Puneeth Rajkumar: పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణం
కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ (46) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య అశ్వినీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధృతి,
గుండెపోటుతో కన్నడ పవర్స్టార్ కన్నుమూత
ఈనాడు డిజిటల్-బెంగళూరు, న్యూస్టుడే- బెంగళూరు (ఎలక్ట్రానిక్ సిటీ): కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ (46) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య అశ్వినీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధృతి, వందిత ఉన్నారు. శుక్రవారం ఉదయం తన ఇంట్లోని జిమ్లో రెండు గంటల నుంచి వ్యాయామం చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో, సమీపంలోనే కుటుంబ వైద్యుడి క్లినిక్లో ప్రాథమిక చికిత్స పొందారు. అప్పుడే వైద్యులు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే విక్రమ్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆసుపత్రికి వెళ్లేలోపే ఆయనకు మరోసారి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని సన్నిహితులు తెలిపారు. పునీత్ రాజ్కుమార్ పరిస్థితి విషమంగా ఉందని, ఆయన ప్రాణాల్ని కాపాడేందుకు కృషిచేస్తున్నామని గుండె వైద్య నిపుణుడు డాక్టర్ రంగనాథ్ నాయక్ తొలుత వెల్లడించారు. అప్పటికే వేలమంది అభిమానులు, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, మంత్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపటికే సోదరులు శివరాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్, ఇతర కుటుంబసభ్యులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు కూడా వచ్చారు. మధ్యాహ్నం 2.20 గంటలకు పునీత్ రాజ్కుమార్ కన్నుమూసినట్లు ప్రకటించారు.
లోహిత్.. పునీత్.. అప్పు
కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్కుమార్ చిన్నకుమారుడు పునీత్ ఆరునెలల వయస్సులోనే బాలనటుడిగా సినీ రంగంలోకి ప్రవేశించి, క్రమంగా అగ్రస్థానానికి చేరుకున్నారు. 1975 మార్చి 17న చెన్నైలో జన్మించిన పునీత్కు తొలుత లోహిత్ అనే పేరు పెట్టారు. కానీ, ఆ పేరుతో అల్పాయుష్కుడు అవుతాడని పండితులు చెప్పడంతో పునీత్ అని పేరు మార్చారు. అందరూ ‘అప్పు’ అనే పిలిచేవారు. భక్తప్రహ్లాద, ఎరడు నక్షత్రగళు సినిమాలకు ఉత్తమ బాలనటుడిగా పురస్కారాలు లభించాయి. 2002లో అప్పు సినిమాతోనే హీరోగా నటప్రయాణం మొదలుపెట్టారు.
* పునీత్ రాజ్కుమార్తో సినిమా అంటే తమకు లాభమని నిర్మాతలు అంటారు. కథ నచ్చితేగానీ అంగీకరించేవారు కాదంటారు. అందుకే.. ఏడాదికి ఒకటి రెండు సినిమాలకే పరిమితమయ్యేవారు. ఆయన నటించిన జేమ్స్, ద్వైత సినిమాలు ఇంకా విడుదల కావాలి. పునీత్ రాజ్కుమార్కు నేపథ్య గాయకుడిగా మంచి పేరుండేది. పాటలతో వచ్చే ఆదాయాన్ని సమాజసేవకే వినియోగించేవారు. నిర్మాతగా నాలుగు సినిమాలు అందించారు. మరో మూడు నిర్మాణదశలో ఉన్నాయి. 2012లో ఓ ప్రైవేటు ఛానల్ రూపొందించిన ‘కన్నడద కోట్యాధిపతి’ (మీలో ఎవరు కోటీశ్వరుడు) రియాలిటీ షో అత్యంత ప్రజాదరణ పొందింది.
* బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో అంతిమ దర్శనానికి ఏర్పాట్లుచేశారు. పునీత్ రెండో కుమార్తె అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో ఆదివారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ ప్రకటించారు.
ఉదయమే మరణించారా?
శుక్రవారం ఉదయం 10:30 గంటలకే పునీత్ మరణించారన్నది మరో సమాచారం. ఆ సమయానికి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పాల్గొనాల్సిన ఓ కార్యక్రమాన్ని ఉన్నట్టుండి రద్దుచేశారు. అక్కడి నుంచి బొమ్మై విక్రమ్ ఆస్పత్రికి చేరుకున్నారు.
* పునీత్ మృతి విషయం తెలిసి అభిమాని మునియప్ప గుండెపోటుతో మృతి చెందాడు.
* పునీత్ మరణానికి సంతాపంగా మూడురోజుల పాటు కర్ణాటకలో మద్యనిషేధం అమలుచేశారు. పలు విద్యాసంస్థలు పరీక్షలను వాయిదావేశాయి. థియేటర్లను మూసివేశారు.
ప్రముఖుల నివాళి
విధి ఎంతో క్రూరమైన మలుపు తిప్పిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మంత్రులు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులతో పాటు తెలుగు సినీరంగ ప్రముఖులు పునీత్ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!