అప్పులపై ఆంక్షలు సడలించండి
రాష్ట్రంలో నెలన్నరగా అప్పుల సేకరణపై ప్రతిష్టంభన నెలకొంది. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమంపై తీవ్ర ప్రభావం పడుతోందని, తక్షణం ఆంక్షలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని మరోసారి కోరింది. ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ
బాండ్ల విక్రయానికి, రుణాలకు అనుమతించండి
లేదంటే అభివృద్ధి పనులు నిరర్థకమవుతాయి!
కేంద్రానికి రాష్ట్ర ఆర్థికశాఖ తాజా లేఖ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో నెలన్నరగా అప్పుల సేకరణపై ప్రతిష్టంభన నెలకొంది. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమంపై తీవ్ర ప్రభావం పడుతోందని, తక్షణం ఆంక్షలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని మరోసారి కోరింది. ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ -ఎఫ్ఆర్బీఎం) చట్టం ప్రకారం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నా రాష్ట్ర అభివృద్ధి రుణాలపై ఆంక్షలు విధించడంపై సరికాదని పేర్కొంది.నూతన రుణ నిబంధనలపై ఈ నెల 9న కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యంతరాలను స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ఆర్థికశాఖకు లేఖ రాసింది. గతంలోలా ఎఫ్ఆర్బీఎం పరిధిలో బాండ్ల విక్రయానికి అనుమతించాలని కోరింది. బడ్జెట్ వెలుపల తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకురాకుండా పాత విధానం కొనసాగించాలని వివరించింది. కేంద్రం గతంలో లేవనెత్తిన పలు అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజా లేఖలో సమాధానం ఇచ్చింది.
ఆ నిబంధనలు సహేతుకం కాదు
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ వెలుపల వివిధ కార్పొరేషన్ల కింద తీసుకున్న రుణాలను సైతం ఎఫ్ఆర్బీఎం పరిధిలో రుణాలుగానే పరిగణించి ప్రస్తుత ఆర్థిక సంవత్సర రుణ పరిమితిలో సర్దుబాటు చేస్తామని కేంద్రం చెప్పడంపై రాష్ట్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనలు ఏవైనా.. గతంలో వాటికి వర్తింపచేయడం సహేతుకం కాదని స్పష్టం చేసింది. సాగు, తాగునీటి ప్రాజెక్టులతో పాటు వివిధ అభివృద్ధి పనులకు నిధుల సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రుణాలు, పెట్టుబడి వ్యయాలను ఎఫ్ఆర్బీఎం పరిమితుల మేరకు నిర్వహిస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నట్లు తెలియజేసింది.
కేంద్రం లెక్కలు రాష్ట్ర ప్రతిపాదనలకు భిన్నం
తెలంగాణ రాష్ట్రానికి 3.5 శాతం ఎఫ్ఆర్బీఎం పరిమితి మేరకు రూ.42,728 కోట్ల మార్కెట్ రుణానికి, పనితీరు ప్రాతిపదికగా మరో 0.5 శాతం రుణానికి అవకాశం ఉంటుందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో రూ.59,672 కోట్ల రుణాల సేకరణకు ప్రతిపాదించింది. దీంతోపాటు సాగు-తాగు నీటి ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలకు బడ్జెట్ వెలుపల వివిధ కార్పొరేషన్ల ద్వారా సుమారు రూ.40 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో కాళేశ్వరం కార్పొరేషన్కే సుమారు రూ.30 వేల కోట్ల కొత్త రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాగునీటి సరఫరా సంస్థకు రూ.2,832 కోట్లు, నీటివనరుల అభివృద్ధి సంస్థకు రూ.2,315 కోట్లు, ఆ తర్వాత టీయూఎఫ్ఐడీసీ, ఆర్టీసీ, గృహనిర్మాణ సంస్థ, రోడ్ల అభివృద్ధి తదితర వాటికి ప్రధానంగా రుణాలు సమీకరించుకోవాలని ప్రతిపాదించింది. కేంద్ర నిబంధనల నేపథ్యంలో ఆ మేరకు నిధుల సమీకరణ సమస్యగా మారే అవకాశం ఉందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రం అప్పులు ఇవీ..
గత ఆర్థిక సంవత్సరం (మార్చి) ఆఖరు నాటికి రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న మార్కెట్ రుణాలు రూ.2,85,120 కోట్లు, బడ్జెట్ వెలుపల ప్రభుత్వ పూచీకత్తుతో తీసుకున్న రుణాలు రూ.1,35,282 కోట్లకు చేరాయి.
లేఖలో పేర్కొన్న మరికొన్ని అంశాలు..
* ఎఫ్ఆర్బీఎం చట్టం నిర్దేశించిన మేరకే రెవెన్యూ రాబడుల ఆధారంగా బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకుంటున్నాం. ఆ రుణాలను పూర్తిగా పెట్టుబడి రూపంలోనే వ్యయం చేస్తున్నాం.
* అర్ధాంతరంగా రుణాలు ఆపివేస్తే.. వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తికావు. ఇప్పటివరకు చేసిన వ్యయం నిరర్థకం అవుతుంది.
* అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయి, వాటిద్వారా అందే ఫలాలతో రుణాలను చెల్లించేందుకు మార్గం సుగమం అవుతుంది.
* జాతీయ బ్యాంకులు, నాబార్డ్ వంటి సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటున్నాం.
* రాష్ట్రం విక్రయించిన బాండ్లలో 49 శాతం రుణాలను 2036వ సంవత్సరం తర్వాతే చెల్లించాల్సి ఉంటుంది.
* జీఎస్డీపీలో రాష్ట్ర రుణాలు 25 శాతంలోపే ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి