Rahul Gandhi: రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు మణిపుర్లో అనుమతి నిరాకరణ
బహిరంగ ప్రదేశాల్లో రాహుల్ భారత్ జోడో యాత్రకు మణిపుర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో యాత్ర రూట్మ్యాప్ను మార్చారు.
ఇంటర్నెట్డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) జనవరి 14 నుంచి ప్రారంభించాల్సిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు అడ్డంకులు ఎదురయ్యాయి. తూర్పు ఇంఫాల్లోని హట్టా కాంగ్జెబుంగ్లో మొదలు కావాల్సిన ఈ యాత్రకు మణిపుర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
మణిపుర్ పీసీసీ అధ్యక్షుడు కె.మేఘచంద్ర పార్టీ నాయకులతో కలిసి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్సింగ్ను కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని అక్కడ రాహుల్ యాత్రకు అనుమతి ఇవ్వలేమని ముఖ్యమంత్రి వారికి వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరమని మేఘచంద్ర పేర్కొన్నారు. ప్రజాహక్కులు, రాజకీయ హక్కుల ఉల్లంఘనగా దీనిని అభివర్ణించారు. బహిరంగ ప్రదేశాల్లో యాత్రకు అనుమతులు ఇవ్వకపోవడంతో.. థౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్థలానికి మార్చినట్లు వెల్లడించారు.
విధేయతతో ఉండండి.. దూకుడు వద్దు
రాహుల్ యాత్రకు అనుమతుల విషయంలో తమ ప్రభుత్వం పూర్తిగా భద్రతా సంస్థల నివేదికలపైనే ఆధారపడిందని సీఎం మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం చాలా సంక్లిష్టంగా మారిందన్నారు. ఈ యాత్ర జనవరి 14న మొదలై మార్చి 30న ముగుస్తుంది. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు కొనసాగనుంది. 100 లోక్సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల వారితో రాహుల్ మాట్లాడతారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ గతంలో వెల్లడించారు. మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో సాగనుంది. తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూనియర్లకు మంత్రి పదవులివ్వడాన్ని ఆహ్వానిస్తాం: ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు
‘జూనియర్లకూ మంత్రులుగా పనిచేసే అవకాశం ఇవ్వాలి. వారికి పదవులివ్వడాన్ని ఆహ్వానిస్తాం. సీనియర్లుగా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం’ అని నర్సీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. -
దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా వైకాపా తీరు: ఎమ్మెల్యే రఘురామ
‘దొంగే.. దొంగా దొంగా అన్నట్లు ఉంది వైకాపా నేతల తీరు. ఎవరూ ఎవరినీ ఏమీ అనకముందే వారిని కొట్టారంటూ దిల్లీలో విజయసాయిరెడ్డి పెడబొబ్బలు పెడుతున్నారు. -
చంద్రబాబు దార్శనికత రాష్ట్రానికి అవసరం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సామాజికవేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్లో పోస్టు చేశారు. -
హింసాత్మక ఘటనలకు వైకాపా వాళ్లే బాధ్యులు
పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య సహా అనేక మంది తెదేపా కార్యకర్తల్ని కిరాతకంగా చంపడం దారుణం కాదా? అని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. -
ప్రజాపాలన మొదలు.. సీఎంగా చంద్రబాబు రాకతో మంచిరోజులు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ వచ్చిందని తెదేపా సీనియర్ నేతలు వర్ల రామయ్య, టీడీ జనార్దన్ తెలిపారు. -
పింఛన్ల పెంపు గొప్ప విషయం: రామకృష్ణ
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
మెగా డీఎస్సీపై తొలి సంతకం హర్షణీయం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేయడాన్ని హర్షిస్తూ తెదేపా ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి, వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్లు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. -
ఎన్నికల ఫలితాలపై భాజపా సమీక్ష
వచ్చే నెల నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని భాజపా రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఆ పార్టీ పోటీ చేసిన శాసనసభ, లోక్సభ స్థానాల వారీగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం సమీక్షలు జరిగాయి. -
విజయసాయి విచారణ ఎదుర్కోవాల్సిందే: బుద్దా వెంకన్న
ఉత్తరాంధ్రను దోచుకున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదని, సమగ్ర విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెదేపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బుద్దా వెంకన్న హెచ్చరించారు. -
రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు సమష్టి కృషి
రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు సమష్టిగా కృషి చేద్దామని జనసేన నాయకులకు మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఏపీ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కోరారు. -
మహారాష్ట్రపై పట్టుకు గట్టి ప్రయత్నం
మహారాష్ట్రపై పూర్తి పట్టు సాధించేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ గురువారం తెలిపారు. -
మాది చేతల ప్రభుత్వమని నిరూపించాం
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఒకే రోజు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని నిరూపించామని మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎస్.సవిత అన్నారు. -
పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరిస్తాం
పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించడంపై ఎక్స్ వేదికగా గురువారం ఆయన స్పందించారు. -
రాజ్యసభ బరిలో సునేత్రా పవార్
మహారాష్ట్రలోని బారామతి నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగి ఓడిపోయిన సునేత్రా పవార్ (ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య) రాజ్యసభ ఎన్నికల బరిలో దిగారు. -
కళ్లు మూసుకుంటే ఐదేళ్లూ గడిచిపోయాయి
అలా కళ్లు మూసుకుంటే 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. అలాగే ఇప్పుడూ కళ్లు మూసుకుంటే 2029 వచ్చేస్తుంది. అప్పుడు మనదే అధికారం. -
ధరలను మోదీ అదుపు చేయలేరు: కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మే నెల ద్రవ్యోల్బణం గణాంకాలపై కాంగ్రెస్ పార్టీ గురువారం విరుచుకుపడింది. -
బాధ్యతగా నడుచుకుంటా: తీన్మార్ మల్లన్న
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)తో గురువారం శాసనమండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రమాణం చేయించారు. -
కేసీఆర్, హరీశ్రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది ముసళ్ల పండగ: రఘునందన్రావు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసిందని.. ఆయనతో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిలకు ముసళ్ల పండగ ముందుందని మెదక్ భాజపా ఎంపీ రఘునందన్రావు అన్నారు. -
కేసీఆర్కు సంజాయిషీ నోటీసులా?: శ్రవణ్
పగలు, ప్రతీకారాలకు, రాజకీయ కుయుక్తులకు సీఎం రేవంత్రెడ్డి పాలన పరాకాష్ఠగా మారిందని భారాస నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. -
అమిత్ షాతో ‘సీరియస్ చర్చ’.. ఆ విషయం గురించే: తమిళిసై
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సంభాషణపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టత ఇచ్చారు.