Kolkata : సూపర్ ఫామ్లో శ్రేయస్.. కోల్కతా ‘మూడో’ ముచ్చట తీరేనా..?
టీ20 లీగ్లో అత్యంత ఆకర్షణీయమైన జట్లలో...
అత్యంత ఆకర్షణీయమైన జట్లలో కోల్కతా ఒకటి. ఇప్పటి వరకు ప్రదర్శనపరంగా ఫర్వాలేదనిపించినా.. కీలక సమయాల్లో చేతులెత్తేసే బలహీనతతో పలు గెలిచే మ్యాచ్లను చేజార్చుకుంది. అలానే దూకుడుగా ఆడి ఓటమి నుంచి విజయతీరాలకు చేరిన చరిత్ర కేకేఆర్ది. రెండు సార్లు ఛాంపియన్గా నిలిచిన కేకేఆర్.. గత సారథులను వదిలేసుకుని భారీ మొత్తం వెచ్చించి మరీ కొత్త కెప్టెన్ను నియమించుకుంది. మరి ఈసారైనా ‘మూడు’ ముచ్చటను తీర్చుకుంటుందో లేదో వేచి చూడాలి.
ఎప్పుడో గౌతమ్ గంభీర్ (2012, 2014) కెప్టెన్గా ఉన్నప్పుడు కోల్కతా ఛాంపియన్గా నిలిచింది. గతేడాది ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఫైనల్కు చేరినా మూడోసారి అదృష్టం వరించలేదు. అయితే, అప్పుడు కీలకంగా ఉన్న శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, లాకీ ఫెర్గూసన్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ప్లేయర్లు ఇప్పుడు లేరు. వ్యక్తిగతంగా రాణించకపోయినా జట్టును నడిపించడంలో విజయవంతమైన మాజీ కెప్టెన్లు ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తిక్ను ఈసారి తీసుకోలేదు. అయితే, గతేడాది ఫామ్లో లేని ఆండ్రూ రస్సెల్ను మరోసారి రిటెయిన్ చేసుకున్న కోల్కతా. సునిల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తిని కూడా అట్టిపెట్టుకుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కాస్త బలహీనంగానే కనిపిస్తోంది.
ఇంకా కీలకమైన ఆటగాళ్లెవరంటే?
శ్రేయస్ అయ్యర్ను రూ. 12.50 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసుకొని సారథ్య బాధ్యతలను అప్పగించింది. 2020 సీజన్లో దిల్లీని ఫైనల్కు చేర్చిన చరిత్ర ఉంది. గత కొన్ని రోజులుగా ఫామ్ను చూసుకుంటే శ్రేయస్ పీక్స్లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో మూడు మ్యాచుల్లోనూ అర్ధశతకాలు బాదాడు. అందుకేనేమో కోల్కతా యాజమాన్యం శ్రేయస్ను ఎంచుకుంది. శ్రేయస్ అయ్యర్ కాకుండా జట్టులో వెంకటేశ్ అయ్యర్, రస్సెల్, చమిక కరుణరత్నె, సునిల్ నరైన్, నితీశ్ రాణా, ప్యాట్ కమిన్స్, మహమ్మద్ నబీ, అంజిక్య రహానె బాగా సుపరిచితులు.
బ్యాటింగ్లో ఆదుకునేది..!
ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలిగే సత్తా సునిల్ నరైన్ సొంతం. ఇక ఓపెనర్లుగా వెంకటేశ్ అయ్యర్తో సందర్భాన్ని బట్టి నరైన్ దిగుతాడు. అయితే వీరిద్దరూ లెఫ్ట్ హ్యాండర్లు. ఈ నేపథ్యంలో వెంకటేశ్కు తోడుగా ఎవరిని పంపుతుందో వేచి చూడాలి. వన్డౌన్లో అయితే శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, అలెక్స్ హేల్స్, ఆండ్రూ రస్సెల్, అజింక్యా రహానె (తుది జట్టులో ఉంటే), షెల్డన్ జాక్సన్, నబీ, కరుణరత్నె, అనుకుల్ రాయ్ తదితరులు బ్యాటింగ్ చేస్తారు. అయితే, వీరిలో వెంకటేశ్, నితీశ్ రాణా, శ్రేయస్ అయ్యర్, సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ మినహా ఎవరిపైనా పెద్దగా అంచనాలు లేవు.
బౌలింగ్ విభాగం అదుర్స్..
కోల్కతా జట్టులో బౌలర్లకు కొదవ లేదు. ప్యాట్ కమిన్స్, ఉమేశ్ యాదవ్, శివమ్ మావి, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, మహమ్మద్ నబీ.. 25 మందిలో మూడొంతుల మంది బౌలింగ్ చేస్తారు. అయితే, తుది జట్టులో కమిన్స్/సౌథీ, ఉమేశ్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి ఉండటం ఖాయం. ఆల్రౌండర్ల జాబితాలో సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ ఎలానూ జట్టులో ఉంటారు. బౌలింగ్పరంగా ఇబ్బందులు లేనప్పటికీ బ్యాటింగ్ బలహీనంగా ఉండటంతో అద్భుత బౌలింగ్ కూడా వృథా అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో శ్రేయస్తో సహా కోల్కతా ఫ్రాంచైజీ బ్యాటింగ్పై మరింత దృష్టిసారించాల్సి ఉంటుంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Hyderabad vs Lucknow: అదిరిపోయే క్యాచ్లతో.. హైదరాబాద్ ఆటగాళ్ల దూకుడు!
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా హైదరాబాద్, లఖ్నవూ జట్లు తలపడ్డాయి. హైదరాబాద్ ఆటగాళ్లు నితీశ్ రెడ్డి, సన్వీర్ సింగ్లు అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన చేశారు.
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
క్రికెట్ ఆట ఆడేది పదకొండు మందే.. కానీ ఒక ఆటగాడిని జట్టులోకి అదనంగా చేర్చుకుని బౌలింగ్, బ్యాటింగ్లోనూ ఉపయోగించుకోవడమే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన (impact player rule). -
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్లో పూర్’
ఒకరు మాజీ క్రికెటర్.. మరొకరు ప్రస్తుతం టీమ్ఇండియా కెప్టెన్. వీరద్దరూ కలిసి ఓ షోలో చెప్పిన విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. -
Rishab Pant: ఆట పట్టించిన అభిమాని.. రిషభ్ పంత్ ఏం చేశాడో తెలుసా?
ప్రముఖ యూట్యూబర్, మరగుజ్జు విభు వర్షిణి (Vibhu Varshney) దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వీరాభిమాని. ప్రాక్టీస్ చేస్తున్న రిషభ్ పంత్ను.. విభు వర్షిణి పలు ప్రశ్నలు అడుగుతూ చిరాకు తెప్పించాడు. దీంతో అతడిని స్టేడియంలో ఉన్న ఓ గేటుపైకి ఎక్కించాడు.
-
KL Rahul: కేఎల్ రాహుల్ మంచి మనసు.. చక్రాల కుర్చీలో ఉన్న అభిమాని దగ్గరికెళ్లి సెల్ఫీ
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా బుధవారం హైదరాబాద్తో మ్యాచ్ ఆడేందుకు లఖ్నవూ జట్టు భాగ్యనగరానికి వచ్చింది. అయితే ఓ దివ్యాంగుడు లఖ్నవూ జట్టుకు అభిమాని. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ అభిమాని దగ్గరికెళ్లి కరచాలనం చేసి.. అతడి సెల్ఫోన్ తీసుకుని స్వయంగా సెల్ఫీ దిగాడు.
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
ఐపీఎల్లో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోర్లు నమోదవుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే, టాప్ -4లో నిలిచి ప్లేఆఫ్స్కు అర్హత సాధించే జట్లేవనేది ఆసక్తికరంగా మారింది. -
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
హైదరాబాద్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మ్యాచ్ వచ్చేస్తోంది. లఖ్నవూతో ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. -
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
సంజూ శాంసన్ ఇచ్చిన క్యాచ్ను దిల్లీ ఫీల్డర్ షై హోప్ అద్భుతంగా పట్టాడు. కానీ, బౌండరీ లైన్కు అతడి పాదం తాకిందనే ఆరోపణలు వచ్చాయి. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్గా ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. -
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
దిల్లీ మళ్లీ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. రాజస్థాన్ను ఓడించడంలో ఆ జట్టు బౌలర్ కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
క్యాచ్ల విషయంలో రిప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అంపైర్లు పొరపాటు చేయడం సరైంది కాదనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. -
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
ఔట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాగ్వాదం చేసిన సంజూ శాంసన్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ భారీ జరిమానా విధించింది. -
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్