జల, విద్యుత్తు ప్రాజెక్టులకు రూ.1.63 కోట్ల రుణం
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన జల, విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ)ల ద్వారా ఇప్పటివరకు రూ.1,63,627 కోట్ల రుణం విడుదల చేసినట్లు కేంద్ర విద్యుత్తు
తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరు, సీతారామ తదితరాలకు పీఎఫ్సీ, ఆర్ఈసీ ద్వారా అప్పు అందించాం
కాళేశ్వరానికి వడ్డీ 9.2-11%.. 2022 అక్టోబరు నుంచి చెల్లింపులు
కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడి
ఈనాడు, దిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన జల, విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ)ల ద్వారా ఇప్పటివరకు రూ.1,63,627 కోట్ల రుణం విడుదల చేసినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కేసింగ్ తెలిపారు. గురువారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘ఆర్ఈసీ ద్వారా కాళేశ్వరం, ఇందిరమ్మ ఫ్లడ్ఫ్లో కెనాల్, దేవాదుల ఎత్తిపోతలు, సీతారామ ఎత్తిపోతలు, పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి, పీఎఫ్సీ ద్వారా కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు రుణం అందించాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు పీఎఫ్సీ ఇచ్చిన రుణంపై వడ్డీ 9.2% నుంచి 11%మేర ఉంది. రుణ కాలపరిమితి 12 ఏళ్లు. 2022 అక్టోబరు 15 నుంచి చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఎఫ్ఆర్బీఎం పరిమితుల కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణానికి పూచీకత్తు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు 7 లింకుల్లో సాగుతుంది. ఇప్పటివరకు మొదటి రెండు లింకులు 100% పూర్తయ్యాయి. మూడోది 76%, నాలుగోది 92%, అయిదోది 57%, ఆరోది 25%, ఏడోది 55% మేర పూర్తయింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల రుణంపై వడ్డీ 10.65% నుంచి 11% మేర ఉంది. రుణ కాల పరిమితి 15 ఏళ్లు. 2024 అక్టోబరు 15 నుంచి రుణ చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం అయిదు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇప్పటి వరకు తొలిదశ 49%, రెండో దశ 70%, మూడో దశ 67%, నాలుగో దశ 52% పూర్తయింది. అయిదోది రాష్ట్ర ప్రభుత్వ అనుమతి దశలో ఉంది. దీనికి పీఎఫ్సీ ఎలాంటి రుణం అందించలేదు’’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి రూ.744 కోట్లతో ప్రతిపాదనలు
కేంద్ర రహదారి, మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద 523 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.744 కోట్ల విలువైన 42 ప్రతిపాదనలు అందినట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం లోక్సభలో తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆయా రాష్ట్రాల భూభాగం, ఇంధన వినియోగం సూత్రాల ఆధారంగా రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కేంద్రం సీఆర్ఐఎఫ్ నిధులు కేటాయిస్తుందన్నారు. తెలంగాణకు 2021-22కి రూ.262.19 కోట్లు కేటాయించామన్నారు. 2022-23 తాలూకూ కేటాయింపులను వచ్చే ఏడాది ఖరారు చేస్తామన్నారు.
అంతరించే దశలో 117 భారతీయ భాషలు
అంతరించే దశలో 117 భారతీయ భాషలు ఉన్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. గురువారం రాజ్యసభలో తెరాస నేత కె.కేశవరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పదివేల మంది కంటే తక్కువ జనాభా మాట్లాడే భాషలను అంతరించే దశలో ఉన్నట్లు పరిగణిస్తున్నామని చెప్పారు. వీటి సంరక్షణకు మైసూరులోని భారతీయ భాషల సంస్థకు యూజీసీ రూ.45.89 కోట్లు ఇచ్చిందన్నారు.
పులుల గణనకు ప్రత్యేక యాప్
పులుల గణన(ఇండియా టైగర్ ఎస్టిమేషన్-2022) కోసం ఎంస్ట్రైప్స్ (మానిటరింగ్ సిస్టం ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్) పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించినట్లు పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే తెలిపారు. తెరాస సభ్యుడు కె.ఆర్. సురేష్రెడ్డి గురువారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్