oxfam report 2021:కుబేరులకు కోట్లు కురిపించిన కొవిడ్
కొవిడ్ 19 విరుచుకుపడిన ఈ రెండేళ్లలో ప్రపంచమంతటా 99శాతం ప్రజల ఆదాయాలు కోసుకుపోయి 16 కోట్ల మంది
ఆక్స్ఫామ్ ప్రత్యేక నివేదికలో వెల్లడి
దిల్లీ, దావోస్: కొవిడ్ 19 విరుచుకుపడిన ఈ రెండేళ్లలో ప్రపంచమంతటా 99శాతం ప్రజల ఆదాయాలు కోసుకుపోయి 16 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోగా.. ధనవంతులు మాత్రం మహా సంపన్నులయ్యారని ఆక్స్ ఫామ్ సంస్థ వెల్లడించింది. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక ఆన్లైన్ శిఖరాగ్ర సభ ప్రారంభమైన సందర్భంగా ‘ప్రాణాంతక అసమానతలు’ అనే శీర్షికతో ఆక్స్ ఫామ్ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. కొవిడ్ కాలంలో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు కుబేరుల పాలిట కల్పవృక్షాలయ్యాయి. కేంద్ర బ్యాంకులు తమ తమ దేశాల ఆర్థిక పునరుద్ధరణకు లక్షల కోట్ల డాలర్లను విడుదల చేయగా, అవి స్టాక్ మార్కెట్కు చేరి కుబేరుల సంపదను కొండంతలు చేశాయి. ధనిక దేశాల ప్రభుత్వాలు కొవిడ్ టీకాలను తయారుచేయడానికి తమ ఫార్మా కంపెనీలకు వందల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం చేయగా, అవి టీకాలను అమ్ముకుని కోట్లకు పడగలెత్తాయి. కరోనా ముందునాళ్లతో పోలిస్తే, వైరస్ విరుచుకుపడిన ఈ రెండేళ్లలో ప్రపంచంలోని 10 మంది మహా కుబేరుల సంపద రెట్టింపై 111 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకింది. కొవిడ్ తెచ్చిపెట్టిన ఆర్థిక అసమానతల వల్ల ప్రపంచంలో ప్రతి 4 సెకన్లకు ఒకరు చొప్పున, రోజుకు 21,000 మంది చొప్పున మరణిస్తున్నారనే దారుణ సత్యాన్ని బయటపెట్టింది.
భారత్లోనూ మహాకుబేరులయ్యారు..
భారతదేశంలోనూ కుబేరులు మహాకుబేరులయ్యారు. దేశంలోని 10 మంది అతి సంపన్నుల వద్ద చేరిన ధనరాశులతో ప్రతి బిడ్డకూ 25 ఏళ్లపాటు పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు చదువు చెప్పవచ్చని ఆక్స్ ఫామ్ తెలిపింది. కొవిడ్ కాలంలో భారతీయ మహా సంపన్నుల సంఖ్య 39 శాతం పెరిగి 142కు చేరింది. వీరందరి వద్ద నేడు రూ. 53 లక్షల కోట్ల ధనం పోగుపడింది. దేశంలోని 55.5 కోట్లమంది నిరుపేదలకు మొత్తం రూ.43 లక్షల కోట్ల ఆస్తులు ఉండగా, కేవలం 98 మంది అతి సంపన్నుల వద్ద సరిగ్గా అంతే సంపద చేరింది. 98 మంది మహా కుబేరులపై ఒక్క శాతం సంపద పన్ను విధిస్తే, ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్ను ఏడేళ్లపాటు నిర్విఘ్నంగా నడపవచ్చు. వీరి వద్ద ఉన్న సంపద కేంద్ర బడ్జెట్ కన్నా 41 శాతం హెచ్చు. వారి మీద 4 శాతం సంపద పన్ను విధిస్తే రెండేళ్లపాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు నిధులు సమకూర్చవచ్చు.
* భారత్లోని 10 మంది శతకోటీశ్వరులు రోజుకు 10 లక్షల డాలర్ల చొప్పున ఖర్చుపెట్టినా వారి దగ్గరున్న ధనరాశులు కరిగిపోవడానికి 84 ఏళ్లు పడుతుంది. భారతీయ సంపన్నులందరి మీద 1శాతం పన్ను విధిస్తే, ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్ నిధులను 271శాతం పెంచవచ్చు. దానివల్ల ఏ ఒక్క భారతీయుడూ వైద్యం కోసం సొంత జేబు నుంచి ఖర్చుచేయాల్సిన అవసరం ఉండదు. 100 మంది శతకోటీశ్వరుల వద్ద ఉన్న మొత్తం సంపదతో రానున్న 365 ఏళ్లపాటు మహిళా స్వయం సహాయక సంఘాల కోసం జాతీయ గ్రామీణ జీవనాధార పథకాన్ని విజయవంతంగా నిర్వహించవచ్చు. లేదా 17 ఏళ్లపాటు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
ఇస్త్రీ చేసిన దుస్తులు కాకుండా ముడతల దుస్తులు వేసుకోవాలని పరిశోధక సంస్థ సీఎస్ఐఆర్ (CSIR) తన సిబ్బందిని కోరింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. -
న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం?
న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. -
నీట్ పేపర్ లీక్ అవాస్తవం
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్టీఏ కొట్టిపారేసింది. -
1992 ముంబయి దాడుల కేసులో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయండి
బాధితులకు నష్టపరిహారం చెల్లింపు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, పోలీస్ సంస్కరణలు సహా 1992 ముంబయి దాడుల కేసులో తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
బిహార్లో ఒకే కాన్పులో అయిదుగురు ఆడశిశువులు
బిహార్లోని కిషన్గంజ్ జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో అయిదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. -
కేరళ తీరంలో ఇరాన్ పడవ స్వాధీనం
ఇరాన్కు చెందిన ఓ పడవను కేరళ తీరంలో భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) బలగాలు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. -
జాఫ్నా-నాగపట్నం మధ్య 13 నుంచి ప్రయాణికుల నౌకలు
భారత్-శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌకల రాకపోకలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి