‘ఈ’ రేసు ఇలా..
దాదాపు రెండు నెలల కిందట మోటార్ స్పోర్ట్స్ అభిమానుల్ని అలరించిన రేసుల పండుగ మళ్లీ వచ్చింది.
ఈనాడు - హైదరాబాద్
దాదాపు రెండు నెలల కిందట మోటార్ స్పోర్ట్స్ అభిమానుల్ని అలరించిన రేసుల పండుగ మళ్లీ వచ్చింది. ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) హైదరాబాదీలకు మోటార్ స్పోర్ట్స్ను పరిచయం చేయగా.. ఇప్పుడు అసలు సిసలు రేసులకు భాగ్యనగరం ఆతిథ్యమివ్వనుంది. ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్షిప్లో భాగంగా నాలుగో రేసుకు హైదరాబాద్ వేదికగా నిలవనుంది. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఫార్ములా ఈ కార్లతో శుక్ర, శనివారాల్లో హుస్సేన్ సాగర తీరం హోరెత్తిపోనుంది.
గత ఏడాది ఐఆర్ఎల్ తొలి సీజన్కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వగా.. అభిమానులకు మిశ్రమ అనుభూతి లభించింది. కొత్త ట్రాక్ కావడం.. నిర్వాహకులకు అనుభవం లేకపోవడంతో నవంబరులో జరిగిన తొలి రౌండ్ అర్ధంతరంగా రద్దవడం అభిమానుల్ని ఉసూరుమనిపించింది. అయితే డిసెంబరులో నాలుగో రౌండ్ రేసు విజయవంతంగా ముగిసి మోటార్ స్పోర్ట్స్ అభిమానుల్లో ఉత్సాహం తీసుకొచ్చింది. తాజా ఫార్ములా ఈ రేసుతో రెట్టింపు జోష్ ఖాయంగా కనిపిస్తోంది. పేరున్న జట్లు.. మెరుగైన డ్రైవర్లు.. ఎలక్ట్రిక్ కార్లతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్కు సరికొత్త కళ రానుంది. శనివారం ప్రధాన రేసు జరుగనుంది. ఐఆర్ఎల్ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న నిర్వాహకులు ట్రాక్, ప్రేక్షకుల గ్యాలరీల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 20 వేల మంది రేసును వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
టికెట్లు
హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్లో 20,000 మంది ప్రేక్షకులు రేసుల్ని వీక్షించేలా ఏర్పాటు చేశారు. ప్రేక్షకుల గ్యాలరీలను ఆరు విభాగాలు విభజించి టికెట్ రేట్లను నిర్ణయించారు. గ్రాండ్స్టాండ్లో రూ.1000, ఛార్జ్ గ్రాండ్స్టాండ్లో రూ.4000, ప్రిమియమ్ గ్రాండ్స్టాండ్లో రూ.7000, ఏస్ గ్రాండ్స్టాండ్లో రూ.10500, గ్రీన్కో లాంజ్లో రూ.65000, ఏస్ లాంజ్లో రూ. 125000 ధరలు ఉన్నాయి. బుక్మైషో యాప్లో టికెట్లు కొనుక్కోవచ్చు.
2.835 కిలోమీటర్ల పొడవున్న సర్క్యూట్పై 11 జట్ల తరఫున 22 మంది డ్రైవర్లు రేసులో పాల్గొంటారు. ట్రాక్పై మొత్తం 18 మలుపులు ఉన్నాయి. కాస్త అటుఇటుగా లుంబినీ పార్కు నుంచి రేసు ప్రారంభమవుతుంది. బీఆర్కే భవన్ సిగ్నల్ నుంచి కార్లు యూ టర్న్ తీసుకుంటాయి. నూతన సచివాలయం పక్క నుంచి ఎడమ వైపునకు తిరుగుతాయి. మింట్ కాంపౌండ్ దాటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మలుపు వద్ద కుడి వైపునకు వెళ్తాయి. ఐమ్యాక్స్ తర్వాత ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కుడి వైపునకు తిరిగిన తర్వాత రేసు ముగుస్తుంది. 35 నుంచి 40 ల్యాప్లు జరిగే రేసులో అగ్రస్థానంలో నిలిచిన రేసర్లు విజేతలుగా నిలుస్తారు.
