అప్పులపై ఆంక్షలు సడలించండి
రాష్ట్రంలో నెలన్నరగా అప్పుల సేకరణపై ప్రతిష్టంభన నెలకొంది. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమంపై తీవ్ర ప్రభావం పడుతోందని, తక్షణం ఆంక్షలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని మరోసారి కోరింది. ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ
బాండ్ల విక్రయానికి, రుణాలకు అనుమతించండి
లేదంటే అభివృద్ధి పనులు నిరర్థకమవుతాయి!
కేంద్రానికి రాష్ట్ర ఆర్థికశాఖ తాజా లేఖ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో నెలన్నరగా అప్పుల సేకరణపై ప్రతిష్టంభన నెలకొంది. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమంపై తీవ్ర ప్రభావం పడుతోందని, తక్షణం ఆంక్షలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని మరోసారి కోరింది. ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ -ఎఫ్ఆర్బీఎం) చట్టం ప్రకారం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నా రాష్ట్ర అభివృద్ధి రుణాలపై ఆంక్షలు విధించడంపై సరికాదని పేర్కొంది.నూతన రుణ నిబంధనలపై ఈ నెల 9న కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యంతరాలను స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ఆర్థికశాఖకు లేఖ రాసింది. గతంలోలా ఎఫ్ఆర్బీఎం పరిధిలో బాండ్ల విక్రయానికి అనుమతించాలని కోరింది. బడ్జెట్ వెలుపల తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకురాకుండా పాత విధానం కొనసాగించాలని వివరించింది. కేంద్రం గతంలో లేవనెత్తిన పలు అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజా లేఖలో సమాధానం ఇచ్చింది.
ఆ నిబంధనలు సహేతుకం కాదు
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ వెలుపల వివిధ కార్పొరేషన్ల కింద తీసుకున్న రుణాలను సైతం ఎఫ్ఆర్బీఎం పరిధిలో రుణాలుగానే పరిగణించి ప్రస్తుత ఆర్థిక సంవత్సర రుణ పరిమితిలో సర్దుబాటు చేస్తామని కేంద్రం చెప్పడంపై రాష్ట్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనలు ఏవైనా.. గతంలో వాటికి వర్తింపచేయడం సహేతుకం కాదని స్పష్టం చేసింది. సాగు, తాగునీటి ప్రాజెక్టులతో పాటు వివిధ అభివృద్ధి పనులకు నిధుల సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రుణాలు, పెట్టుబడి వ్యయాలను ఎఫ్ఆర్బీఎం పరిమితుల మేరకు నిర్వహిస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నట్లు తెలియజేసింది.
కేంద్రం లెక్కలు రాష్ట్ర ప్రతిపాదనలకు భిన్నం
తెలంగాణ రాష్ట్రానికి 3.5 శాతం ఎఫ్ఆర్బీఎం పరిమితి మేరకు రూ.42,728 కోట్ల మార్కెట్ రుణానికి, పనితీరు ప్రాతిపదికగా మరో 0.5 శాతం రుణానికి అవకాశం ఉంటుందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో రూ.59,672 కోట్ల రుణాల సేకరణకు ప్రతిపాదించింది. దీంతోపాటు సాగు-తాగు నీటి ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలకు బడ్జెట్ వెలుపల వివిధ కార్పొరేషన్ల ద్వారా సుమారు రూ.40 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో కాళేశ్వరం కార్పొరేషన్కే సుమారు రూ.30 వేల కోట్ల కొత్త రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాగునీటి సరఫరా సంస్థకు రూ.2,832 కోట్లు, నీటివనరుల అభివృద్ధి సంస్థకు రూ.2,315 కోట్లు, ఆ తర్వాత టీయూఎఫ్ఐడీసీ, ఆర్టీసీ, గృహనిర్మాణ సంస్థ, రోడ్ల అభివృద్ధి తదితర వాటికి ప్రధానంగా రుణాలు సమీకరించుకోవాలని ప్రతిపాదించింది. కేంద్ర నిబంధనల నేపథ్యంలో ఆ మేరకు నిధుల సమీకరణ సమస్యగా మారే అవకాశం ఉందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రం అప్పులు ఇవీ..
గత ఆర్థిక సంవత్సరం (మార్చి) ఆఖరు నాటికి రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న మార్కెట్ రుణాలు రూ.2,85,120 కోట్లు, బడ్జెట్ వెలుపల ప్రభుత్వ పూచీకత్తుతో తీసుకున్న రుణాలు రూ.1,35,282 కోట్లకు చేరాయి.
లేఖలో పేర్కొన్న మరికొన్ని అంశాలు..
* ఎఫ్ఆర్బీఎం చట్టం నిర్దేశించిన మేరకే రెవెన్యూ రాబడుల ఆధారంగా బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకుంటున్నాం. ఆ రుణాలను పూర్తిగా పెట్టుబడి రూపంలోనే వ్యయం చేస్తున్నాం.
* అర్ధాంతరంగా రుణాలు ఆపివేస్తే.. వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తికావు. ఇప్పటివరకు చేసిన వ్యయం నిరర్థకం అవుతుంది.
* అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయి, వాటిద్వారా అందే ఫలాలతో రుణాలను చెల్లించేందుకు మార్గం సుగమం అవుతుంది.
* జాతీయ బ్యాంకులు, నాబార్డ్ వంటి సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటున్నాం.
* రాష్ట్రం విక్రయించిన బాండ్లలో 49 శాతం రుణాలను 2036వ సంవత్సరం తర్వాతే చెల్లించాల్సి ఉంటుంది.
* జీఎస్డీపీలో రాష్ట్ర రుణాలు 25 శాతంలోపే ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
ఎప్సెట్ ఫలితాలు నేడే
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. -
ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!
‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. -
నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి
సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. -
మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన
రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ అరుణ్కుమార్ మిశ్రా స్పష్టంచేశారు. -
అధిక ధరకు...బియ్యం టెండర్లు!
సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. -
జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ
రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. -
మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం..ఈవో ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!
సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్ పేపర్-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్ ఇచ్చారు. -
తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. -
కుంగిన బ్లాక్లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు
ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లున్నాయి.