మానవత్వం చాటుతున్న.. గాంధీ
కరోనా రోగులకు అత్యవసర ఆపరేషన్లు చేయడానికి ప్రైవేటు ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి కొవిడ్ బాధితులకు
కొవిడ్ రోగులకు అత్యవసర ఆపరేషన్లు
వైద్యం అందించిన 5 రోజుల తరువాత శస్త్రచికిత్సలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: కరోనా రోగులకు అత్యవసర ఆపరేషన్లు చేయడానికి ప్రైవేటు ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి కొవిడ్ బాధితులకు అత్యవసర ఆపరేషన్లు చేస్తూ మానవత్వాన్ని చాటుతోంది. కొవిడ్ సోకిన అయిదు రోజుల తరవాత రోగికి అవసరమైన ఆపరేషన్లు చేసి సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు పంపిస్తోంది. గడిచిన పదిహేను రోజుల్లో వంద మందికి ఇలాంటి అత్యవసర ఆపరేషన్లు చేశారు.
మొదటి, రెండు దశల్లో కరోనా బారినపడిన దాదాపు రెండు లక్షల మందికి గాంధీ ఆసుపత్రి చికిత్సలు అందించింది. ప్రస్తుత కరోనా మూడో దశలోనూ రోగులకు సేవలు అందించడంలో ఈ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈసారి గాంధీని మొత్తం కొవిడ్ ఆసుపత్రిగా ప్రకటించకుండా 300 పడకలను మాత్రమే కేటాయించి చికిత్సలు అందిస్తున్నారు. మెదడు, ఇతర ఆపరేషన్లు చేయాల్సిన సమయంలో చాలా మంది కరోనా బారినపడుతున్నారు. ఇలాంటి వారిని చేర్చుకోవడానికి కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు విముఖత చూపుతున్నాయి. అత్యవసరమైనా సరే.. ఆపరేషన్ చేయలేమని చేతులెత్తేస్తున్నాయి. ఇలాంటి వారికి అండగా నిలుస్తోంది గాంధీ ఆసుపత్రి. సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు కొన్ని రోజుల కిందట వైద్యులతో చర్చించి అత్యవసరమైన వారికి ఆపరేషన్లు చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాంటి రోగుల కోసం ప్రతి విభాగంలో 10 నుంచి 30 పడకలు ఏర్పాటు చేశారు. అత్యవసర చికిత్స అవసరమై, కొవిడ్ బారినపడిన రోగులు ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం 70 మంది ఉన్నారు. వారిలో 20 మంది అయిదేళ్లలోపు చిన్నారులు, 40 మంది గర్భిణులు. వీరందరికీ శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆక్సిజన్ శాతం తగ్గిపోయి, ఆరోగ్యం విషమిస్తున్న వారికి మాత్రం వైరస్ లక్షణాలు తగ్గిన తరువాతే ఆపరేషన్లు చేయాలని వైద్యులు భావిస్తున్నారు.
వంద మందికి అత్యవసర ఆపరేషన్లు
మహమ్మారి సోకిన వారికి అత్యవసర చికిత్సలు అందించేందుకు గాంధీలో వైద్య బృందాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. పదిహేను రోజుల్లో వంద మంది కరోనా బాధితులకు చిన్న, పెద్ద ఆపరేషన్లు చేశాం. ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారం కొవిడ్ బాధితులకు 5 లేదా 7 రోజుల చికిత్స సరిపోతుంది. తరవాత మళ్లీ వైరస్ నిర్ధారణ పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో 180 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.
- డాక్టర్ రాజారావు, సూపరిండెంటెంట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!