ఆపరేషన్ మహేశ్ బ్యాంక్
హైదరాబాద్లోని ఏపీ మహేశ్ కోఆపరేటివ్ బ్యాంక్పై నైజీరియన్లు అమెరికా, కెనడాల నుంచి సైబర్ దాడులు చేశారు. అక్కడి ఐపీ చిరునామాలతో మహేశ్ బ్యాంక్ ప్రధాన సర్వర్లోకి ప్రవేశించి గంటల వ్యవధిలో రూ.12.90 కోట్లను కాజేశారు.
అమెరికా, కెనడా ఐపీ చిరునామాల నుంచి సర్వర్లోకి
వేగంగా స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్లోని ఏపీ మహేశ్ కోఆపరేటివ్ బ్యాంక్పై నైజీరియన్లు అమెరికా, కెనడాల నుంచి సైబర్ దాడులు చేశారు. అక్కడి ఐపీ చిరునామాలతో మహేశ్ బ్యాంక్ ప్రధాన సర్వర్లోకి ప్రవేశించి గంటల వ్యవధిలో రూ.12.90 కోట్లను కాజేశారు. ఈ సైబర్ దాడి తీవ్రతను తగ్గించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. 24 గంటలు పట్టే పనులను 5 గంటల్లోనే పూర్తి చేశారు. ఆదివారం రాత్రి 11 గంటలకు తమ బ్యాంక్లోంచి నగదు నిల్వలు వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ అవుతున్నాయంటూ డీజీఎం బద్రీనాథ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగానే ‘‘ఆపరేషన్ మహేశ్ బ్యాంక్’’ ప్రారంభమైంది. అప్పుడు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లతో పాటు ఇతర అధికారులు సత్వరం స్పందించడంతో గంటల వ్యవధిలోనే రూ.3.50 కోట్లు సైబర్ నేరస్థుల బారిన పడకుండా ఆపగలిగారు.
నగదు నిల్వలు వేగంగా తగ్గడంతో...
ఏపీ మహేశ్ బ్యాంక్ సర్వర్లోకి నైజీరియన్లు శనివారం రాత్రి ప్రవేశించారు. అప్పటినుంచి ఆదివారం సాయంత్రం వరకూ నిందితులు వేర్వేరు ఖాతాల్లోకి నగదు బదిలీ చేసుకున్నారు. బ్యాంక్ ఖాతాదారులకు, ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన నగదును సరి చూసుకునేందుకు బ్యాంక్ ప్రతినిధులు నగదు నిల్వలను పరిశీలించారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.65 లక్షలు ఇలా నగదు వేర్వేరు ఖాతాలకు వెళ్లిందని గుర్తించారు. వెంటనే వారు అప్రమత్తమై బషీర్బాగ్లోని సైబర్ క్రైమ్ పోలీస్ ఠాణాకు వచ్చారు. రాత్రి విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుదర్శన్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు సమాచారం ఇవ్వడంతో ఎస్సై మదన్ను పోలీస్ ఠాణాకు పంపించారు. ఆయన, కానిస్టేబుళ్లు సుదర్శన్, శ్రీకాంత్నాయక్లు వేగంగా స్పందించారు. సైబర్ పోర్టల్లో ఫిర్యాదును అప్లోడ్ చేసేందుకు, 27 బ్యాంకులకు సమాచారం ఇచ్చేందుకు ఇన్స్పెక్టర్ ప్రశాంత్ డిజిటల్ సంతకాన్ని అప్పటికప్పుడు తెప్పించారు. అనంతరం ముగ్గురూ కలిసి 27 బ్యాంకులు, 128 బ్యాంక్ ఖాతాలకు మెయిల్స్ పంపించారు. సైబర్ నేరాలను అడ్డుకునేందుకు కొత్తగా ప్రవేశపెట్టిన సైబర్ పోర్టల్లో నమోదు చేశారు. సోమవారం ఉదయం ఈ-మెయిల్ లేఖలను హైదరాబాద్లోని 27 బ్యాంకులకు పంపించారు.
అమెరికా.. కెనడా ఐపీలపై ఆరా..
సైబర్ నేరస్థులు నగదు బదిలీ చేసుకునేందుకు ఉపయోగించిన అమెరికా, కెనడాల ఇంటర్నెట్ ప్రొటోకాల్(ఐపీ) చిరునామాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇవి నిజమైనవేనా? లేక ప్రాక్సీ మెయిల్స్ (నకిలీ చిరునామాలు) ఉంటాయా? అని పరిశోధిస్తున్నారు. ఈ వివరాలు వస్తే.. ఎక్కడి నుంచి ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ వినియోగించారన్నది కచ్చితంగా తెలుస్తుంది. ఆయా ఐపీ చిరునామాలు ప్రాక్సీవన్న భావనతోనే అసలు చిరునామాల కోసం వివరాలను సేకరిస్తున్నారు. ఇక సైబర్ నేరస్థులు రూ.12.90 కోట్లు నగదు బదిలీ చేసుకునేందుకు ఉపయోగించిన ఫోన్ నంబర్లు కూడా వేర్వేరు పేర్లతో ఉండటంతో సైబర్ నేరస్థులు విత్డ్రా చేసుకున్న ఏటీఎం కేంద్రాల వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు ఏపీ మహేశ్ బ్యాంక్లోని వ్యక్తిగత ఖాతాలు హ్యాక్ కాలేదని డీజీఎం బద్రీనాథ్ తెలిపారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం
నారాయణగూడ, న్యూస్టుడే: మహేశ్ బ్యాంక్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అదనపు కమిషనర్(నేర పరిశోధన) ఎ.ఆర్.శ్రీనివాస్ తెలిపారు. బ్యాంక్ ప్రధాన సర్వర్ హ్యాక్ ఎలా అయ్యిందో తెలుసుకునేందుకు 4 పత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా