ఘనంగా ‘సరిహద్దులు దాటి..’ పుస్తకావిష్కరణ
డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరిరావు రచించిన ‘సరిహద్దు దాటి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగింది.
ప్రయాణాలు చాలామంది చేస్తారు. అలాగని అందరూ యాత్రికులు అవలేరు. దానికి సంకల్పముండాలి. బలమైన కాంక్ష ఉండాలి. అలాంటివారే తమ యాత్రానుభూతులను పదిమందితో పంచుకోగలరు. ఆ కోవకే చెందుతారు డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరిరావు. వృత్తిరీత్యా లండన్ నగరంలో ఫోరెన్సిక్ సైకియాట్రీ మెడికల్ డైరెక్టర్గా ఉన్న ఆయన.. ఇప్పటి వరకు 120 దేశాలు సందర్శించారు. ఆ దేశాల అందచందాలను గ్రంథస్థం చేసి ‘సరిహద్దులు దాటి..’ పేరిట పుస్తకాన్ని వెలువరించారు. ఆయన ఆంగ్ల రచనను ప్రొఫెసర్ ఎం.ఆదినారాయణ, అట్లూరి జయశ్రీ తెలుగులో అనువాదం చేశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జనవరి 3న జరిగింది.
హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హజరయ్యారు. వారికి మిసిమి సంపాదకులు వల్లభనేని అశ్వినీ కుమార్ స్వాగతం పలికారు. మిసిమి కర్త, కర్మ, క్రియ అయిన ఆలపాటి బాపన్నతో పాటు వర్జీనియా నుంచి విచ్చేసిన డాక్టర్ రావెళ్ళ రమేష్, రచయితలు అనిల్ అట్లూరి, దాసరి అమరేంద్ర, వేమూరి సత్యం, యాత్రా రచనలపై పరిశోధన చేసిన మచ్చా హరిదాసు, యాత్రా రచయిత్రి స్వర్ణ కిలారి వంటి వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ పుస్తకావిష్కరణ సభకు ఆచార్య కొలకలూరి ఇనాక్ అధ్యక్షత వహించారు. మానవత్వమే తన భాషగా డాక్టర్ శేషగిరి ఈ యాత్రలు సాగించారని, ఆయా ప్రదేశాల సంస్కృతిని, వివిధ దేశాల ప్రజల ఆహార అలవాట్లను ఈ పుస్తకంలో చక్కగా పొందుపరిచారని అభినందించారు. గ్రంథావిష్కర్త ఆచార్య ఎన్.గోపి మాట్లాడుతూ.. చాలా మంది యాత్రలు చేస్తారు గానీ.. అనుభవాలను పుస్తక రూపంలో తేవడం కొందరే చేస్తారన్నారు. అలాంటి ప్రయత్నం చేసిన డా.శేషగిరి అభినందనీయులు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీవితం దుర్లభం.. తిరగడమే ఉత్తమం అన్న రాహుల్ సాంకృత్యాయన్ మాటలు గుర్తుచేశారు.
విశిష్ట అతిథిగా విచ్చేసిన సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి అధ్యక్షులు ఆచార్య సి.మృణాళిని ప్రసంగిస్తూ యాత్రా చరిత్రలు చదవటం వల్ల ఆ యాత్రికుడు మనకు అర్థమవుతారని చెప్పారు. పుస్తక అనువాదం చేయడంలో కృషి చేసిన ప్రొ.ఎం.ఆదినారాయణ వారు మాట్లాడుతూ యాత్రా సాహిత్యానికి.. సాహిత్యంలో సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఏనుగు వీరాస్వామి రచించిన కాశీయాత్ర తొలి యాత్రా రచన అని, దాన్ని ప్రపంచం గుర్తించేందుకు మనమంతా కృషి చేయాలన్నారు.
అనువాదకులు అట్లూరి జయశ్రీ మాట్లాడుతూ ప్రయాణాలు చేయటం ద్వారా మనం ఇతరుల నుంచి నూతన శక్తిని పొందుతామని, అలాగే ఆయా భాషల సాహిత్యాన్ని కూడా తెలుసుకోగలుగుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రంథకర్త డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరిరావు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యాత్ర తన జీవితంలో ఓ భాగమై పోయిందని, ప్రతి వ్యక్తీ సంవత్సరంలో ఒక నెలను ప్రయాణాలు చేసేందుకు కేటాయించుకోవాలన్నారు. యాత్రలు చేసే క్రమంలో ఓర్పు అలవరుచుకోవాలని, ఆయా దేశాల సంస్కృతిని గౌరవిస్తూ స్థానిక ప్రజలతో మమేకమై స్థానికంగా దొరికే ఆహారాన్ని ఆస్వాదించాలని సూచించారు. తనకు తెలుగు నేర్పిన చిన్ననాటి గురువులు అంబటి రమణమ్మ, సాంఘిక శాస్త్రం బోధించిన విద్యాసాగర్ను వేదికపైకి ఆహ్వానించి గ్రంథ ప్రతులను రచయిత వేమూరి సత్యం గారి ద్వారా అందజేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.ఎన్.బాలాచారి పాల్గొని మాట్లాడుతూ.. మంచి సాహిత్యాన్ని ప్రజలకు చేర్చేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. వృత్తి, ప్రవృత్తిని సమన్వయం చేస్తూ ఎందరికో శేషగిరి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రొఫెసర్ వై.పార్థసారధి కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?