BRS: మల్కాజిగిరి, ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌

మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను భారత రాష్ట్ర సమతి (భారాస) ప్రకటించింది.

Updated : 19 Mar 2024 13:22 IST

హైదరాబాద్‌: మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను భారత రాష్ట్ర సమితి (భారాస) ప్రకటించింది. మల్కాజిగిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌కు ఆత్రం సక్కు అభ్యర్థిత్వాలను పార్టీ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. ఉప్పల్‌ టికెట్‌ దక్కకపోవడంతో లక్ష్మారెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీని వీడి భారాసలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ 11 లోక్‌సభ స్థానాలకు భారాస అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

భారాస ప్రకటించిన స్థానాలివే..

  • వరంగల్‌ - కడియం కావ్య
  • చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్‌
  • జహీరాబాద్‌ - గాలి అనిల్‌కుమార్‌
  • నిజామాబాద్‌ - బాజిరెడ్డి గోవర్ధన్‌
  • కరీంనగర్‌ - బి.వినోద్‌ కుమార్‌
  • పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్‌
  • మహబూబాబాద్‌ - మాలోత్‌ కవిత
  • మహబూబ్‌నగర్‌ - మన్నె శ్రీనివాస్‌రెడ్డి
  • ఖమ్మం- నామా నాగేశ్వరరావు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని