IND vs BAN: బంగ్లాదేశ్ గెలిస్తే.. ఆ దేశ క్రికెటర్తో డిన్నర్ డేట్కు వెళ్తా: విషం కక్కిన పాక్ నటి
ప్రపంచకప్లో భాగంగా అక్టోబర్ 19న భారత్, బంగ్లాదేశ్ (IND vs BAN) తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో భారత్ను బంగ్లాదేశ్ ఓడిస్తే బంగ్లా క్రికెటర్తో డేట్కు వెళ్తానని ఓ పాక్ నటి సంచలన ప్రకటన చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (Pakistan)పై భారత్ మరోసారి ఆధిపత్యం చలాయించిన సంగతి తెలిసిందే. ఇటీవల వరల్డ్ కప్లో పాకిస్థాన్ను భారత్ చిత్తుగా ఓడించడంతో పాక్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కనీసం గట్టిపోటీ కూడా ఇవ్వకుండా పాక్ చేతులెత్తేయడంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు రగిలిపోతున్నారు. దీంతో ప్రపంచకప్లో భారత్ తదుపరి మ్యాచ్ల్లో ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారి (Sehar Shinwari) సంచలన ప్రకటన చేసింది. అక్టోబర్ 19న భారత్, బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టీమ్ఇండియాను బంగ్లా ఓడిస్తే.. బంగ్లాదేశ్ (Bangladesh) ఆటగాడితో డిన్నర్ డేట్కు వెళ్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే, ప్రకటన భారత్, పాక్ మ్యాచ్ జరిగిన మరుసటి రోజు (అక్టోబర్ 15)నే చేయగా ఇప్పుడు వైరల్గా మారింది.
‘‘భగవంతుడా.. టీమ్ఇండియాను బంగ్లాదేశ్ ఓడిస్తే ఢాకాకు వెళ్లి ఆ దేశ క్రికెటర్తో డిన్నర్ డేట్కు వెళ్తా’’ అని సెహర్ షిన్వారి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్టు చేసింది. ఈ నటి గతంలో వివాదస్పద పోస్ట్లు చేసింది. ఈ ఏడాది ఆసియా కప్లో సూపర్-4 మ్యాచ్లో భారత్తో జరిగిన మ్యాచ్లో పాక్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అప్పుడు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, జట్టు సభ్యులపై కేసు పెడతానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పాక్ ఆటగాళ్లు ప్రతిసారి క్రికెట్ ఆడటానికి బదులు దేశ ప్రజల ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారని ఆరోపించింది.
ఎవరీ సెహర్ షిన్వారి?
సెహరి షిన్వారి పాక్లోని సింధు ప్రావిన్స్లోని హైదరాబాద్లో జన్మించింది. షిన్వారి తెగకు చెందిన ఈమె నటిగా రాణిస్తోంది. సెహరి నటన వైపు వెళ్తానంటే తొలుత కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినా పట్టువిడవకుండా తన కలను సాకారం చేసుకుంది. 2014లో కామెడీ సీరియల్ ‘‘సైర్ సావా సైర్’’ ద్వారా అరంగేట్రం చేసింది.
బంగ్లాదేశీయులపై పాక్ ఆగడాలు
ప్రస్తుత బంగ్లాదేశ్ను 1947 నుంచి 1971 వరకు తూర్పు పాకిస్థాన్గా పేర్కొనేవారు. అప్పట్లో పాక్ పాలకులు వీరిపై అనేక రకాల హింసకు పాల్పడేవారు. ఈ హింసను భరించలేకే 1971లో ప్రజాఉద్యమం ప్రారంభమైంది. పాక్ సైన్యం వేలాదిమందిని కాల్చివేయడంతో లక్షలాదిమంది ప్రజలు భారత్కు తరలివచ్చారు. ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సారథ్యంలోని కేంద్రం యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో పాక్ ఓడిపోయింది. తూర్పు పాకిస్థాన్ అనే ప్రాంతం బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది. మన దేశానికి వేలాది మంది సైనికుల బలిదానంతో బంగ్లాదేశ్ ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట