TS News: సభలో సలసల
బియ్యం సేకరణ అంశం శుక్రవారం పార్లమెంటు ఉభయ సభల్లో సలసలా మరిగింది. అటు లోక్సభ, ఇటు రాజ్యసభలోనూ ప్రధాన చర్చగా మారింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో బియ్యం ఎంత కొంటారో చెప్పాలంటూ తెరాస సభ్యులు కేశవరావు, కేఆర్ సురేష్రెడ్డి కేంద్రమంత్రిపై ....
బియ్యం కొనుగోలుపై పార్లమెంటులో వాడీవేడీ..
ఏడాదికెంత సేకరిస్తారో తేల్చాలని ఉభయ సభల్లో నిలదీసిన తెరాస
కొత్త రాష్ట్రం సమస్యలను ఆలకించాలని కేంద్రాన్ని కోరిన టీఎంసీ ఎంపీ
మద్దతు పలికిన శివసేన, కాంగ్రెస్, బీజేడీ, ఎస్పీ, బీఎస్పీ, సీపీఎం
ఇవ్వాల్సిన బియ్యమే తెలంగాణ ఇంకా ఇవ్వలేదన్న కేంద్ర మంత్రి గోయల్
మంత్రి సమాధానంపై అసంతృప్తి.. తెరాస ఎంపీల వాకౌట్
బియ్యం సేకరణ అంశం శుక్రవారం పార్లమెంటు ఉభయ సభల్లో సలసలా మరిగింది. అటు లోక్సభ, ఇటు రాజ్యసభలోనూ ప్రధాన చర్చగా మారింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో బియ్యం ఎంత కొంటారో చెప్పాలంటూ తెరాస సభ్యులు కేశవరావు, కేఆర్ సురేష్రెడ్డి కేంద్రమంత్రిపై ప్రశ్నాస్త్రాలు సంధించగా, లోక్సభలో ఆ పార్టీ పక్షనేత నామా నాగేశ్వరరావు రాష్ట్ర సమస్యపై కేంద్ర మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలంటూ పట్టుబట్టారు. ఉదయం సభా సమయానికి ముందు గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేసిన ఎంపీలు సభలోకి అడుగుపెట్టిన తర్వాతా అదే పంథాను కొనసాగించారు. రైతు సమస్యలపై పోరాడుతున్న తమకు మద్దతివ్వాలంటూ నామా చేసిన విన్నపానికి లోక్సభలోని వివిధ పక్షాల నేతలు, రాజ్యసభలో బీజేడీ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఎట్టకేలకు రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్గోయల్ సమాధానమిచ్చారు. ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని లేఖ ఇచ్చి ఇప్పుడు ఈ అంశంపై రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఈ రబీలో ఎంత కొంటారనే అంశంపై కేంద్రమంత్రి స్పష్టమైన ప్రకటన చేయనందుకు నిరసనగా రాజ్యసభ నుంచి, ఐదు రోజులుగా తాము చేస్తున్న డిమాండ్పై కేంద్రం తన వైఖరిని వెల్లడించనందుకు లోక్సభ నుంచి తెరాస ఎంపీలు వాకౌట్ చేశారు. మొత్తంగా తెరాస ఎంపీల పోరాటం శుక్రవారం తారస్థాయికి చేరింది. ఈ అంశంపై స్వల్ప కాలిక చర్చకోసం ఉభయసభలలో నోటీసులు ఇవ్వాలని ఎంపీలు నిర్ణయించారు.