రేసులు ఎలా
రేసు వారాంతంలో జరుగుతుంది. రేసును అయిదు సెషన్లుగా విడదీస్తారు. షేక్డౌన్, ఫ్రీ ప్రాక్టీస్ 1, ఫ్రీ ప్రాక్టీస్ 2, క్వాలిఫయింగ్, ప్రధాన రేసు
* ప్రధాన రేసుకు ముందు రోజు షేక్డౌన్ ఉంటుంది. కారు ఎలక్ట్రానిక్ సిస్టమ్ను డ్రైవర్లు పరిశీలించుకుంటారు. రేసుకు కారు సంసిద్ధతను పర్యవేక్షిస్తారు
* ప్రతి రేసుకు ముందు రెండు ప్రాక్టీస్ సెషన్లు ఉంటాయి. డబుల్ హెడర్ ఉంటే ఒక్క ప్రాక్టీస్ సెషన్ మాత్రమే నిర్వహిస్తారు. ప్రాక్టీసు సమయంలో ఆయా జట్లు.. డ్రైవర్లు తమ వేగం, నైపుణ్యాల్ని పరీక్షించుకోవచ్చు.
షెడ్యూల్
శుక్రవారం
మధ్యాహ్నం 2.30- 2.45 గంటలు: షేక్డౌన్
సాయంత్రం 4.30- 5 గంటలు: ఫ్రీ ప్రాక్టీస్ రేసు 1
శనివారం
ఉదయం 8.10- 8.40 గంటలు: ఫ్రీ ప్రాక్టీస్ రేసు 2
ఉదయం 10.40- 12.05 గంటలు: క్వాలిఫయింగ్
మధ్యాహ్నం 3.04 గంంటలకు: ప్రధాన రేసు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Hyderabad vs Lucknow: అదిరిపోయే క్యాచ్లతో.. హైదరాబాద్ ఆటగాళ్ల దూకుడు!
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా హైదరాబాద్, లఖ్నవూ జట్లు తలపడ్డాయి. హైదరాబాద్ ఆటగాళ్లు నితీశ్ రెడ్డి, సన్వీర్ సింగ్లు అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన చేశారు.
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
క్రికెట్ ఆట ఆడేది పదకొండు మందే.. కానీ ఒక ఆటగాడిని జట్టులోకి అదనంగా చేర్చుకుని బౌలింగ్, బ్యాటింగ్లోనూ ఉపయోగించుకోవడమే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన (impact player rule). -
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్లో పూర్’
ఒకరు మాజీ క్రికెటర్.. మరొకరు ప్రస్తుతం టీమ్ఇండియా కెప్టెన్. వీరద్దరూ కలిసి ఓ షోలో చెప్పిన విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. -
Rishab Pant: ఆట పట్టించిన అభిమాని.. రిషభ్ పంత్ ఏం చేశాడో తెలుసా?
ప్రముఖ యూట్యూబర్, మరగుజ్జు విభు వర్షిణి (Vibhu Varshney) దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వీరాభిమాని. ప్రాక్టీస్ చేస్తున్న రిషభ్ పంత్ను.. విభు వర్షిణి పలు ప్రశ్నలు అడుగుతూ చిరాకు తెప్పించాడు. దీంతో అతడిని స్టేడియంలో ఉన్న ఓ గేటుపైకి ఎక్కించాడు.
-
KL Rahul: కేఎల్ రాహుల్ మంచి మనసు.. చక్రాల కుర్చీలో ఉన్న అభిమాని దగ్గరికెళ్లి సెల్ఫీ
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా బుధవారం హైదరాబాద్తో మ్యాచ్ ఆడేందుకు లఖ్నవూ జట్టు భాగ్యనగరానికి వచ్చింది. అయితే ఓ దివ్యాంగుడు లఖ్నవూ జట్టుకు అభిమాని. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ అభిమాని దగ్గరికెళ్లి కరచాలనం చేసి.. అతడి సెల్ఫోన్ తీసుకుని స్వయంగా సెల్ఫీ దిగాడు.
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
ఐపీఎల్లో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోర్లు నమోదవుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే, టాప్ -4లో నిలిచి ప్లేఆఫ్స్కు అర్హత సాధించే జట్లేవనేది ఆసక్తికరంగా మారింది. -
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
హైదరాబాద్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మ్యాచ్ వచ్చేస్తోంది. లఖ్నవూతో ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. -
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
సంజూ శాంసన్ ఇచ్చిన క్యాచ్ను దిల్లీ ఫీల్డర్ షై హోప్ అద్భుతంగా పట్టాడు. కానీ, బౌండరీ లైన్కు అతడి పాదం తాకిందనే ఆరోపణలు వచ్చాయి. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్గా ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. -
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
దిల్లీ మళ్లీ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. రాజస్థాన్ను ఓడించడంలో ఆ జట్టు బౌలర్ కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
క్యాచ్ల విషయంలో రిప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అంపైర్లు పొరపాటు చేయడం సరైంది కాదనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. -
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
ఔట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాగ్వాదం చేసిన సంజూ శాంసన్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ భారీ జరిమానా విధించింది. -
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!