రాములోరి సన్నిధికి.. రైలు!
రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం రైలు మార్గంతో అనుసంధానం కానుంది. ఒడిశాలోని మల్కన్గిరి నుంచి రాష్ట్రంలో పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైనుకు సంబంధించిన చివరి విడత సర్వే జరుగుతోంది.
మల్కన్గిరి-భద్రాచలం మధ్య కొత్త మార్గం
గోదావరిపై భారీ వంతెన
రూ.2,800 కోట్ల అంచనా వ్యయం
రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమీక్ష
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం రైలు మార్గంతో అనుసంధానం కానుంది. ఒడిశాలోని మల్కన్గిరి నుంచి రాష్ట్రంలో పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైనుకు సంబంధించిన చివరి విడత సర్వే జరుగుతోంది. జూన్ కల్లా ఈ నివేదిక సిద్ధం కానుంది. ప్రాథమికంగా రూ.2,800 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. అనంతరం డీపీఆర్ రూపొందించాక నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది. వచ్చే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించిన తుది సర్వేపై రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ఒడిశాలోని కోరాపూట్లో జిల్లా అధికారులు, వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్కుమార్ సత్పతితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ మార్గానికున్న ప్రాధాన్యం, అనుసంధాన ప్రాంతాలు తదితరాలను డీఆర్ఎం మంత్రికి వివరించారు. భద్రాచలం వద్ద గోదావరిపై భారీ వంతెన నిర్మించాల్సి ఉంటుందన్నారు.
అటు ఆధ్యాత్మిక పర్యాటకం..ఇటు సరకు రవాణా
భద్రాచలానికి వెళ్లే భక్తులు భద్రాచలం రోడ్(కొత్తగూడెం) స్టేషన్లో దిగి, రోడ్డు మార్గంలో 40 కి.మీ ప్రయాణించాల్సి వస్తోంది. ఏటా 30 లక్షలకు మందికిపైగా పర్యాటకులు రాములవారి ఆలయాన్ని దర్శిస్తున్నారు. భద్రాచలం ఆలయాన్ని ‘ప్రసాద్’ పథకంలో చేర్చేందుకు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి ఇప్పటికే ఆమోదం తెలిపారు. ఈ మేరకు రూ.92.04 కోట్లతో రాష్ట్ర పర్యాటకశాఖ ప్రతిపాదనలూ పంపింది. ‘ఈ రైలుమార్గం ఒడిశా, తెలంగాణలోని గిరిజన ప్రాంతాల మీదుగా సాగుతుంది. అందుకే రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మరోవైపు భద్రాచలం రోడ్-సత్తుపల్లి కొత్త రైల్వే లైను నిర్మాణం తుది దశలో ఉంది. సత్తుపల్లి నుంచి ఏపీలోని కొవ్వూరు వరకు కొత్త లైను చాలాకాలం క్రితమే మంజూరైనా పట్టాలెక్కలేదు. మల్కన్గిరి-భద్రాచలం మార్గం పూర్తయితే కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల నుంచి బొగ్గు ఇతర ఖనిజాల్ని ఏపీలోని కాకినాడ పోర్టుకు రవాణా చేయడం సులభం అవుతుంది. రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంద’’న్నాయి రైల్వే వర్గాలు.
మల్కన్గిరి-భద్రాచలం కొత్త లైను
* రైల్వే స్టేషన్ల సంఖ్య: 12
* మార్గం పొడవు: 173.41 కిమీ
* అంచనా వ్యయం: దాదాపు రూ.2,800 కోట్లు
* పెద్ద, ముఖ్యమైన వంతెనలు: 213 (48 పెద్దవి, 165 చిన్నవి)
ఒడిశాలో స్టేషన్లు: మల్కన్గిరి, బడాలి, కొవాసిగూడ, రజన్గూడ, మహారాజ్పల్లి, లునిమన్గూడ
తెలంగాణలో స్టేషన్లు: కన్నాపురం, కుటుగుట్ట, నందిగామ, భద్రాచలం, పాండురంగాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. -
రేపు తెలంగాణ ఈసెట్ ఫలితాలు
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. -
వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది. -
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బొగ్గు తరలింపుపై ప్రతిష్టంభన
సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వర్షాకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. -
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు. -
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
-
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?