మాజీ ప్రియుడితో కలిసి బాలుడిపై అఘాయిత్యం
బాలుడిపై దగ్గరి బంధువు అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా మాజీ ప్రియుడితో కలిసి వీడియో తీసి బెదిరింపులకు దిగింది. అతని ఇంట్లోని బంగారం, నగదు...
వీడియో తీసి, బెదిరించి రూ.16 లక్షల దోపిడీ
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: బాలుడిపై దగ్గరి బంధువు అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా మాజీ ప్రియుడితో కలిసి వీడియో తీసి బెదిరింపులకు దిగింది. అతని ఇంట్లోని బంగారం, నగదు స్వాహా చేసింది. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న బాలుడి(14) కుటుంబం ఇటీవల టోలిచౌకి నుంచి జూబ్లీహిల్స్కు మారింది. ఈ సమయంలో అల్మారాలోని 20 తులాల బంగారం కనిపించలేదు. వెదికినా ఫలితం లేకపోయింది. బాలుణ్ని తల్లి ప్రశ్నించడంతో, బెంగళూరులో నివసించే తండ్రి బంధువుకు ఇచ్చినట్లు తెలిపాడు. ఎందుకు ఇచ్చావని ప్రశ్నించగా గతంలో పాఠశాల వద్దకు వచ్చి తనను చార్మినార్లోని లాడ్జ్కు తీసుకెళ్లిందని, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపాడు. మాజీ ప్రియుడితో కలిసి దీన్ని ఆమె వీడియో తీసి, బెదిరించడంతో ఇంట్లోని 20 తులాల బంగారంతోపాటు రూ.6 లక్షలు ఇచ్చానని చెప్పాడు. తన కుమారుడిపై ఆమె మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడిందని చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి తల్లి బుధవారం ఫిర్యాదు చేశారు. నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మూడేళ్ల కిందట జరిగిందని, పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
నేలపైనే గూడు.. ఒకే భాగస్వామి తోడు..
కంటి చుట్టూ పసుపురంగు వలయంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ చిన్న పక్షి హైదరాబాద్లోని కాప్రా చెరువు వద్ద కనిపించింది. ‘‘ఇది ‘లిటిల్ రింగ్డ్ ప్లవర్’ (శాస్త్రీయనామం చరడ్రియస్ డుబియస్) జాతికి చెందిన పక్షి. -
రామయ్య హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 35 రోజులకు రూ.1,31,84,181 నగదు రూపంలో సమకూరింది. -
టెట్ సమస్యకు త్వరలో పరిష్కారం
ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియకు అడ్డంకిగా మారిన టెట్ అర్హత సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు. -
టెట్ వాయిదా అంశాన్ని పరిశీలించండి
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక దృష్ట్యా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశానికి సూచించారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్రమే
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
దండకారణ్యం ‘కోట’కు బీటలు!
మావోయిస్టుల కోట బీటలు వారుతోంది. ఇన్నాళ్లూ వారికి పెట్టనికోటగా ఉన్న ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం.. క్రమంగా భద్రతా బలగాల అధీనంలోకి వస్తోంది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ఇదీ సంగతి!
-
మోసపోయి కాంగ్రెస్కు ఓటేయొద్దు: భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు, డొంకేశ్వర్ మండల కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.