కాన్సాస్ నగరంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు అమెరికా లోని కాన్సాస్ నగరంలో ఎన్నారై టీడీపీ కాన్సాస్ సిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు...
ఇంటర్నెట్డెస్క్: తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శతజయంతి వేడుక, మహానాడును అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఎన్నారై తెదేపా కాన్సాస్ సిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వెలకటూరి లక్ష్మీనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రిచా వల్లూరుపల్లి, శ్రీనివాస్ కోటిపల్లి పాటలు పాడి అందరినీ అలరించారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని శ్రీనివాస్ దామ, అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని కేశవ్ మాగంటి తీర్మానించారు. వెంకట్ నల్లూరి, శిల్పా బండ్ల తదితరులు ప్రసంగించారు. సుమారు 300 మంది పాల్గొన్న ఈ వేడుకల్లో 'జోహార్ అన్న ఎన్టీఆర్', 'జై బాబు.. జై జై బాబు' అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేణు కొల్ల, సాయి మనీంద్ర, మధు ఉప్పగండ్ల తెదేపా సభ్యత్వ కార్యక్రమం నిర్వహించి సుమారు 150 మంది కొత్త సభ్యులను ఎన్నారై తెదేపాలో చేర్పించారు. కళ్యాణ్ పెమ్మసాని, శ్రీనివాస్ కుదారవల్లి, కమలాకర్ అనంతనేని కార్యక్రమంలో భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో రావు ద్రోణవల్లి, అరుణ్ కొమ్మినేని, వెంకట్ నెల్లూరి, ప్రకాశ్ కన్యధార, రతన్ కొమ్రనేని, మురళీ నర్ల, నాయుడు ఒట్టిగుంట, గౌతమ్ నల్లూరి, శ్రీనివాస్ కోడె, సురేశ్ తుమ్మల, హరి బండ్ల, గోపి మండ్ల, శ్రీధర్ కొడాలి, వెంకట్ గొర్రెపాటి, సోమశేఖర్ పెమ్మసాని, సాయి నంబూరి, చంద్ర గన్నె తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతమవ్వడానికి కృషి చేసిన దాతలు మనోహర్ నాయుడు వెలకుర్తి, ప్రకాశ్ కన్యధార, బాపురెడ్డి మోతె, శివ జాస్తిలకు నిర్వహకులు ప్రత్యేకంగా ధన్యవాధాలు తెలియజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..
Indian Student Missing: షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. -
తానా ఆధ్వర్యంలో సౌతెర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీ విద్యార్థులకు రిఫ్రెష్ వర్క్షాప్
సౌతెర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీకి కొత్తగా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల ప్రయోజనం కోసం తానా న్యూ ఇంగ్లాండ్ ఛాప్టర్ ‘తానా రిఫ్రెష్ వర్క్షాప్’ను నిర్వహించింది. -
సింగపూర్లో ఎన్నారైలతో ఘనంగా డా.రామ్మాధవ్ పుస్తక పరిచయ కార్యక్రమం
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్లో ప్రవాస భారతీయులతో డా.రామ్మాధవ్ రచించిన నూతన గ్రంథం ‘ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్’ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. -
ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో కువైట్లో ఎన్నికల ప్రచారం
ఎన్నారై తెదేపా కువైట్ ఆధ్వర్యంలో తెదేపా-జనసేన-భాజపా కూటమికి మద్దతుగా విస్త్రృత ప్రచారం నిర్వహించారు. -
లండన్లో వైభవంగా ‘తాల్’ ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
‘సామెతలు.. తెలుగు భాషకు సింగారం..’
సామెతలు మన తెలుగు భాషకు సింగారం అని, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిదీ అని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు అన్నారు. తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వ సమావేశం ‘తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు’ అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగింది. -
యూకేలో ఘనంగా ఉగాది సంబరాలు.. TAS నూతన కార్యవర్గం ఎన్నిక
యూకేలోని స్కాట్లాండ్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
ఘనంగా ‘కెంటకీ తెలుగు సంఘం’ ఉగాది వేడుకలు
కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు