Kuldeep - Jadeja: 3 ఓవర్లలో 4 వికెట్లు ఏంటి సంగతి.. ‘కుల్జా’ ముచ్చట్లలో ఇంకేం చెప్పారంటే?
వెస్టిండీస్తో మూడు వన్డేల(WI vs IND) సిరీస్లో భాగంగా తొలి వన్డేలో జడేజా-కుల్దీప్ ద్వయం అరుదైన ఘనత సాధించింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ విశేషాలివే.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్తో తొలి వన్డేలో భారత్ భారీ విజయానికి కుల్జా (కుల్దీప్ యాదవ్ - రవీంద్ర జడేజా) ద్వయం అదిరిపోయే బౌలింగ్ ఓ కారణం. ఇద్దరూ కలిపి ఏడు వికెట్లు తీసి వన్డే సిరీస్ శుభారంభానికి కారణమయ్యారు. ఈ మ్యాచ్ తర్వాత కుల్దీప్ - జడేజాల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. దానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. బంతి అందుకోగానే మూడు ఓవర్లు ముగించేలోపే నాలుగు వికెట్లు తీశావ్.. ఏంటి సంగతి? అంటూ జడేజా ప్రశ్నలు వేశాడు.. దానికి కుల్దీప్ గూగ్లీల్లాంటి సమాధానాలు కూడా ఇచ్చాడు.
‘‘నా కంటే ముందు బౌలింగ్ చేసిన ఫాస్ట్ బౌలర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముకేశ్కు తొలి మ్యాచ్ అయినా కూడా చక్కగా బౌలింగ్ చేశాడు. ఇక, నీ బౌలింగ్లో వరుస వికెట్లు తీశావు. నేను కూడా వికెట్లు తీయాలనే బౌలింగ్ చేశాను. అదృష్టం కొద్ది మూడు ఓవర్లలోనే నాలుగు వికెట్లు పడ్డాయి. ఒక టీమ్కు బౌలింగ్ బృందం ఇలా ఉంటేనే బాగుంటుంది’’ అని కుల్దీప్ తన వికెట్ల వేట వెనుక ఆలోచన చెప్పాడు. ‘‘వెస్టిండీస్ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేయాలనే ఉద్దేశంతోనే బౌలింగ్ చేశా. రెండో ఇన్నింగ్స్లో బంతి ఈ విధంగా బౌన్స్ అయితే పరుగులు చేయడం కష్టం అనిపించింది’’ అని జడేజా తన ఆలోచనలను వివరించాడు.
స్పిన్నర్ల మాయ.. ఇషాన్ దూకుడు.. తొలి వన్డేలో ఆసక్తికర వీడియోలు
‘‘విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టాడని, ఏ బౌలర్కైనా తన బౌలింగ్లో అలాంటి క్యాచ్ పడితే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఫీల్డర్ల నుంచి ఇలాంటి మద్దతు లభిస్తే.. కచ్చితంగా బౌలర్లు మరింత ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేస్తారు’’ అని కోహ్లీ క్యాచ్ గురించి జడేజా చెప్పాడు. ఆఖరిగా ‘‘నీతో కలిసి వికెట్లు తీయడం చాలా ఆనందంగా ఉంది. మనిద్దరం కలిసి వికెట్లు పడగొడుతూనే ఉందాం’’ అంటూ కుల్దీప్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కుల్చా (కుల్దీప్ - చాహల్) గురించి ఇన్నాళ్లూ అందరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్తో కుల్దీప్, జడేజాను కలిపి కుల్జా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!