కలవరపెడుతున్న మరో ఉపద్రవం
అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు, జీవాయుధాలు... ఇంతకాలంగా భూగోళాన్ని వణికిస్తూ వచ్చిన అస్త్రాలివి. యావత్ ప్రపంచాన్నే గడగడలాడించి, ఆధునిక దేశాలనూ కిందుమీదులు చేసిన కరోనా వైరస్ సైతం ఇదే తరహా ప్రాణాంతక ఆయుధాల్లో....
అమెరికాలో ‘హవానా’ కలకలం
అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు, జీవాయుధాలు... ఇంతకాలంగా భూగోళాన్ని వణికిస్తూ వచ్చిన అస్త్రాలివి. యావత్ ప్రపంచాన్నే గడగడలాడించి, ఆధునిక దేశాలనూ కిందుమీదులు చేసిన కరోనా వైరస్ సైతం ఇదే తరహా ప్రాణాంతక ఆయుధాల్లో ఒకటి కావచ్చనే అనుమానాలు ఓ పక్క పీడిస్తున్నాయి. ఇంకోపక్క మరో కొత్త విపత్తు పొంచి ఉందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో ‘హవానా సిండ్రోమ్’ పేరిట వెలుగులోకి వచ్చిన కొత్త తరహా రుగ్మత అందరిలో ఆందోళన పెంచుతోంది. ఇప్పటిదాకా అమెరికా దౌత్యవేత్తలే దీనికి లక్ష్యంగా మారారు. ఇటీవల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వియత్నాం పర్యటన ఈ సమస్య కారణంగా కొన్ని గంటలపాటు ఆలస్యం కావడంతో ఇది మరోసారి వెలుగులోకి వచ్చింది. వియత్నాంలోని హనోయ్ దౌత్య కార్యాలయంలో రుగ్మత బారిన పడిన ఓ వ్యక్తిని అత్యవసర చికిత్స నిమిత్తం తరలించాల్సి వచ్చింది. వియత్నాంలోని అమెరికా దౌత్య సిబ్బంది ఇళ్లవద్ద కూడా ఇలాంటి అంతుచిక్కని దాడికి లోనైనట్లు తెలుస్తోంది. ఇది ఎందుకు వస్తోందో, ఎక్కడినుంచి వస్తోందో అగ్రరాజ్య శాస్త్రవేత్తలకూ అంతుచిక్కడం లేదు.
దౌత్య సిబ్బందే లక్ష్యం
ప్రధానంగా అమెరికా దౌత్యవేత్తలనే పీడిస్తున్న ఈ సమస్యను తొలిసారిగా 2016లో క్యూబా రాజధాని హవానా నగరంలో అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందిలో గుర్తించారు. మొదటిసారిగా హవానాలో బయటపడటంతో ఆ పేరుతోనే పిలుస్తున్నారు. అంతుచిక్కని ఈ సమస్య బారిన పడిన వారిలో మెదడుపై ఏదో తెలియని తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. చుట్టూ కందిరీగల దండు తిరుగుతున్నట్లుగా రొద భరించలేనంత ఇబ్బందికి గురిచేస్తుంది. వికారం, తలపోటు, నిస్సత్తువ, కళ్లు తిరగడం, నిద్రలేమి, వినికిడిలోపం, మతిమరుపు వంటి లక్షణాలు వేధిస్తాయి. క్యూబాలో ఈ ప్రభావానికి లోనైనవారిలో మూడోవంతు మందికి వినికిడి శక్తి దెబ్బతింది. వారి మెదళ్లు సైతం దెబ్బతిన్నట్లు స్కానింగ్లలో బయటపడింది. ప్రమాదాల్లో గాయపడే స్థాయిలో మెదడుకు నష్టం వాటిల్లినట్లు తేలింది. క్యూబా, చైనాల్లోని దౌత్య కార్యాలయాల్లో పనిచేసే వారిలోనే బాధితులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. దౌత్యవేత్తలు, గూఢచారులు, సైన్యం, సీఐఏ సిబ్బంది, విదేశాంగ శాఖ అధికారులే బాధితులుగా మారుతుండటంతో కుట్రకోణాల్ని అనుమానిస్తున్నారు. గత అయిదేళ్ల వ్యవధిలో పెద్దసంఖ్యలోనే జనం ఈ సమస్యతో సతమతమైనట్లు అంచనా. జర్మనీ, ఆస్ట్రేలియా, తైవాన్, ఆస్ట్రియా, రష్యాలోని అమెరికా దౌత్య సిబ్బంది కూడా ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. అమెరికా అధికారుల కంప్యూటర్లు, సెల్ఫోన్లు వంటి ఉపకరణాల నుంచి నిఘా సమాచారాన్ని సేకరించే క్రమంలో ఇలాంటి దాడులు జరుగుతూ ఉండవచ్చనే అనుమానాలూ లేకపోలేదు.
