రాష్ట్రానికి మరో మూడు ప్రముఖ సంస్థలు
రాష్ట్రానికి మరో మూడు ప్రసిద్ధ సంస్థలు రానున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు తమ కేంద్రాల ఏర్పాటుకు సుముఖత
రూ.150 కోట్లతో ‘కాల్అవే గోల్ఫ్’ డిజిటెక్ కేంద్రం
ఐటీ అభివృద్ధి కేంద్రం నెలకొల్పనున్న ‘ఫిస్కర్’
రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ వాహనాల సంస్థ
అక్టోబరులో ‘క్వాల్కమ్’ రెండో అతిపెద్ద ప్రాంగణం ప్రారంభం
రూ.3,904 కోట్లతో ప్రాంగణాన్ని ప్రారంభించనున్న సంస్థ
ఆయా సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రానికి మరో మూడు ప్రసిద్ధ సంస్థలు రానున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు తమ కేంద్రాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తంచేశారు. అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ గోల్ఫ్ క్రీడాపరికరాల తయారీ సంస్థ ‘కాల్అవే గోల్ఫ్’.. అమెరికా తర్వాత అతి పెద్దదైన డిజిటల్ టెక్నాలజీ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 300 మందికి ఉపాధి కల్పించనుంది. ప్రముఖ విద్యుత్ వాహనాల సంస్థ ఫిస్కర్ ఐఎన్సీ తెలంగాణలో రూ.100 కోట్లతో ఐటీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా 300 మందికి ఉపాధి కల్పించనుంది. ఏడాదిలోగా కార్యకలాపాలను ప్రారంభించనుంది. సాఫ్ట్వేర్, వైర్లెస్ టెక్నాలజీ, సెమీ కండక్టర్ రంగాల్లో అంతర్జాతీయ దిగ్గజం క్వాల్కమ్ సంస్థ రూ.3,904.55 కోట్లతో ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్లో వచ్చే అక్టోబరులో ప్రారంభించనున్నట్లు తెలిపింది.
కాల్అవే సంస్థ గోల్ఫ్ బంతులు, స్టిక్, దుస్తులు, ఇతర సామగ్రిని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. రూ.24 వేల కోట్ల వార్షికాదాయం, 2400 మంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థ భారత్లో డిజిటెక్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకుంది. సంస్థ ఆహ్వానం మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ మంగళవారం కాలిఫోర్నియా సమీపంలోని కాల్అవే ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు. సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, ముఖ్య ఆర్థికాధికారి బ్రయన్ లించ్, సీఐవో సాయి కూరపాటిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం లించ్ మాట్లాడారు. ‘‘మా సంస్థ ద్వారా 140 దేశాలకు, రెండున్నర లక్షలకు పైగా క్లబ్బులకు క్రీడా సామగ్రిని సరఫరా చేస్తున్నాం. గోల్ఫ్లో డేటా అనలిటిక్స్, ఐటీ సేవలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్లో డిజిటెక్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా ఆటగాళ్ల ఆటతీరు సహా వారి క్రీడా నైపుణ్యాభివృద్ధి, సమస్యలకు సాంకేతిక ఆధారిత పరిష్కారాలను సూచిస్తాం. తొలి దశలో అత్యంత నైపుణ్యం కలిగిన 300 మంది ఐటీ రంగ నిపుణులకు ఉపాధి కల్పిస్తాం. త్వరలోనే తెలంగాణను సందర్శిస్తాం’’ అని తెలిపారు. కాల్అవేతో ఒప్పందంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. కాల్అవే డిజిటెక్ కేంద్రం ద్వారా గోల్ఫ్ క్రీడాకేంద్రంగానూ రాష్ట్రం గుర్తింపు పొందుతుందన్నారు. రాష్ట్రంలో గోల్ఫ్ క్రీడాపరికరాల తయారీ కేంద్రాన్నీ ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతినిధులను కోరారు. హైదరాబాద్లో క్రీడాపర్యాటకంలో భాగం కావాలని ఆహ్వానించారు.
ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి భేష్: ఫిస్కర్
ఫిస్కర్ ఆటోమోటివ్ సంస్థ అధునాతన విద్యుత్ వాహనాలను ఉత్పత్తి చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది. తమ కార్యకలాపాలను భారత్లోనూ విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణను ఎంచుకుంది. సంస్థ ఆహ్వానంతో మంగళవారం ఫిస్కర్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించి.. సంస్థ ఛైర్మన్, సీఈవో హెన్రిక్ ఫిస్కర్, ముఖ్య ఆర్థిక, నిర్వహణ అధికారిణి గీతాగుప్తా ఫిస్కర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఫిస్కర్ ఐటీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు ప్రణాళికను కేటీఆర్కు వివరించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం తమకెంతో నచ్చిందని, ఐటీ రంగంలో తెలంగాణ గొప్ప ప్రగతి సాధించిందని.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఐటీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలోనే అత్యుత్తమమైన విద్యుత్ వాహనాల తయారీ విధానాన్ని తాము విడుదల చేశామని, ఇప్పటికే 17 సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చాయని కేటీఆర్ అన్నారు. ఫిస్కర్ కేంద్రం ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.
అయిదేళ్లలో 8,700 మందికి ఉపాధి అవకాశాలు: క్వాల్కమ్
శాండియాగోలోని క్వాల్కమ్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎఫ్వో ఆకాష్ పాల్కివాలా, ఉపాధ్యక్షులు జేమ్స్ జిన్, లక్ష్మి రాయపూడి, పరాగ్ అగాసే, డైరెక్టర్ దేవ్సింగ్, ఇతర ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఉన్న తమ కార్యాలయం పురోగతిని క్వాల్కమ్ ప్రతినిధులు వివరించారు. 15.72 లక్షల చదరపు అడుగుల కొత్త కార్యాలయం ద్వారా అయిదేళ్లలో 8,700 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటీతోపాటు వ్యవసాయ, విద్యా రంగాల్లో తెలంగాణలో ఉన్న అపారావకాశాలను అందిపుచ్చుకోవడమే తమ విస్తరణ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని తెలిపారు. అగ్రిటెక్, విద్యారంగం, కనెక్టెడ్ డివైస్ల వినియోగం, స్మార్ట్ సిటీ కార్యక్రమాల్లో తాము భాగస్వాములమవుతామని చెప్పారు. భవిష్యత్తులో సెమీకండక్టర్ చిప్ల తయారీ వంటి రంగాల్లో తెలంగాణ మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మారేందుకు కొత్త కార్యాలయం ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. -
మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్ డీడీజీ శర్మ
వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ పిలుపునిచ్చారు. -
ఓటేస్తే కన్సల్టేషన్, వైద్య పరీక్షల్లో రాయితీ
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. -
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్పీసీ
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. -
‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లను జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. -
పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. -
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్ఈఏపీసెట్-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
అమిత్షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు
కేంద్ర హోంమంత్రి అమిత్షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. -
ఆ పురుగుల మందుపై నిషేధం
టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. -
లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్ లక్ష్మీ పంపుహౌస్ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.
తాజా వార్తలు (Latest News)
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు