Puneeth Rajkumar: పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణం
కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ (46) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య అశ్వినీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధృతి,
గుండెపోటుతో కన్నడ పవర్స్టార్ కన్నుమూత
ఈనాడు డిజిటల్-బెంగళూరు, న్యూస్టుడే- బెంగళూరు (ఎలక్ట్రానిక్ సిటీ): కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ (46) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య అశ్వినీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధృతి, వందిత ఉన్నారు. శుక్రవారం ఉదయం తన ఇంట్లోని జిమ్లో రెండు గంటల నుంచి వ్యాయామం చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో, సమీపంలోనే కుటుంబ వైద్యుడి క్లినిక్లో ప్రాథమిక చికిత్స పొందారు. అప్పుడే వైద్యులు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే విక్రమ్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆసుపత్రికి వెళ్లేలోపే ఆయనకు మరోసారి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని సన్నిహితులు తెలిపారు. పునీత్ రాజ్కుమార్ పరిస్థితి విషమంగా ఉందని, ఆయన ప్రాణాల్ని కాపాడేందుకు కృషిచేస్తున్నామని గుండె వైద్య నిపుణుడు డాక్టర్ రంగనాథ్ నాయక్ తొలుత వెల్లడించారు. అప్పటికే వేలమంది అభిమానులు, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, మంత్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపటికే సోదరులు శివరాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్, ఇతర కుటుంబసభ్యులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు కూడా వచ్చారు. మధ్యాహ్నం 2.20 గంటలకు పునీత్ రాజ్కుమార్ కన్నుమూసినట్లు ప్రకటించారు.
లోహిత్.. పునీత్.. అప్పు
కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్కుమార్ చిన్నకుమారుడు పునీత్ ఆరునెలల వయస్సులోనే బాలనటుడిగా సినీ రంగంలోకి ప్రవేశించి, క్రమంగా అగ్రస్థానానికి చేరుకున్నారు. 1975 మార్చి 17న చెన్నైలో జన్మించిన పునీత్కు తొలుత లోహిత్ అనే పేరు పెట్టారు. కానీ, ఆ పేరుతో అల్పాయుష్కుడు అవుతాడని పండితులు చెప్పడంతో పునీత్ అని పేరు మార్చారు. అందరూ ‘అప్పు’ అనే పిలిచేవారు. భక్తప్రహ్లాద, ఎరడు నక్షత్రగళు సినిమాలకు ఉత్తమ బాలనటుడిగా పురస్కారాలు లభించాయి. 2002లో అప్పు సినిమాతోనే హీరోగా నటప్రయాణం మొదలుపెట్టారు.
* పునీత్ రాజ్కుమార్తో సినిమా అంటే తమకు లాభమని నిర్మాతలు అంటారు. కథ నచ్చితేగానీ అంగీకరించేవారు కాదంటారు. అందుకే.. ఏడాదికి ఒకటి రెండు సినిమాలకే పరిమితమయ్యేవారు. ఆయన నటించిన జేమ్స్, ద్వైత సినిమాలు ఇంకా విడుదల కావాలి. పునీత్ రాజ్కుమార్కు నేపథ్య గాయకుడిగా మంచి పేరుండేది. పాటలతో వచ్చే ఆదాయాన్ని సమాజసేవకే వినియోగించేవారు. నిర్మాతగా నాలుగు సినిమాలు అందించారు. మరో మూడు నిర్మాణదశలో ఉన్నాయి. 2012లో ఓ ప్రైవేటు ఛానల్ రూపొందించిన ‘కన్నడద కోట్యాధిపతి’ (మీలో ఎవరు కోటీశ్వరుడు) రియాలిటీ షో అత్యంత ప్రజాదరణ పొందింది.
* బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో అంతిమ దర్శనానికి ఏర్పాట్లుచేశారు. పునీత్ రెండో కుమార్తె అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో ఆదివారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ ప్రకటించారు.
ఉదయమే మరణించారా?
శుక్రవారం ఉదయం 10:30 గంటలకే పునీత్ మరణించారన్నది మరో సమాచారం. ఆ సమయానికి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పాల్గొనాల్సిన ఓ కార్యక్రమాన్ని ఉన్నట్టుండి రద్దుచేశారు. అక్కడి నుంచి బొమ్మై విక్రమ్ ఆస్పత్రికి చేరుకున్నారు.
* పునీత్ మృతి విషయం తెలిసి అభిమాని మునియప్ప గుండెపోటుతో మృతి చెందాడు.
* పునీత్ మరణానికి సంతాపంగా మూడురోజుల పాటు కర్ణాటకలో మద్యనిషేధం అమలుచేశారు. పలు విద్యాసంస్థలు పరీక్షలను వాయిదావేశాయి. థియేటర్లను మూసివేశారు.
ప్రముఖుల నివాళి
విధి ఎంతో క్రూరమైన మలుపు తిప్పిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మంత్రులు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులతో పాటు తెలుగు సినీరంగ ప్రముఖులు పునీత్ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!
‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. -
నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి
సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. -
మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన
రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ అరుణ్కుమార్ మిశ్రా స్పష్టంచేశారు. -
అధిక ధరకు...బియ్యం టెండర్లు!
సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. -
జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ
రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. -
మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం..ఈవో ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!
సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్ పేపర్-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్ ఇచ్చారు. -
తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. -
కుంగిన బ్లాక్లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు
ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు