AP Budget 2022: గొప్పలకు పోయి అప్పులు
రాని ఆదాయాన్ని లెక్కల్లో చూపిస్తూ.. అప్పుల కుప్పల్ని మరింత పెంచేస్తూ.. బడ్జెట్ అంచనాల్ని ఘనంగా చూపిస్తూ.. ఆర్థిక మంత్రి అంకెల గారడీ చేశారు. అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతుల కల్పన, సాగునీటి ప్రాజెక్టుల వంటి..
అంకెల గారడీగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్
భారీగా పెరిగిన పద్దు
వద్దనుకున్న మద్యమే రాబడికి ముద్దు
అభివృద్ధి ఊసు లేదు
ఈనాడు - అమరావతి
రూ.2,56,256.56 కోట్లు..!
ఇదేదో ఫ్యాన్సీ నంబర్ అనుకునేరు..!.
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పద్దు..!
రాని ఆదాయాన్ని లెక్కల్లో చూపిస్తూ.. అప్పుల కుప్పల్ని మరింత పెంచేస్తూ.. బడ్జెట్ అంచనాల్ని ఘనంగా చూపిస్తూ.. ఆర్థిక మంత్రి అంకెల గారడీ చేశారు. అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతుల కల్పన, సాగునీటి ప్రాజెక్టుల వంటి.. నిర్మాణాత్మక కార్యక్రమాలకు నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెట్టేశారు. హైకోర్టు ఆదేశాల్నీ పెడచెవిన పెట్టి, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో మొండిచెయ్యి చూపించారు. మద్యనిషేధం హామీపై మళ్లీ మడమ తిప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ ఎక్సైజ్ ఆదాయాన్ని ఏకంగా రూ.16,500 కోట్లుగా అంచనా వేశారు. మద్యం నుంచి మరింత ఆదాయం పిండుకోవడమే తమ సర్కారు లక్ష్యమని చెప్పకనే చెప్పేశారు. వివిధ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు.. నేతి బీరలో నెయ్యి చందమే అని మరోసారి నిరూపించారు. పెండింగ్ బిల్లులు ఎలా చెల్లిస్తారో చెప్పకుండా అస్పష్టత కొనసాగించారు. రాజధాని, పెండింగ్ బిల్లులపై హైకోర్టు తీర్పును ప్రభుత్వ పెద్దలు విస్మరించేసినట్లే కనిపిస్తున్నారు.
అంచనాల్లో తగ్గేదేలే..
వాస్తవ రాబడిని అంచనాల్లో పేర్కొనకుండా, కేంద్రం నుంచి, ఇతర రూపాల్లో వచ్చే నిధుల్నీ భారీగా ఊహిస్తూ... భారీ అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారీ అదే చేసింది. ప్రభుత్వ బడ్జెట్ అంచనాలకు, చేస్తున్న ఖర్చుకూ పొంతన ఉండటం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2020-21 బడ్జెట్ అంచనాల్లో 83 శాతమే ఖర్చు చేయగా, 2021-22 బడ్జెట్ అంచనాల్నీ ప్రభుత్వం కుదించింది. రూ.2.29 లక్షల కోట్ల అంచనాల్ని రూ.2.09 లక్షల కోట్లకు తగ్గించింది. ఇప్పుడు మళ్లీ ఏకంగా రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. మూలధన వ్యయం అంచనాల్లోనూ ఎక్కడా తగ్గలేదు. ఏకంగా రూ.30,679 కోట్లను మూలధన వ్యయంగా ప్రతిపాదించారు. 2021-22 బడ్జెట్లోనూ మూలధన వ్యయాన్ని రూ.31,198 కోట్లుగా అంచనా వేశారు. సవరించిన అంచనా ప్రకారం చేసిన ఖర్చు రూ.18,529 కోట్లు మాత్రమే. ఆదాయం అంచనాలకు, వాస్తవ రాబడికీ పొంతన లేకపోయినా.. అంకెల విన్యాసాలు మాత్రం మానడం లేదు. 2020-21లో రెవెన్యూ ఆదాయం రూ.1,61,958 కోట్లు వస్తుందనుకుంటే రూ.1,17,136.18 కోట్లే వచ్చింది. 2021-22లో రూ.1,77,196 కోట్లు వస్తుందనుకుంటే జనవరి వరకు వచ్చింది రూ.1.11 లక్షల కోట్లే. అయినా తగ్గకుండా 2022-23 బడ్జెట్లో మళ్లీ రెవెన్యూ ఆదాయాన్ని రూ.1,91,225 కోట్లుగా చూపించారు.
అప్పుల్లో అదే దూకుడు..
ఇప్పటికే చేసిన రుణాలు కొండలా పేరుకుపోతున్నా.. కొత్త అప్పులకూ వైకాపా ప్రభుత్వం ఎక్కడా జంకడం లేదు. ప్రజా రుణంతో పాటు, కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇవ్వడం ద్వారానూ భారీగా అప్పులు చేస్తోంది. 2022-23లో రూ.55 వేల కోట్ల బహిరంగ మార్కెట్ రుణాలతో కలిపి, రాష్ట్ర ఆదాయాన్ని రూ.1,91,225 కోట్లుగా పేర్కొంది. రెవెన్యూ లోటును రూ.17,036 కోట్లుగా పేర్కొంది. గత అనుభవాల్ని బట్టి చూస్తే, ప్రభుత్వం రెవెన్యూలోటు నియంత్రణకు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం వల్ల ఇది అనేక రెట్లు పెరుగుతోంది. 2021-22 బడ్జెట్ అంచనాల్లో వివిధ నగదు బదిలీ పథకాలకు రూ.48,083 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల ప్రకారం రూ.39,615.98 కోట్లుగా చూపించింది. అంటే రూ.8,217 కోట్ల వరకు కోత వేసింది. హాజరుతో ముడిపెట్టి ఈ సంవత్సరం అమ్మఒడి పథకాన్ని ఎగ్గొట్టి సుమారు రూ.6,500 కోట్లు మిగుల్చుకుంది. వసతి దీవెనలో రూ.1,134 కోట్లు, విద్యా దీవెనలో రూ.449.13 కోట్లు, సామాజిక భద్రతా పింఛన్లలో రూ.247.55 కోట్లు, రైతులకు సున్నా వడ్డీ పథకంలో 124.13 కోట్లు మిగిలింది.
సున్నకు సున్న.. హళ్లికి హళ్లి!
* నవరత్నాలు, ఉచిత పథకాలకు తప్ప... వ్యవసాయం, సాగునీరు వంటి ప్రాధాన్య రంగాలకు అంతంత మాత్రం కేటాయింపులతోనే సరిపెట్టారు. 2022-23 బడ్జెట్లో జలవనరుల శాఖకు రూ.11,482 కోట్లు కేటాయించారు. దీనిలో జీతాలు, రెవెన్యూ వ్యయాలు, చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపులు పోగా, నికరంగా ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించేది అతి స్వల్పం. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రూ.43,052 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
* మద్యనిషేధం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం, మూడేళ్లయినా దాన్ని అమలు చేయలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ నుంచి ఏకంగా రూ.16,500 కోట్లు ఆదాయం పిండుకోవాలని నిర్ణయించడంతో.. నాలుగో ఏడాదీ మద్యనిషేధం అమలు కొండెక్కినట్లే కనిపిస్తోంది. మనబడి, నాడు-నేడు పథకం నిధుల్లోనూ కోత పెట్టింది. రూ.4,535 కోట్లు ఇస్తామని చెప్పి, బడ్జెట్లో రూ.3,500 కోట్లే ప్రతిపాదించారు. విశ్వవిద్యాలయాలకు కేటాయింపుల్లోనూ కోత పెట్టారు.
* కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు పేరుతో మళ్లీ మాయాజాలం చేశారు. వివిధ కార్పొరేషన్లకు ఈసారీ నిధుల పుష్కలంగానే కేటాయించినట్టు చూపించారు. కానీ నవరత్నాల్లో భాగంగా అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలకు ఇచ్చే నిధులనే.. కార్పొరేషన్ల ఖాతాలో వేసి అక్కడి నుంచి ఖర్చు చేస్తున్నారు. కార్పొరేషన్లు ఆ నిధులు సొంతంగా వాడుకోవడానికి లేదు. దీనివల్ల స్వయం ఉపాధి కల్పన లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి.
* వైఎస్సార్ పెళ్లికానుక పథకానికి 2022-23 బడ్జెట్లోనూ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. డ్వాక్రా మహిళలకు వడ్డీ చెల్లింపునకు ఉద్దేశించిన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి నిధుల్లోనూ కోత పెట్టారు. వసతి దీవెన, వాహన మిత్ర పథకాలకు నిధుల్లోనూ కోత పడింది.
* కీలకమైన రైల్వే ప్రాజెక్టుల పనులకు రాష్ట్ర వాటా కింద రూ.1,998 కోట్లు ఇవ్వాలని రైల్వే శాఖ కోరితే రూ.200 కోట్లతో సరిపెట్టారు. బడ్జెట్లో సివిల్ పనులకు రూ.50 కోట్లు, భూసేకరణకు రూ.150 కోట్లు మాత్రం ప్రతిపాదించారు.
* భారీ, మెగా పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలు సుమారు రూ.2 వేల కోట్లయితే, బడ్జెట్లో ప్రతిపాదించింది రూ.411.62 కోట్లు మాత్రమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి