IND vs ENG : ఎవరొస్తారో? ఎవరుంటారో? ఇంగ్లాండ్తో మిగిలిన 3 టెస్టులకు టీమ్ఇండియా ఎలా ఉంటుందంటే?
కీలక ఆటగాళ్లు దూరం.. మరోవైపు గాయాల బెడద టీమ్ఇండియా (Team India)ను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో మిగతా మూడు టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించనుంది.
ఇంటర్నెట్డెస్క్ : వైజాగ్ టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. 1-1తో సిరీస్ను సమం చేసిన రోహిత్ సేన.. మిగతా మూడు టెస్టులపై దృష్టిసారించింది. ఈ మ్యాచ్లకు బీసీసీఐ (BCCI) టీమ్ఇండియా (Team India) జట్టును ప్రకటించనుంది. ఓవైపు కీలక ఆటగాళ్ల గాయాలబెడద, మరోవైపు ఫామ్ లేమి నేపథ్యంలో.. జట్టు ఎంపిక, కూర్పు ఎలా ఉండనుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఆ ఐదుగురు వస్తారా?
వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli).. మిగతా మ్యాచ్లకు ఆడేది అనుమానమే అంటున్నారు. కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడనీ.. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడి సన్నిహితుడు, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ (AB de Villiers) సోషల్ మీడియాలో వెల్లడించిన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్, జడేజా, షమీ గాయాల వల్ల జట్టుకు దూరం అయ్యారు. గాయంతో షమీ తొలి రెండు టెస్టులకు ఎంపిక కాలేదు. ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టత లేదు. తొలి టెస్టు ఆడిన జడేజా, రాహుల్ సిరీస్ మొత్తానికీ దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పని భారం నిర్వహణలో భాగంగా రెండో టెస్టుకు విశ్రాంతినిచ్చిన సిరాజ్ను.. మిగతా మ్యాచ్లకు ఎంపిక చేస్తారా, లేదా అన్నది చూడాలి.
అయ్యర్.. మంచి ఛాన్స్ను మిస్ చేసుకొన్నావు.. ఇక కష్టమే
శుభ్మన్ ఓకే.. మరి శ్రేయస్..?
గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న శుభ్మన్ గిల్ (Shubman Gill).. రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్లో అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. తనపై వస్తున్న విమర్శలకు ఈ ఇన్నింగ్స్తోనే సమాధానమిచ్చాడు. మరోవైపు శ్రేయస్ (Shreyas Iyer) నిరాశపరిచాడు. యువ ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో మరి అయ్యర్ను తర్వాత టెస్టులకు కొనసాగిస్తారా..? చూడాలి. రెండో టెస్టులో గిల్ గాయం బారినపడటం జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. చూపుడు వేలికి గాయం వల్ల.. అతడు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ఫీల్డింగ్కు రాలేదు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ మైదానంలోకి వచ్చాడు. మిగతా టెస్టులకు అందుబాటులో ఉండేది, లేనిది అతడి గాయం తీవ్రతపైనే ఆధారపడి ఉంటుంది. రెండో టెస్టు అనంతరం బీసీసీఐ మిగతా మూడు టెస్టులకు జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
ఎవరు రావొచ్చు
ఒకవేళ శ్రేయస్ అయ్యర్ను పక్కనపెట్టాల్సి వస్తే.. జట్టులో సర్ఫరాజ్ను తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న స్క్వాడ్లో అదనపు బ్యాటర్ లేడు. స్పిన్, ఆల్రౌండర్ల విషయంలో ఇబ్బంది లేకపోయినా, పేస్ విషయంలో జట్టు ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. తొలి టెస్టులో ఆకట్టుకోని సిరాజ్ను రెండో టెస్టులో పక్కనపెట్టారు. అతని స్థానంలో వచ్చిన ముకేశ్ కుమార్ ధారాళంగా పరుగులిచ్చేశాడు. టెయిలెండర్ వికెట్ తప్ప ఇంకేమీ దక్కలేదు. దీంతో బుమ్రాపైనే ఎక్కువ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో సిరాజ్ బదులు స్క్వాడ్లోకి వచ్చిన అవేశ్ఖాన్ను కొనసాగిస్తారా? లేక పూర్తిగా కొత్త పేసర్లను తీసుకుంటారా అనేది చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?