
దారిద్ర్యరేఖ దిగువన భారతీయ అమెరికన్లు!
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ల విషయంలో పేదరికం గురించి నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అగ్రరాజ్యంలో నివసిస్తున్న వారిలో సుమారు 6.5 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన నివసిస్తున్నారని తేలింది. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన దేవేశ్ కపూర్, జషాన్ బజ్వాత్ అనే విద్యావేత్తలు ఈ సర్వే నిర్వహించారు.
అగ్రరాజ్యంలో ఉన్న సుమారు 42 లక్షల భారతీయుల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు సుమారు 6.5 శాతమని ఈ సర్వే వెల్లడించింది. కరోనా రక్కసి ప్రభావంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పరిశీలకుల అభిప్రాయపడ్డారు. పేదరికంలో మగ్గుతున్న భారతీయుల్లో బెంగాలీలు, పంజాబీలు అధికంగా ఉన్నారని వారు తెలిపారు. ఇక్కడి భారతీయుల్లో అసహాయ స్థితిలో ఉన్నవారిని గురించి అవగాహన కల్పించేందుకే తాము ఈ అధ్యయనం చేపట్టినట్టు వారు వివరించారు.
‘‘అమెరికాలో కొవిడ్-19 ఇక్కడి భారతీయుల ఆరోగ్య, ఆర్థిక స్థితిని దిగజారుస్తోంది. ఎన్నారైలంటే సంపన్నులనే అభిప్రాయంలో ఉన్న నిజానిజాలను తెలియజేసి.. ఇక్కడి నిజమైన పరిస్థితిని తెలిపేందుకు ఇదే సరైన సమయం. ఈ అంశంపై దృష్టి సారించడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది’’ అని ఇండియాస్పోరా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎంఆర్ రంగస్వామి అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.