తానా ఆధ్వర్యంలో ఘనంగా ‘తెలుగుతనం–తెలుగుధనం’ సదస్సు
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ‘తెలుగుతనం–తెలుగుధనం’ పేరుతో అంతర్జాలంలో జరిగిన ఈ సాహిత్య సదస్సుకు ఎన్నారై ప్రముఖులతో పాటు ప్రఖ్యాత తెలుగు సాహితీవేత్తలు.........
అట్లాంటా: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సాహితీ సదస్సు ఘనంగా జరిగింది. ‘తెలుగుతనం–తెలుగుధనం’ పేరుతో అంతర్జాలంలో జరిగిన ఈ సాహిత్య సదస్సుకు ఎన్నారై ప్రముఖులతో పాటు ప్రఖ్యాత తెలుగు సాహితీవేత్తలు హాజరై ప్రసంగించారు. తెలుగు సాహిత్య వైభవాన్ని మరింత కొత్త శిఖరాలకు చేర్చే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా తానా మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి మాట్లాడుతూ.. గతేడాది మే నెలలో సాహిత్యవేదిక ఆవిర్భావం నుంచి, 15 నెలలుగా వివిధ సాహిత్యాంశాలపై ప్రముఖ సాహితీవేత్తల ప్రసంగాలతో ప్రపంచ వేదికపై సాహితీ సౌరభాలను గుభాళింపచేయగలగడం ఎంతో సంతోషకరమన్నారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన ప్రారంభోపన్యాసంలో తెలుగు భాష, సాహిత్య పరిరక్షణకు, భావితరాలకు భద్రంగా అందించే కృషిలో కట్టుబడి ఉన్నామన్నారు. తన పదవీకాలంలో తానా ప్రపంచ సాహిత్య వేదికను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తానా ప్రపంచ సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనాటి సాహిత్య కార్యక్రమం చాలా ఆసక్తిదాయకమైందని.. పాల్గొన్న అతిథులంతా వారి వారి రంగాల్లో ఆరితేరినవారేనంటూ అందరికీ స్వాగతం పలికారు.
తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. విశిష్ట అతిథిగా పాల్గొన్న కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. కృతివెంటి శ్రీనివాసరావు వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను, సవాళ్ళను ఎదుర్కొని నేడు ఉన్నత స్థితిలో భాద్యతాయుత పదవిలో ఉండడం తెలుగు వారికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. 1954లో సాహిత్య అకాడమీ ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటిదాకా సాహిత్య అకాడమీ చేపడుతున్న కార్యక్రమాలను సోదాహరణంగా వివరిస్తూ 24 భాషల్లో విశేష కృషి చేస్తున్న వారికి పురస్కారాలు, సాహిత్య ప్రచురణలు, సమావేశాలతో నిరంతరం కృషి చేస్తోందన్నారు. తెలుగు భాషలో వచ్చిన సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించే అనువాదకులు తక్కువగా ఉన్నారని, ఎక్కువమంది ముందుకు వస్తే తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి చేరడం సులభమవుతుందని ప్రసాద్ తోటకూర తెలిపారు. లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తల జీవిత విశేషాలను వివరిస్తూ వీడియో ఫిలిమ్స్ తెలుగు కవులపై తక్కువగా ఉన్నాయని.. ఆ దిశగా మరింత కృషి జరగాలన్నారు. సాహిత్య అకాడమీ వెబ్సైట్లో తెలుగు భాషలో కొన్ని పేజీలు ఉండాలని, అవి రూపొందించే దిశలో దానికి కావలసిన సాంకేతిక సహకారం అందించడానికి తానా సంసిద్ధంగా ఉన్నట్టు డా. తోటకూర తెలపగా.. దీనిపై కృతివెంటి సానుకూలంగా స్పందించారు. కేంద్ర సాహిత్య అకాడమీతో కలిసి తానా ప్రపంచ సాహిత్యవేదిక ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయవచ్చని ఆహ్వానించారు.
ప్రముఖ తెలుగు వేదకవి, సినీ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై “పాట-పద్యం–పేరడీ–ప్రశ్న” అనే అంశంపై రెండు గంటలపాటు చేసిన సాహిత్య ప్రసంగం ఆద్యంతం అలరించింది. ఛలోక్తులతో, ఆలోచనలు రేకెత్తిస్తూ అందరినీ ఆకట్టుకుంది. కవి జొన్నవిత్తుల కలం ద్వారా వెలువడిన ఎన్నో సినీ గీతాల్లో ప్రత్యేక సందర్భాల్లో రాసిన వాటిని ప్రేక్షకులతో పంచుకోగా..అంతా హర్షధ్వానాలు చేశారు. అక్షర నాదం, స్వరనాదం రెండూ ఏకీకృతమై వ్యక్తమయ్యే పద్య రసభావన శ్రోతలను ఆకట్టుకొని వారి మనసులను రంజింప చేసే శక్తి పద్యాలకుందని.. అందుకే అవి అందర్నీ ఆకర్షిస్తాయన్నారు. పలు సినిమాల కోసమై రాసిన ఘటోత్కచుడు మీద, పాండవుల మీద, రావణాసురుడు మీద, యముడు మీద పద్యాలు, దుబాయ్లో పర్యటించినపుడు వారి సంస్కృతిలో భాగమైన బెల్లి డాన్స్ చూసినప్పుడు, సింగపూర్ దేశంలో రోప్ వే పై ప్రయాణించినప్పుడు కల్గిన అనుభూతితో రాసిన పద్యాలు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, ఎన్.టి. రామారావు, అక్కినేనిలపై రాసిన పద్యాలను రాగయుక్తంగా ఆలపించిన పాటలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
సమకాలీన సామాజిక, రాజకీయాల్లో పార్టీ మార్పిడిలు, రాజకీయ నాయకుల శుష్క వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేస్తున్న వైఖరిని ఎండగడుతూ వ్యంగ్య ధోరణితో పాడిన పేరడీ పాటలు కవి జొన్నవిత్తుల సామాజిక స్పృహను, యదార్థ స్థితిని గొప్పగా ఆవిష్కరించాయి. ప్రశ్నా విభాగంలో గత 75 ఏళ్లుగా భారతదేశం సాధించిన ప్రగతి, కోల్పోయిన మానవీయ సంబంధాలపై స్పందించమన్నపుడు ప్రస్తుతం కావాల్సింది సత్యం, ధర్మం, త్యాగం అనే లక్షణాలు కలిగిన సుపరిపాలన ప్రజలకందించేది నాయకులని, అలాంటి వారిని ప్రజలు ఎన్నుకోనంత వరకు దేశం పురోగతి సాధించజాలదని హితవు పలికారు.
ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు డా. ఎర్రాప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ.. మాట్లాడడం ఒక కళ అని, మనం మాట్లాడే మాటలు పలువుర్ని ఆకట్టుకునే విధంగా ఎలా ఉండాలి, ఒకే మాట పలు ప్రాంతాలలో ఎలాంటి విపరీతమైన అర్ధాలకు దారి తీస్తుంది, కొంచెం శ్రద్ధ వహిస్తే అందరూ బాగా మాట్లాడే అవకాశం ఉంటుంది అని “మాట తీరు” అనే అంశంపై అద్భుతంగా ప్రసంగించారు. తానా ఉత్తరాధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ.. ఘన చరిత్ర కల్గిన తెలుగు భాష, సాహిత్య వైభవాలను పరిరక్షించి పరివ్యాప్తి చేయడం, తెలుగు కవులు, కళాకారులను ఆదరించడంలో తానా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, తానా ప్రపంచ సాహిత్య వేదికను బలోపేతం చేయడంలో కృషి చేస్తున్న వారందరికీ, హాజరైన అతిథులకు, ప్రసారం చేసిన వివిధ ప్రసార మాధ్యమాల వారికి, వీక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి వార్షిక సదస్సు ఘనంగా నిర్వహించాలని ‘మాటా’ బోర్డు నిర్ణయం
వచ్చే ఏడాది ఏప్రిల్ 13, 14 తేదీలలో న్యూజెర్సీలో రాయల్ అల్బర్ట్ ప్యాలెస్లో 'మాటా' తొలి వార్షిక సదస్సును ఘనంగా నిర్వహించాలని బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. -
‘చంద్రమోహనునికి ప్రపంచవ్యాప్తంగా ఘన నివాళి’
ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్కు వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. -
Hongkong: హాంకాంగ్ తెలుగు సామాఖ్య ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ట్యూన్ మున్ కంట్రీ పార్కులో కార్తిక మాస వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. -
శివపదం గీతాలకు బాలిలో అద్భుత నృత్య ప్రదర్శన
శివపదం గ్లోబల్ ఫ్యామిలీ ఇండోనేషియాలోని బాలిలో భారతీయ శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించింది. తద్వారా ఏకత్వ సందేశాన్ని, కళలకు సరిహద్దులు లేవని చాటి చెప్పింది -
H-1B visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్న్యూస్.. ఇక అమెరికాలోనే వీసా రెన్యువల్!
H-1B visa: అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు అగ్రరాజ్యం గుడ్న్యూస్ చెప్పింది. స్వదేశాలకు వెళ్లకుండానే ఎన్నారైలు తమ హెచ్-1బీ వీసాలను రెన్యువల్ చేసుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్ను డిసెంబరు నుంచి అందుబాటులోకి తీసుకొస్తోంది. -
NRI: న్యూజెర్సీలో వైభవంగా కార్తిక పౌర్ణమి వేడుకలు.. పాల్గొన్న సింగర్ మంగ్లీ
అమెరికాలో.. న్యూజెర్సీలోని సాయిదత్తా పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా సింగర్ మంగ్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె శివుడి పాట పాడారు. మంగ్లీ ఆలపించిన పాటతో భక్తులు మంత్ర ముగ్ధులయ్యారు.
-
శివ నామస్మరణతో మార్మోగిన లిమెరిక్ నగరం
కార్తిక మాసం సందర్భంగా ఐర్లాండ్లోని లిమెరిక్ నగరం శివనామస్మరణతో మార్మోగింది. -
ఉత్సాహంగా తానా ‘నెల నెలా తెలుగు వెలుగు’ సాహిత్య సభ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. -
సింగపూర్లో భక్తి శ్రద్ధలతో కార్తిక వన భోజనాలు
వాసవి క్లబ్ మెర్లియన్ సింగపూర్ ఆధ్వర్యంలో కార్తిక వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. -
తాకా ఆధ్వర్యంలో కెనడాలో ఘనంగా దీపావళి వేడుకలు
తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో నవంబరు 18న కెనడాలోని గ్రేటర్ టోరొంటో మిస్సిస్సౌగ ఫీల్డ్ గేట్ ఉన్నత పాఠశాలలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. -
NRI: కెనడాలోని టొరొంటోలో ప్రవాసాంధ్రుల దీపావళి సంబరాలు
కెనడాలోని టొరొంటోలోని తెలుగువారు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాదాపు 800 ఎన్నారై కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యం కూచిపూడి ప్రదర్శించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలతో చిన్నారులు, కళాకారులు అలరించారు.
-
India-Canada: కెనడియన్లకు ఈ-వీసా సేవల పునరుద్ధరణ.. జీ20 భేటీ వేళ భారత్ కీలక నిర్ణయం!
India-Canada: కెనడా పౌరులకు ఈ-వీసా సేవల (E-Visa Services)ను భారత్ పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. దీంతో కెనడియక్లకు అన్ని రకాల వీసా సేవలను అందుబాటులోకి తెచ్చినట్లైంది. -
టాస్-యూకే ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకే (టాస్-యూకే) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. -
కెనడా డీటీసీ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు
కెనడాలోని టొరంటో నగరంలో డుర్హం తెలుగు క్లబ్ (డీటీసీ) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
యూఏఈ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
యూఏఈ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం దుబాయిలోని రాయల్ కాంకర్డ్ హోటల్లో నిర్వహించినట్లు సంఘం మీడియా డైరెక్టర్ అబ్దుల్ ఫహీమ్ షేక్ ఓ ప్రకటనలో తెలిపారు. -
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
Qatar: ఖతార్లో కార్తికమాస వనభోజనాలు..పెద్ద సంఖ్యలో హాజరైన ప్రవాసులు
ఖతార్లో కార్తిక మాస వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.దీనికి పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు హాజరయ్యారు. -
Chandrababu: అక్రమ కేసుల నుంచి చంద్రబాబు బయటపడాలని ఆకాంక్షిస్తూ శాంతిహోమం
అక్రమ కేసుల నుంచి తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ ఫిలడెల్ఫియాలో శాంతి హోమం నిర్వహించారు. -
పలు సేవల కోసం ప్రవాసులకు సభ్యత్వం ప్రారంభించిన ‘స్వదేశం’
ప్రవాసులకు సేవలు అందిస్తున్న ‘స్వదేశం’ (swadesam) సంస్థ మెంబర్షిప్ ప్రారంభించింది. దీనికి సంబంధించి డిజిటల్ ఐడీ కార్డులను అందించబోతోంది. దీనివల్ల ‘స్వదేశం’ సభ్యత్వం తీసుకున్న వారికి మరింత వేగంగా తమ సేవలు అందించడం సులువవుతుందని నిర్వాహకులు స్వాతి తెలిపారు. -
ఘనంగా సింగపూర్ తెలుగు సమాజం 49వ ఆవిర్భావ వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడి సీనియర్ సిటిజన్లతో సరదాగా గడిపి వారి అనుభవాలను తెలుసుకున్నారు. -
కాన్సాస్లో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక బ్లూ వ్యాలీ నార్త్ హైస్కూలో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు.