GT vs CSK: గుజరాత్తో తొలి మ్యాచ్.. ధోనీ అందుబాటులో ఉంటాడా..? లేదా..?
ఇవాళ సాయంత్రం ఐపీఎల్ ( IPL 2023) 16వ సీజన్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల (GT vs CSK) మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ (IPL 2023) 16వ సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. సినీ తారలు తమన్నా భాటియా, రష్మిక మంధాన ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అతిపెద్ద మైదానం నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల (GT vs CSK) మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. అరంగేట్రం చేసిన తొలి ఏడాదే కప్ను సొంతం చేసుకున్న హార్దిక్ పాండ్య నాయకత్వంలోని గుజరాత్ మరోసారి టైటిల్పై కన్నేసింది. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే నాలుగుసార్లు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఐదు టైటిళ్లను గెలిచిన ముంబయితో సమంగా నిలిచేందుకు ఎంఎస్ ధోనీకి ఇదొక అవకాశం. అయితే గుజరాత్తో జరిగే తొలి మ్యాచ్కు ధోనీ అందుబాటులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధోనీ స్వల్ప గాయం బారిన పడినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ టైటిల్తో దిగిన ఫొటోషూట్లో ధోనీ (MS Dhoni) ఉన్నాడు. ప్రాక్టీస్ సందర్భంగా అతడు స్వల్పంగా గాయపడినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఒకవేళ మొదటి మ్యాచ్లో ధోనీ ఆడకపోతే రవీంద్ర జడేజా జట్టును నడిపించే అవకాశం ఉంది. అయితే, సీఎస్కే ఫ్రాంచైజీ సీఈవో మాత్రం ధోనీ ఆడతాడనే భరోసా ఇచ్చారు. ఇక జట్టు సభ్యుల విషయానికొస్తే.. మినీ వేలంలో భారీ ధరను (రూ. 16.25 కోట్లు) వెచ్చించి మరీ బెన్ స్టోక్స్ను సీఎస్కే కొనుగోలు చేసింది. ఆల్రౌండ్ పాత్రను పోషిస్తాడని భావిస్తోంది. గతేడాది గాయం కారణంగా టోర్నీకి దూరమైన దీపక్ చాహర్ రావడంతో చెన్నై బౌలింగ్ విభాగం పటిష్ఠంగా మారనుంది. ఓపెనర్లుగా డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ను ప్రారంభించడం దాదాపు ఖాయం. అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్ మిడిలార్డర్లో కీలకమవుతారు. పేసర్ ముకేశ్ చౌదరి గాయం కారణంగా టోర్నీనుంచి వైదొలిగాడు. మిస్టరీ స్పిన్నర్ మహీశ్ తీక్షణ తన ఫామ్ను కొనసాగించేందుకు ఆత్రుతగా ఉన్నాడు.
కేన్కు అవకాశం..! (Kane Williamson)
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఈసారి సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది. గతేడాది సమష్ఠిగా రాణించి మరీ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఇదే పోరాటంతో ముందుకు సాగాలని హార్దిక్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది. గతేడాది కీలక ఇన్నింగ్స్లు ఆడిన డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం సీజన్ తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు. ఇక మినీ వేలంలో కేన్ విలియమ్సన్ను దక్కించుకున్న గుజరాత్.. అతడికి అవకాశం ఇస్తుందో లేదో వేచి చూడాలి. ఓడియన్ స్మిత్, కేఎస్ భరత్, జాషువా లిటిల్, శుభ్మన్ గిల్, రాహుల్ తెవాతియా, వృద్ధిమాన్ సాహా బ్యాటింగ్లో కీలకం. ఇక బౌలింగ్ విభాగంలో పాండ్యతోపాటు అల్జారీ జోసెఫ్, జయంత్ యాదవ్, రషీద్ ఖాన్, సాయికిశోర్, శివమ్ మావి రాణిస్తే గుజరాత్కు తిరుగుండదు.
తుది జట్లు (అంచనా): (Teams)
గుజరాత్: శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, మ్యాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), రషీద్ ఖాన్, రాహుల్ తెవాతియా, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, శివమ్ మావి,
చెన్నై: డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, సిమర్జీత్ సింగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