WPL 2024: ఆ పగిలిన అద్దాన్ని ఫ్రేమ్‌ కట్టించి.. బహుమతిగా ఇచ్చి : ఎలీస్‌ పెర్రీకి అరుదైన కానుక

అద్భుత ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బెంగళూరును ఫైనల్స్‌కు చేర్చిన ఎలీస్‌ పెర్రీ(Ellyse Perry)పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Published : 17 Mar 2024 13:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఉత్కంఠభరితంగా సాగుతున్న మహిళల ఐపీఎల్‌(WPL 2024) తుది అంకానికి చేరింది. నేడు జరిగే ఫైనల్‌లో దిల్లీతో ఆర్సీబీ తలపడనుంది. తన అద్భుత ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బెంగళూరును ఫైనల్స్‌కు చేర్చిన ఎలీస్‌ పెర్రీ(Ellyse Perry)పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయిపై విజయంలో ఆమె కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం పెర్రీకి ఊహించని బహుమతి అందింది.

లీగ్‌ దశలో యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెర్రీ కొట్టిన సిక్స్‌కు.. బౌండరీ లైన్‌ ఆవల ప్రదర్శనకు ఉంచిన టాటా పంచ్‌ ఈవీ కారు అద్దం పగిలిన విషయం తెలిసిందే. ఆ సిక్సర్‌కు గుర్తుగా టాటా సంస్థ.. పగిలిన ఆ కారు అద్దాన్ని ప్రేమ్‌ కట్టించి ఇప్పుడు పెర్రీకి బహూకరించడం విశేషం.

ఇక బెంగళూరు ఫైనల్‌ చేరడంతో.. ఆ జట్టు అభిమానులు దిల్లీలో సందడి చేస్తున్నారు. మెట్రో రైల్‌లో ‘ఆర్సీబీ ఆర్సీబీ.. పెర్రీ పెర్రీ’’ అంటూ వారు నినాదాలు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆదివారం దిల్లీ వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. సొంత మైదానంలో అత్యుత్తమ ప్రదర్శనతో టైటిల్‌ విజేతగా నిలవాలని దిల్లీ జట్టు భావిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా కప్‌ గెలవాలనే పట్టుదలతో బెంగళూరు ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని