PBKS vs LSG: బ్యాటర్ల ఊచకోత.. రికార్డుల మీద రికార్డులు!
బ్యాటింగ్కు అనుకూలంగా మారిన మొహాలి పిచ్పై బౌలర్లకు చుక్కలు కనిపించాయి. పంజాబ్ - లఖ్నవూ (PBKS vs LSG) జట్లలోని బ్యాటర్లు దూకుడుగా ఆడేయడంతో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయినా చివరికి లఖ్నవూ విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఐపీఎల్ సీజన్లో (IPL 2023) అత్యధిక స్కోరు.. ఓవరాల్గా రెండో అత్యధికం. బౌండరీల పరంగానూ సరికొత్త రికార్డు. ఒకే మ్యాచ్లో భారీగా పరుగులు నమోదైన మూడో సందర్భం.. ఇలా శుక్రవారం జరిగిన పంజాబ్ కింగ్స్ - లఖ్నవూ సూపర్ జెయింట్స్ (PBKS vs LSG) మ్యాచ్ పలు విశేషాలకు వేదికైంది. తొలుత లఖ్నవూ బ్యాటర్లు విధ్వంసం సృష్టించడంతో 257/5 భారీ స్కోరు చేసింది. ఈ భారీ స్కోరును చూడగానే ఫలితంపై అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. అయితే, తామేం తక్కువ కాదంటూ చివరి వరకూ పోరాడిన పంజాబ్ కింగ్స్ కూడా 201 పరుగులు చేయడం విశేషం. టార్గెట్ మరీ ఎక్కువగా ఉండటంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎలా ఆడాలో ముందే నిర్ణయించుకున్నాం: రాహుల్
ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ మాకు చాలా కీలకం. పంజాబ్పై గెలవడం బాగుంది. గత మ్యాచ్లో (గుజరాత్పై) ఓడిపోవడం నిరుత్సాహానికి గురి చేసింది. ఆ ఓటమి నుంచి బయటపడి ఫ్రెష్గా పంజాబ్తో ఆడాం. బ్యాటింగ్ ఎలా చేయాలో ముందే నిర్ణయించుకున్నాం. ఇలాంటి వికెట్ బ్యాటర్లలో ఉత్సాహం తెస్తుంది. 250కిపైగా పరుగులు సాధించడం తేలికేం కాదు. పిచ్ నుంచి సహకారం లభిస్తే చెలరేగిపోవచ్చు. మేయర్స్, బదోని, పూరన్, స్టొయినిస్తో కూడిన భారీ హిట్టింగ్ లైనప్ మాకుంది.
మిస్ఫైర్ అయింది: ధావన్
తొలుత బౌలింగ్లో భారీగా పరుగులు ఇచ్చేశాం. అదనపు బౌలర్తో బరిలోకి దిగిన వ్యూహం మిస్ఫైర్ అయింది. మరొక స్పిన్నర్ లేకుండా ఆడాం. నాకు ఇదొక గుణపాఠం. ఇక ఛేదనలోనూ మంచి ఆరంభం దక్కలేదు. మేం బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాటింగ్కు అనుకూలంగా లేదనిపించింది. భారీ షాట్కు యత్నించి నేరుగా ఫీల్డర్ చేతికే క్యాచ్ ఇచ్చా. లివింగ్స్టోన్, సామ్ కరన్ ఉండటంతో షారుఖ్ ఖాన్ను వారి తర్వాత బ్యాటింగ్కు దింపాల్సి వచ్చింది. అయినా మా బ్యాటర్లు మంచి స్కోరే సాధించగలిగారు.
రికార్డుల హోరు..
* లఖ్నవూ సాధించిన భారీ స్కోర్ (257/5) ఓ రికార్డు. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు ఇది. తొలి స్థానం మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరిట ఉంది. 2013లో పుణెపై 263/5 స్కోరు సాధించింది.
* పంజాబ్ కూడా రెండొందలకు పైగా పరుగులు చేయడంతో మరో రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్లో నమోదైన మొత్తం పరుగులు 458. ఇదీ కూడా ఐపీఎల్లో ఓ రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఇలా రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి భారీగా పరుగులు నమోదైన మూడో మ్యాచ్గా ఘనత సాధించింది. దీనికంటే ముందు సీఎస్కే X ఆర్ఆర్ (2010లో) 469 పరుగులు.. పంజాబ్ కింగ్స్ X కేకేఆర్ (2018లో) 459 పరుగులు నమోదు చేశాయి.
* ఈ మ్యాచ్లో మొత్తం 16 మంది బౌలింగ్ చేశారు. పంజాబ్ నుంచి ఏడుగురు, లఖ్నవూ నుంచి ఏకంగా 9 మంది బౌలర్లను ఆయా జట్లు ప్రయోగించాయి. ఇలా ఒకే ఇన్నింగ్స్లో ఎక్కువ మంది బౌలర్లను వినియోగించిన రెండో జట్టుగా లఖ్నవూ రికార్డు సాధించింది. అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా గుజరాత్ లయన్స్పై 9 మంది బౌలర్లను వాడేసింది.
* అత్యధికంగా బౌండరీలు నమోదైన రెండో మ్యాచ్గా పంజాబ్ కింగ్స్ - లఖ్నవూ పోరు నిలిచింది. ఈ మ్యాచ్లో మొత్తం 67 బౌండరీలు నమోదు కాగా.. ఇందులో 45 ఫోర్లు, 22 సిక్స్లు ఉన్నాయి. తొలి రికార్డు సీఎస్ x ఆర్ఆర్ (2010లో) మ్యాచ్ పేరిట ఉంది. మొత్తం 69 బౌండరీలు కొట్టగా.. అందులో 39 ఫోర్లు, 30 సిక్స్లు ఉన్నాయి.
* సగం మ్యాచ్లు మాత్రమే ముగిసిన ప్రస్తుత ఐపీఎల్ సీజన్ అరుదైన ఘనత ఖాతాలో వేసుకుంది. పంజాబ్ - లఖ్నవూ మ్యాచ్ ఈ సీజన్లో 38వ మ్యాచ్. ఇప్పటికే 200+ స్కోరు 20 సార్లు నమోదు కావడం విశేషం. గతేడాది టోర్నీ మొత్తం 18 సార్లు మాత్రమే 200+ పరుగులను ఆయా జట్లు సాధించాయి. ఈ సీజన్లో ఇంకా మరిన్ని మ్యాచ్లు ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gujarat vs Bengaluru: గుజరాత్పై బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విన్నింగ్ సెలబ్రేషన్స్ మీరూ చూడండి.
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో నెగ్గి సంచలనం సృష్టించిన తెలుగు కుర్రాడు గుకేశ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ భారీ నగదు ప్రోత్సాహకంతో సన్మానించారు. -
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
బంగ్లాతో తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. -
Gujarat Vs Bengaluru: విల్ జాక్స్ సూపర్ సిక్స్.. ఆశ్చర్యంలో విరాట్ కోహ్లీ..!
గుజరాత్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జాక్స్ కొట్టిన సిక్స్లను చూస్తూ విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ మీరూ చూడండి.
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!