ఇదంతా ఉద్దేశపూర్వకంగా, కుట్రతో జరుగుతోందనేది అగ్రరాజ్యం బలమైన అనుమానం. కొన్ని రకాల ‘సోనిక్’ శబ్ద తరంగాల కారణంగా ఈ తరహా సమస్య ఉత్పన్నమవుతున్నట్లు మొదట్లో అమెరికా అనుమానించింది. కానీ, అది తప్పుడు నిర్ధారణగా తేలడంతో మైక్రోవేవ్ తరంగాల సహాయంతో గుర్తుతెలియని ప్రత్యర్థులు తమవారిని లక్ష్యంగా చేసుకొంటున్నట్లు అగ్రరాజ్యం ఇప్పుడు గట్టిగా అనుమానిస్తోంది. జాతీయ విజ్ఞానశాస్త్ర, ఇంజినీరింగ్, వైద్యశాస్త్రాల అకాడమీ (ఎన్ఏఎస్ఈఎం) పరిశోధనల ప్రకారం మైక్రోవేవ్ తరంగాలను వాడి ఉండవచ్చన్న అంచనాలకు వచ్చారు. 1950ల్లో సోవియట్ యూనియన్ మైక్రోవేవ్ తరంగాలను మారణాయుధాల్లా ఉపయోగించడంలో సాధ్యాసాధ్యాలపై పరిశోధనలు చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ అధ్యయన నివేదికను జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కూడా బలపరచడం విశేషం. అల్ట్రాసౌండ్, విష పదార్థాలు, ఎలెక్ట్రానిక్ ఆయుధాలు కూడా కావచ్చనే అనుమానాలున్నాయి.
ఎటూ తేలని వైనం...
ఇన్నేళ్లుగా ఎఫ్బీఐ, సీఐఏ, అమెరికా సైన్యం, జాతీయ ఆరోగ్య కేంద్రం, వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం వంటివన్నీ ఈ ఘటనలపై పరిశోధనలు చేపట్టినా ఏ విషయాన్నీ తేల్చలేకపోయాయి. విదేశాల్లో దౌత్య కార్యాలయాల్లో ఒత్తిడి కారణంగా సంభవిస్తున్న మానసిక జబ్బుగా కొంతమంది శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొన్ని శక్తి పుంజాలు కారణమవుతున్నట్లు 2020 డిసెంబర్లో జాతీయ విజ్ఞానశాస్త్రాల అకాడమీ తన నివేదికలో పేర్కొంది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలను ఎదుర్కొనేందుకు తగిన యంత్రాంగాన్ని సంసిద్ధం చేయాలని అది సూచించింది. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్- ఈ రుగ్మతకు సంబంధించి క్యూబాపై నిందారోపణలు గుప్పించారు. తమ దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుంటూ, క్యూబా సిబ్బందిని బహిష్కరించారు. క్యూబా, రష్యాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తరవాత సిండ్రోమ్ సంగతేమిటో తేల్చాలని నిశ్చయించినట్లు విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకన్ సైతం జూన్లో ప్రకటించడం గమనార్హం. ఈ ఆరోపణల్ని క్యూబా తిరస్కరిస్తోంది. ఆరోపణలకు శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇన్నేళ్లలో ఒక్క ఆధారాన్నీ గుర్తించలేదని క్యూబా శాస్త్రవేత్తల కమిటీ నివేదిక స్పష్టంచేసింది. మరోవైపు, మైక్రోవేవ్ తరహా ఆయుధాల దిశగా చైనా, అమెరికా ఇప్పటికే ముందడుగు వేయగా, మన డీఆర్డీఓ సైతం ‘డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్’ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త తరహా మారణాయుధాల్ని కనిపెడుతున్న ఆధునిక ప్రపంచ దేశాలు ఏ తరహా అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయనేదీ కాలమే తేల్చాలి.
- డి.శ్రీనివాస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్