Smartphones: మోటో 5జీ ఫోన్‌.. శాంసంగ్ బడ్జెట్ మోడల్‌!

మోటోరోలా కంపెనీ 5జీ మోడల్‌ను, శాంసంగ్ బడ్జెట్ శ్రేణిలో కొత్త  మోడల్‌ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేశాయి. వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి మరి!

Updated : 25 Feb 2022 22:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శాంసంగ్‌ (Samsung), మోటోరోలా (Motorola) కంపెనీలు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేశాయి. శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో బడ్జెట్‌ ఫోన్‌ను, మోటోరోలా ప్రీమియం శ్రేణిలో 5జీ మోడల్‌ను తీసుకొచ్చాయి. ఈ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లున్నాయి? ధరెంత? ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయనేది చూద్దాం. 


మోటోరోలా ఎడ్జ్‌ 30 ప్రో (Motorola Edge 30 Pro)

క్వాల్‌కామ్‌ తయారు చేసిన కొత్త స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 1 5జీ ప్రాసెసర్‌ను మోటోరోలా ఎడ్జ్‌ 30 ప్రోలో ఉపయోగించారు. 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల మాక్స్‌ విజన్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఇంజిన్‌ సాంకేతికతను ఉపయోగించినట్లు మోటోరోలా పేర్కొంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. మాల్‌వేర్‌, ఫిషింగ్‌ వంటి వాటి నుంచి భద్రత కల్పించేందుకు థింక్‌షీల్డ్‌ సెక్యూరిటీని ఉపయోగించారు.

ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు ఒకటి ఇస్తున్నారు. వెనుకవైపు రెండు 50 ఎంపీ కెమెరాలతోపాటు 2 ఎంపీ కెమెరా ఉన్నాయి. ముందుభాగంలో 60 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే 50 శాతం ఛార్జింగ్‌ అవుతుందని మోటోరోలా చెబుతోంది. అలానే 5 వాట్‌ పవర్‌ షేరింగ్ ఫీచర్‌ కూడా ఉంది. మోటోరోలా ఎడ్జ్‌ 30 ప్రో 8 జీబీ ర్యామ్‌/ 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 44,999. మార్చి 4 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు.    


శాంసంగ్‌ గెలాక్సీ ఏ03 (Samsung Galaxy A03)

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ కోర్‌ 3.1 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫీనిటీ-వీ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్ యూనిసాక్‌ టీ606 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. శాంసంగ్ గెలాక్సీ ఏ03లో మొత్తం మూడు కెమెరాలున్నాయి. వెనుకవైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 2 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ముందుభాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రోజంతా పనిచేస్తుందని శాంసంగ్‌ చెబుతోంది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ లభిస్తుంది. 3 జీబీ ర్యామ్‌/32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,499. 4 జీబీ/64 జీబీ వేరియంట్‌ ధర రూ. 11,999. శాంసంగ్‌ వెబ్‌సైట్‌తోపాటు అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు