CSK vs KKR: ఈ ఒక్కటి గెలిస్తే.. చెన్నైకి ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం!
ప్రస్తుతం చెన్నై (csk) 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కోల్కతాతో జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే సీఎస్కే 17 పాయింట్లకు చేరుతుంది. దీంతో ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకొనే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL 2023) లీగ్ స్టేజ్లో మ్యాచ్లు చివరి దశకు చేరాయి. ప్లేఆఫ్స్లో నాలుగు బెర్తుల కోసం ఏడు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండు స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్తో నేడు కోల్కతా నైట్రైడర్స్ (CSK vs KKR) తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో సీఎస్కే విజయం సాధిస్తే చాలు దాదాపు ప్లే ఆఫ్స్లో బెర్తును ఖాయం చేసుకొనే అవకాశం ఉంది. మరోవైపు కోల్కతాకు ఎలాగూ ప్లేఆఫ్స్కు చేరుకోవడం అసాధ్యం. చెపాక్ వేదికపై చెన్నైను కేకేఆర్ అడ్డుకోగలదో లేదో..?
హ్యాట్రిక్ విజయమేనా..?
ముంబయి, దిల్లీ జట్లను వరుసగా ఓడించి ఊపు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ విజయంతోపాటు ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. పాయింట్ల పట్టికలో టాప్ -2లో ఉన్నప్పటికీ లీగ్ దశ ముగిసేనాటికి కూడా అక్కడ ఉండాలంటే ఈ మ్యాచ్తోపాటు మిగిలిన చివరి పోరులోనూ (దిల్లీతో) గెలవాల్సి ఉంది. తుషార్ దేశ్ పాండే, మహీశ్ తీక్షణ, మతీషా పతిరణ, దీపక్ చాహర్, రవీంద్ర జడేజాతో కూడిన బౌలింగ్ విభాగం కీలక సమయాల్లో జట్టును విజయబాట పట్టించారు. బ్యాటింగ్లో శివమ్ దూబె, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా నుంచి ఇంకాస్త మెరుగైన ప్రదర్శన అవసరం. ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్న అంబటి రాయుడు ఫామ్లో లేకపోవడం సీఎస్కేకు లోటుగా ఉంది. ఆఖర్లో ఎంఎస్ ధోనీ దూకుడైన బ్యాటింగ్ చేస్తూ అండగా నిలుస్తున్నాడు.
వీరితో జాగ్రత్త..
ఈ మ్యాచ్లో చెన్నై విజయం సాధించాలంటే.. కోల్కతా హార్డ్ హిట్టర్లను అడ్డుకోవాలి. జేసన్ రాయ్, గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, ఆండ్రూ రసెల్, రింకు సింగ్తో కూడిన బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. వీరిలో ఏ ఇద్దరు క్రీజ్లో నిల్చున్నా కోల్కతా భారీ స్కోరు సాధించగలదు. అయితే, ఆరంభంలో అదరగొట్టిన కోల్కతా బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ, సునీల్ నరైన్ ‘సింగిల్’ మ్యాచ్ స్టార్లుగానే మారారు. ప్లేఆఫ్స్ అవకాశాలు లేనప్పటికీ.. పాయింట్ల పట్టికలో కోల్కతా తన స్థానం దిగజారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
జట్లు (అంచనా)
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వే, అజింక్య రహానె, శివమ్ దూబె, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, మహీశ్ తీక్షణ, మతీషా పతిరణ
కోల్కతా: జేసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా (కెప్టెన్), ఆండ్రూ రసెల్, రింకు సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, సుయాశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్. -
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కాలంటే దేశవాళీ క్రికెట్లో ఆడాలనే సూత్రాన్ని పక్కన పెట్టడంతో ఇషాన్, శ్రేయస్పై వేటుపడిన సంగతి తెలిసిందే. -
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
ఈ ఏడాది ఐపీఎల్ (IPL)లో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు, విమర్శలు ఇవిగో... -
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
చెన్నై ఎక్కడ మ్యాచ్ ఆడినా ప్రత్యేక ఆకర్షణ ఎంఎస్ ధోనీ. రెండు మ్యాచుల్లో మినహా ప్రతిసారీ అతడి బ్యాట్ నుంచి బౌండరీల వర్షం కురిసింది. మరోసారి అలాంటి ఇన్నింగ్స్లను చూడాలనేది అభిమానుల ఆకాంక్ష. -
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఎట్టకేలకు మళ్లీ జాతీయజట్టులోకి వచ్చాడు. పొట్టి కప్ కోసం ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కిన విషయం తెలిసిందే. -
మా కొంప ముంచిందవే.. భారీ మూల్యం చెల్లించాం: పంజాబ్ కోచ్
కీలకమైన ఆటగాళ్ల క్యాచ్లను వదిలేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో పంజాబ్ ఆటగాళ్లకు తెలిసొచ్చింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆరు క్యాచ్లను చేజార్చారు. -
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
క్రికెటర్ పట్ల ప్రాంచైజీ ఓనర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. అందులోనూ అతడు కెప్టెన్ కావడంతో విషయం సీరియస్గా మారింది. -
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు