కలగానే.. కొత్త బస్సుల కొనుగోలు!
కొండలా పేరుకుపోతున్న అప్పులు, వెంటాడుతున్న నష్టాలు.. వెరసి ఆర్టీసీలో నూతన బస్సుల కొనుగోలు అంశం తీరని కలగానే మిగిలింది.. మరోవంక.. సంస్థలో కాలం చెల్లిన బస్సుల సంఖ్య పెరుగుతోంది.. పాత బండ్లకు రంగులద్ది నెట్టుకొచ్చే దైన్యస్థితి కొనసాగుతోంది.
సర్కారిచ్చే నిధులూ అరకొరే
ఆర్టీసీలో డొక్కు బండ్లే లెక్కకు మిక్కిలి
ఫెమా-2 పథకాన్నీ వినియోగించుకోని తీరు
కొండలా పేరుకుపోతున్న అప్పులు, వెంటాడుతున్న నష్టాలు.. వెరసి ఆర్టీసీలో నూతన బస్సుల కొనుగోలు అంశం తీరని కలగానే మిగిలింది.. మరోవంక.. సంస్థలో కాలం చెల్లిన బస్సుల సంఖ్య పెరుగుతోంది.. పాత బండ్లకు రంగులద్ది నెట్టుకొచ్చే దైన్యస్థితి కొనసాగుతోంది. కొత్త బస్సుల కొనుగోలుకు రాష్ట్ర సర్కారిచ్చే నిధులూ అరకొరగానే ఉన్నాయి.
గతమే ఘనం.. నేడంతా దైన్యం!
తెలంగాణ ఆర్టీసీలో గతంలో సుమారు 12వేల వరకు బస్సులు ఉండేవి. ఇపుడున్నవి 9,708 మాత్రమే.. వాటిలోనూ 3,107 అద్దె బస్సులే. 2014 నుంచి 4,991 బస్సులను కాలం చెల్లినవిగా భావించి తొలగించారు. పక్కన పెట్టాల్సినవి మరో 1,200 వరకు ఉన్నట్లు అంచనా. అధికారికంగా అలాంటి 854 బస్సులను గుర్తించారు. ఉన్నవాటిలోనూ సుమారు 30శాతం వాహనాలు 13లక్షల కిలోమీటర్లకు మించి తిరిగినవే. ఒక్కో బస్సు 15 ఏళ్లు నడపాలనుకుంటే ఏటా 750 బస్సుల వరకు కొనాలని, ఇందుకయ్యే వ్యయం రూ.300 కోట్ల మించదన్నది నిపుణుల అంచనా. కర్ణాటక, తమిళనాడులు కొత్త బస్సులను సమకూర్చుకుంటున్నాయి. మూడేళ్లలో కొత్త బస్సుల కోసం ఏపీఎస్ఆర్టీసీ రూ.1000 కోట్ల వెచ్చించినట్లు సమాచారం.
కొన్నది 1,826 బస్సులే..
గత అయిదేళ్లలో తెలంగాణ ఆర్టీసీ కొనుగోలు చేసింది 1,826 బస్సులే. అందులో 200 వరకు మినీ బస్సులున్నాయి. కాలుష్య కట్టడికి అనువుగా కేంద్రం ప్రవేశపెట్టిన ఫెమా-1 పథకం కింద సమకూరిన బ్యాటరీ ఆధారిత బస్సులు 40 ఉన్నాయి. ఫెమా-2 పరిధిలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లకు మరిన్ని బస్సులు లభించే అవకాశమున్నా సర్కారు సద్వినియోగం చేసుకోలేదు. ఇక కాలనీల కోసం ప్రవేశపెట్టిన మినీ వజ్ర ఏసీ బస్సుల్లో సింహభాగం ఐరావతాల్లా మారాయి. వాటిని విక్రయించాలని నిర్ణయించినా వ్యవహారం కొలిక్కి రాలేదు. హైదరాబాద్లో నడిపేందుకు వీలుగా 80 వరకు మెట్రో లగ్జరీ బస్సులను 2014లో కొన్నారు. ఏసీ బస్సులుగా నగరంలో తిప్పారు. వాటికి మార్పులుచేర్పులు చేసి దూరప్రాంతాలకు వెళ్లే రాజధాని బస్సులుగా నడుపుతున్నారు. కరోనా కారణంగా హైదరాబాద్లో సుమారు 900 బస్సులను తగ్గించారు. ప్రస్తుతం 2,850 వరకు తిరుగుతున్నాయి. ఇక్కడున్న వాటిలో సగం బస్సుల్ని మార్చాల్సి ఉందని ఉద్యోగ వర్గాలు చెప్తున్నాయి.
ప్రజాప్రతి‘నిధులు’ తలచుకుంటే..
ప్రస్తుతం ఆర్టీసీకి ఉత్సాహవంతులైన ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారు. వారు చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కలవాలి. వారికుండే నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి నూతన బస్సుల కొనుగోలుకు కొంత మొత్తం రాబట్టగలిగితే ఆర్టీసీ, ప్రభుత్వంపైనా భారం పడకుండా ఉంటుంది. సామాజిక బాధ్యత(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద ఆదాయ పన్ను మినహాయింపు ఉన్న నేపథ్యంలో నిధులు సమీకరించి నూతన బస్సులు కొనాలి.
- ఎం.నాగేశ్వరరావు, ఆర్టీసీ మాజీ డైరెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. -
రేపు తెలంగాణ ఈసెట్ ఫలితాలు
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. -
వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది. -
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బొగ్గు తరలింపుపై ప్రతిష్టంభన
సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వర్షాకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు. -
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..