మల్కాజిగిరి మళ్లీ మనదే!
‘మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి మనమే గెలుస్తున్నాం.. కాంగ్రెస్ జెండా మళ్లీ ఎగరేద్దాం.. గట్టిగా ప్రచారం నిర్వహిద్దాం.. ఇక్కడ ఎంపీగా విజయం సాధించినందుకే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా..’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్ - జూబ్లీహిల్స్, న్యూస్టుడే: ‘మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి మనమే గెలుస్తున్నాం.. కాంగ్రెస్ జెండా మళ్లీ ఎగరేద్దాం.. గట్టిగా ప్రచారం నిర్వహిద్దాం.. ఇక్కడ ఎంపీగా విజయం సాధించినందుకే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా..’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసం వద్ద మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి నాయకులు, కార్యకర్తలదేనని.. భుజాలపై మోసి తనను దిల్లీకి పంపించారని వివరించారు. కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నుంచే మొదలైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ గెలిచినా మల్కాజిగిరి లోక్సభ నియోజకర్గ పరిధిలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కార్యకర్తల్లో కొంత అసంతృప్తి నెలకొందన్నారు. ఇప్పుడు లోక్సభ స్థానంలో కాంగ్రెస్ జెండాను ఎగరేసి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. మల్కాజిగిరి లోక్సభతోపాటు కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ గెలవాలని ఆకాంక్షించారు. హోలీ పండగలోగా అధిష్ఠానం పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించనుందని.. ఎన్నికల్లో కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మండువేసవిలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ఉదయం ఏడుగంటలకే ప్రచారం ప్రారంభించాలని.. బస్తీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ల వద్దకు వెళ్లాలని సీఎం సూచించారు.
మల్కాజిగిరి లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రతి నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని.. వారి ద్వారా పోలింగ్ బూత్లవారీగా పనివిభజన చేసుకుని రోజువారీ సమీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఇక్కడ ప్రచార సరళి రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలవాలన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మల్కాజిగిరి పరిధిలోని ప్రధాన ప్రాంతాలకు మెట్రోరైల్, ఎంఎంటీఎస్ రావాలంటే కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్య కాంగ్రెస్ మాత్రమే తీర్చగలదని.. ఐటీ పరిశ్రమలను మన ప్రభుత్వమే తీసుకువస్తుందంటూ ఓటర్లకు వివరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరించి స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల్లోని హామీలను అమలు చేస్తున్నామని.. ఆయా పథకాలు విజయవంతమయ్యాయని వివరించారు. సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, వికారాబాద్ జడ్పీఛైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్రెడ్డి, సీనియర్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, తోటకూర వజ్రేశ్యాదవ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి రాకేశ్రెడ్డి విజయం కోసం కృషి చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. -
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం: సీపీఐ నేత నారాయణ
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. -
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్లో అధిర్ రంజన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు మాటలు వినే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. -
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!