అనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు. అందుకనే నేను నా సినిమాను పాన్ ఇండియా అని చెప్పలేదు. మల్టీ లాంగ్వేజ్ చిత్రం అని చెప్పా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!