ఎంత కొంటారో తేల్చండి
లోక్సభలో నామా, రాజ్యసభలో కేకే డిమాండ్
ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోళ్ల అంశంపై లోక్సభలో శుక్రవారం తెరాస ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. తెలంగాణ నుంచి ఏడాదికి ఎంత మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టం చేయాలని తెరాస లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలకు తెరాస నినాదాలు ఆటంకంగా మారుతుండడంతో సభాపతి ఓం బిర్లా మాట్లాడేందుకు నామాకు అవకాశం ఇచ్చారు. గత అయిదు రోజులుగా తాము తెలంగాణ రైతుల సమస్యలపై ఆందోళన చేస్తున్నామని, రైతుల దగ్గర నుంచి ఎంత ధాన్యం కొంటారో సంబంధిత మంత్రితో సభలో స్పష్టమైన ప్రకటన చేయించాలని నామా కోరారు. ధాన్యం కొనుగోళ్లపై ఒక్కో మంత్రి ఒక్కో ప్రకటన చేస్తున్నారన్నారు. ఈ సమయంలో సభాపతి మైక్ ఆపేయడంతో ఆగ్రహించిన తెరాస సభ్యులు మరింత పెద్దగా నినాదాలు చేస్తూ వెల్లో బైఠాయించారు. ఈ కారణంగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుండడంతో విపక్ష నేతలు స్పందించారు. తొలుత తృణమూల్ లోక్సభ పక్ష నేత సుదీప్ బందోపాధ్యాయ ఈ అంశంపై సభాపతిని సమయం కోరారు. ‘తెలంగాణ కొత్త రాష్ట్రం. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. వారు కొన్ని సమస్యలు లేవనెత్తుతున్నారు. ఒక పార్టీకి చెందిన ఎంపీలు వెల్లోకి వచ్చి నిరంతరంగా నినాదాలు చేస్తున్నారు. సంబంధిత మంత్రి స్పందించి తగిన సమయంలో జవాబు ఇస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఈ విషయంపై మీరు దృష్టిసారించాలని’’ సభాపతి ఓం బిర్లాను కోరారు. కాంగ్రెస్, బీజేడీ, శివసేన, ఎస్పీ, బీఎస్పీ, సీపీఎం సభ్యులు మద్దతు పలికారు. ఆందోళనకు విపక్షాలు మద్దతు పలకడంతో జీరో అవర్లో నామా నాగేశ్వరరావుకు మరోసారి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ ‘‘పార్లమెంటు సమావేశాలకు ముందు 28వ తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశంలో, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాల్లోనూ తెలంగాణలో ధాన్యం సేకరణ సమస్యను వివరించాం. వేడి వాతావరణంతో రాష్ట్రంలో యాసంగిలో ఉప్పుడు బియ్యమే వస్తాయి. అవి వద్దంటున్నారు. అందువల్లనే ఒక ఏడాదిలో ఎంత మొత్తం, ఏఏ రకాలు సేకరిస్తారో చెప్పాలని కోరాం. మీ ద్వారా ప్రభుత్వం నుంచి సమస్య పరిష్కారాన్ని కోరుతున్నాం’’ అని విజ్ఞప్తి చేశారు. నామా మాట్లాడిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తెరాస ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ఒక దశలో ఫ్లకార్డులు చించి, వెల్లోకి విసిరి సభ నుంచి వాకౌట్ చేశారు.
రాజ్యసభలో నిలదీసిన కేకే, సురేష్రెడ్డి
రాజ్యసభలో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఆ పార్టీ ఎంపీ కె.ఆర్. సురేష్రెడ్డి ధాన్యం సేకరణ అంశాన్ని లేవనెత్తారు. ‘‘బియ్యం రకాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ నుంచి మొత్తం కొనుగోలుచేయడానికి సిద్ధంగా ఉందా? లేదా? కేంద్ర కేబినెట్ మంత్రి (కిషన్రెడ్డి) ప్రతి బియ్యం గింజనూ కొంటామని చెప్పారు. దానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందా? గత ఏడాది 94 లక్షల టన్నులు తీసుకున్నారు. ఈసారి కూడా కనీసం గత ఏడాది తీసుకున్న 94 లక్షల టన్నులైనా తీసుకుంటారా? లేదా?’’ అనినిలదీశారు. స్పందించిన కేంద్ర మంత్రి మంత్రి పీయూష్గోయల్ సమాధానమిచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం బియ్యం ఇవ్వలేదని, ఇప్పుడు భవిష్యత్తులో సేకరించేదాని గురించి మాట్లాడుతూ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.కేంద్ర మంత్రి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ఆరోపిస్తూ తెరాస సభ్యులు ఆయన సమాధానం పూర్తయిన వెంటనే వాకౌట్ చేశారు. అనంతరం తెలంగాణ భవన్లో సాయంత్రం తెలంగాణ ఎంపీలు విలేకరులతో మాట్లాడారు.
తిప్పితిప్పి అదే సమాధానం: కె.కేశవరావు
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తిప్పితిప్పి అదే సమాధానం ఇస్తున్నారు. రైతు ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు. రైతు, పేదల వ్యతిరేక ప్రభుత్వం ఇది. కేంద్రం స్పష్టమైన ప్రకటన ఇచ్చేంతవరకూ ఆందోళనలు ఉపసంహరించుకోబోం.
కుట్రపూరిత వ్యవహారం: నామా
వానాకాలం, యాసంగి పంటల కొనుగోలుపై భాజపా నేతలు కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో ఒకలా మాట్లాడుతున్నారు. పరిశ్రమలను అమ్ముతూ కార్మికులకు, ధరలు పెంచుతూ పేదలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రైతుల విషయంలోనూ అలానే ప్రవర్తిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
నడి వేసవిలో వణికించిన వాన
భగభగమనే ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. -
మేడిగడ్డ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి
‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగిన ఏడో బ్లాకులో తెరుచుకోని ఎనిమిది రేడియల్ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలి. -
‘రైతు భరోసా’ బంద్
‘రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అందజేసే పంట సాయం పంపిణీని తక్షణం నిలుపుదల చేయాలి. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. -
అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్
యూఎస్లో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ నెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ సమయాల (స్లాట్స్)ను అమెరికా ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీసీ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
రైతుభరోసాపై త్వరలో విధివిధానాలు
రాష్ట్రంలోని అర్హులైన రైతులకే రైతుభరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ప్రధాని మోదీతో పీవీ కుటుంబ సభ్యుల భేటీ
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. -
20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు పొడిగించింది. -
ఓట్ల ప్రయాణంలో.. నోట్ల దోపిడీ
ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేదు. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి. రైళ్లలో నెల క్రితమే అయిపోయి.. వెయిటింగ్ లిస్టులు వందలు దాటేశాయి. -
50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి
తెలంగాణలో 50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలని పీఆర్టీయూటీఎస్ సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
కనీస వేతనం రూ.30 వేలు ఉండాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ.30 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,48,150, ఫిట్మెంట్ 30 శాతంతో కొత్త పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్యూటీఎఫ్) శివశంకర్ను కోరింది. -
ముఖ గుర్తింపు విధానం నుంచి మినహాయించండి!
తెలంగాణలోని పాఠశాలల్లో హాజరు నమోదుకు కొత్త విద్యాసంవత్సరం నుంచి చేపడుతున్న ముఖగుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానం నుంచి అంధ ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలని రాష్ట్ర అంధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మల్లేశం, రాఘవేందర్రెడ్డి, ఇతర నేతలు అనిల్కుమార్, జి.మల్లేశ్, నాగేంద్రమ్మలు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కోరారు. -
గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫైన్ ఆర్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోర్సులు
గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (సిరిసిల్ల)లో బీఏ ఆనర్స్ ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ-డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. -
టీఎస్ఈఏపీసెట్కు తొలిరోజు 90 శాతానికి పైగా హాజరు
తెలంగాణలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీఎస్ఈఏపీసెట్-2024’ పరీక్షకు మంగళవారం 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. -
కర్ణాటకలో నేడు కృష్ణా జలాల విడుదల
కర్ణాటక నుంచి తెలంగాణకు బుధవారం కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్ నుంచి 1.9 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి జలవనరుల శాఖ అంగీకరించింది. -
భూగర్భ జలాలు వేగంగా ఖాళీ!
రాష్ట్రంలో భూగర్భ జలాలు చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ప్రాజెక్టులు, ఇతర నీటి వనరులకు ఈ ఏడాది ఆశించిన మేర ప్రవాహాలు రాలేదు. చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనుంది. -
ఇదీ సంగతి!