మద్దతు ధరలకు చట్టబద్ధత!
నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా, పంటల కనీస మద్దతు ధరలకు (ఎంఎస్పీ) చట్టబద్ధత సాధన కోసం దిల్లీ సరిహద్దుల్లో ప్రారంభమైన రైతు ఉద్యమం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే సాగు చట్టాలను
బనాయించిన కేసుల్ని ఎత్తేసాం
రైతు నేతలకు కేంద్రం ఆఫర్
వెంటనే నిరసనలు విరమించాలని షరతు...
ఆ నిబంధనపై సంయుక్త కిసాన్ మోర్చా అభ్యంతరం
దిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్న రైతు సంఘాల నేతలు
దిల్లీ: నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా, పంటల కనీస మద్దతు ధరలకు (ఎంఎస్పీ) చట్టబద్ధత సాధన కోసం దిల్లీ సరిహద్దుల్లో ప్రారంభమైన రైతు ఉద్యమం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే సాగు చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తామని, ఆందోళనల సమయంలో బనాయించిన కేసులన్నిటినీ ఎత్తివేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని రైతు నేతలకు చేరవేయడమే కాక హామీ పత్రం ముసాయిదా ప్రతిని వారి వద్దకు పంపినట్లు సమాచారం. ఆ ప్రతిని అందుకున్న సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు మంగళవారం దిల్లీ సింఘు సరిహద్దులో సమావేశమై విస్తృతంగా చర్చించుకున్నారు. ప్రభుత్వం పెట్టిన ఒక షరతుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్లు తెలిసింది. బుధవారం మధ్యాహ్నం మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు.
అభ్యంతరమైనవి ఏమిటంటే..
తమ డిమాండ్లకు అంగీకారం తెలుపుతూ కేంద్రం పంపిన ప్రతిపాదనల్లో కొన్ని అభ్యంతరకరమైని ఉన్నాయని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు తెలిపారు. నిరసనలు విరమిస్తేనే రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామనడాన్ని తప్పుపట్టారు.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ప్రతిపాదనకు కూడా అభ్యంతరం తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చాతో, ఉద్యమంతో సంబంధం లేని రైతు సంఘాలను ఈ కమిటీలో ప్రభుత్వం భాగం చేయనుందని ఆరోపించారు. తమ డిమాండ్లకు వ్యతిరేకంగా ఉన్న రైతు సంఘాల సభ్యులను కమిటీలో చేర్చడం ఆమోదనీయం కాదని పేర్కొన్నారు.
కేంద్రం ప్రతిపాదనలు..
* ఎంఎస్పీకి చట్టబద్ధతపై కమిటీ ఏర్పాటు
* ఆ కమిటీలో ప్రభుత్వ అధికారులతో పాటు వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలు, ఎస్కేఎం ప్రతినిధులకు స్థానం
* నిరసనల వేళ రైతులపై పెట్టిన కేసులు, పంటవ్యర్థాల దహనం అభియోగాలతో నమోదైన కేసులన్నీ రద్దు
* ఈ హామీలన్నిటినీ లిఖితపూర్వకంగా ఇచ్చేందుకు సుముఖత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
ప్రైవేటులో రుసుములపై త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రాణాలు తీసిన పెద్దపులిని పట్టేశారు
మహారాష్ట్రలోని బల్లార్ష-కార్వా అటవీ ప్రాంతంలో నాలుగు నెలల కాలంలో నలుగురు వ్యక్తుల ప్రాణాలు తీసిన టి-86 అనే పెద్దపులిని ఎట్టకేలకు అటవీ అధికారులు సోమవారం రాత్రి పట్టుకుని చంద్రపూర్కు తరలించారు. -
రచయితలపై దాడుల విషయంలో ప్రభుత్వం మౌనం సరికాదు
కాకతీయ యూనివర్సిటీలో సమూహ కవులు, రచయితలపై ఏబీవీపీ జరిపిన భౌతిక దాడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం అరాచక శక్తులకు ఆజ్యం పోస్తోందని తెలంగాణ నిర్బంధ వ్యతిరేక వేదిక మండిపడింది. -
నామినేషన్ల తిరస్కరణపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సంబంధించి దాఖలైన నామినేషన్ల తిరస్కరణపై జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. -
కృష్ణా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణపై ఏపీ దాఖలుచేసిన పిటిషన్కు విచారణార్హత లేదు
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలతోపాటు వాటి అవుట్లెట్లన్నింటినీ కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, వాటిని కృష్ణా ట్రైబ్యునల్-1 తీర్పు ప్రకారం నిర్వహించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్కు విచారణార్హత లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. -
బాబూజీ స్మారక నాణెం విడుదల
బాబూజీ మహరాజ్ మార్గదర్శకాలు.. ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. -
మే 6 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
మే 6 నుంచి 31వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నేడు కర్ణాటకకు ఇంజినీర్ల బృందం
రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆ రాష్ట్రాన్ని కోరనుంది. -
సంక్షిప్త వార్తలు
నీటిపారుదలశాఖలో మంగళవారం పది మంది ఇంజినీర్లు పదవీ విరమణ పొందారు. మంచిర్యాల చీఫ్ ఇంజినీర్ గడ్డం శ్రీనివాస్ ఈ జాబితాలో ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర