కృష్ణా, గోదావరి బోర్డుల పాపం కాంగ్రెస్దే..
కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. వాటి ప్రస్తావనతో కాంగ్రెస్ ప్రాజెక్టులకు ఉరి వేస్తే.. నేటి భాజపా ప్రభుత్వం వాటిని అమలు చేస్తోందని మంత్రి హరీశ్రావు
రాష్ట్రం ఫిర్యాదుతోనే రాయలసీమ లిఫ్టుపై కోర్టు స్టే ఇచ్చింది
శాసనసభలో మంత్రి హరీశ్రావు
ఈనాడు, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. వాటి ప్రస్తావనతో కాంగ్రెస్ ప్రాజెక్టులకు ఉరి వేస్తే.. నేటి భాజపా ప్రభుత్వం వాటిని అమలు చేస్తోందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడారు. గోదావరిపై ఆరు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను ఆరు నెలల క్రితమే గోదావరి బోర్డుకు ప్రభుత్వం ఇచ్చింది. రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదుతోనే రాయలసీమ ఎత్తిపోతలపై కోర్టు స్టే విధించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సారెస్పీ పూర్తిచేయడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కరవు తాండవం చేసింది. ఎంతోమంది వలస పోయేవారు. కాంగ్రెస్ పాలనలో బొంబాయి.. దుబాయి.. బొగ్గుబాయి గాక మరేముంది? కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో నిర్మించాం. గోదావరి, కావేరి అనుసంధానం పెద్ద జోకు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తయ్యాకనే అనుసంధానం విషయం ఆలోచిస్తామని సీఎం ఎన్నోసార్లు చెప్పారు. కాళేశ్వరానికి ఇప్పటి వరకు రూ. 77,852 కోట్లు వ్యయం చేశాం. పాదయాత్రలో మల్లన్నసాగర్తోపాటు మిగిలిన జలాశయాలు కూడా భట్టి విక్రమార్క సందర్శించొచ్చు. ఆ నీటిని నెత్తినపోసుకుంటే కాంగ్రెస్ పాలనలో చేసిన పాపాలైనా పోతాయి’’ అని అన్నారు.
భావితరాల బాగు కోసమే అప్పులు
భావితరాల అవసరాల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం క్యాపిటల్ వ్యయానికే అప్పులు చేస్తున్నాం. ఏటా ఎఫ్ఆర్బీఎంను కేంద్రం, ఆర్బీఐ పరిమితులు, నిబంధనల మేరకు సవరించుకోవడం ప్రహసనంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే వచ్చే ఏడాదికి ముందుగానే పెంచుకునేందుకు చట్టాన్ని సవరించుకుంటున్నాం. దేశంలోని రాష్ట్రాల అప్పుల జాబితాలో కింది నుంచి పైకి నాలుగో స్థానంలో తెలంగాణ ఉంది. దేశం అప్పుల శాతం 62.6 కాగా తెలంగాణది 27 శాతం మాత్రమే. అప్పులు విషయంలో కాంగ్రెస్ ఆందోళన అర్థం లేనిది. వాస్తవానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పంజాబ్ (మొన్నటి వరకు) 49.1, ఛత్తీస్గఢ్ 28.6, రాజస్థాన్ 42.6 శాతం అప్పులు చేశాయి. దేశంలో అనేక రాష్ట్రాలు పెద్ద ఎత్తున చేస్తున్నాయి. మనం చేసిన అప్పులతో ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు, మౌలిక వసతులు కల్పించుకుంటున్నాం. అని మంత్రి హరీశ్రావు తెలిపారు. మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఎ.ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆయా పద్దులపై సమాధానాలు ఇచ్చారు.
పలు బిల్లులకు ఆమోదం
ఎఫ్ఆర్బీఎం సవరణ బిల్లు, మార్కెట్ కమిటీల్లో పాలకవర్గ సభ్యుల సంఖ్య, కాలపరిమితి పెంపు బిల్లులను సభ ఆమోదించింది. సాగునీటి పారుదల, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, రహదారులు-భవనాలు, ఇంధనశాఖ, న్యాయశాఖ, ప్రణాళిక-ఆర్థిక శాఖల పద్దులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బొగ్గు తరలింపుపై ప్రతిష్టంభన
సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వర్షాకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. -
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
రేపు ఈసెట్ ఫలితాలు
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. -
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. -
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. -
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది. -
ఎవరెస్ట్ బేస్క్యాంప్పై తెలంగాణ యువకుడు
దేశంలో అన్ని కులాలు, మతాలు సమానమనే సందేశాన్ని చాటుతూ..ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటి రాజిపేటలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఏకు చిరంజీవి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్
-
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
-
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
-
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా
-
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం