Telangana News: అప్పు మార్పిడి రుణాలేవీ?
ఇటీవల అప్పులబాధ భరించలేక ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్దపోచారం గ్రామానికి చెందిన రైతు కాశిమల్ల వీరయ్య(58) పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయనకు రెండెకరాల భూమి ఉండగా సాగుకు గతంలో అప్పులు చేశారు. వాటిని తీర్చడానికి నాలుగేళ్ల క్రితం ఎకరా భూమిని అమ్మేశారు. మిగిలిన ఎకరంతో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకుని మిరప సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో పంటల పెట్టుబడి, కుటుంబ అవసరాలకు రూ.6 లక్షల వరకు అప్పులయ్యాయి. తీర్చే
రైతులకు రూ.1,770 కోట్లు ఇవ్వాలని నిర్దేశించిన రాష్ట్ర బ్యాంకర్ల సమితి
10 శాతం కూడా ఇవ్వని బ్యాంకులు
అన్నదాతల ప్రైవేటు అప్పుల భారం తీర్చే పథకంపై నిర్లక్ష్యం
ఈనాడు - హైదరాబాద్
ఇటీవల అప్పులబాధ భరించలేక ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్దపోచారం గ్రామానికి చెందిన రైతు కాశిమల్ల వీరయ్య(58) పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయనకు రెండెకరాల భూమి ఉండగా సాగుకు గతంలో అప్పులు చేశారు. వాటిని తీర్చడానికి నాలుగేళ్ల క్రితం ఎకరా భూమిని అమ్మేశారు. మిగిలిన ఎకరంతో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకుని మిరప సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో పంటల పెట్టుబడి, కుటుంబ అవసరాలకు రూ.6 లక్షల వరకు అప్పులయ్యాయి. తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా అప్పులు తీసుకుని ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు ఓ పథకం ఉంది. కానీ అది నత్తనడకన అమలవుతోంది.
ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి తీసుకున్న రుణాల నుంచి రైతులకు విముక్తి కల్పించే పథకం రాష్ట్రంలో పది శాతం కూడా ఆచరణకు నోచుకోలేదు. ప్రైవేటు రుణాలు తీర్చడానికి వీలుగా ఎలాంటి పూచీకత్తు లేకుండా అన్నదాతలకు అప్పు మార్పిడి రుణం(డెబిట్ స్వాపింగ్ లోన్ -డీఎస్ఎల్) ఇవ్వాలన్న రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) ఆదేశాలు నిరాదరణకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో డీఎస్ఎల్ కోటా కింద రైతులకు రూ.1,770 కోట్లు (మొత్తం పంట రుణాల్లో 3%) ఇవ్వాలని ‘రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి’(ఎస్ఎల్బీసీ) అన్ని బ్యాంకులకు రుణ లక్ష్యాలను నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం పూర్తయినా ఈ మొత్తంలో 10 శాతం కూడా ఇవ్వలేదని తాజాగా అధికార వర్గాలు అంచనాకు వచ్చాయి. ప్రైవేటు అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్న తరుణంలో ఈ పథకంపై దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
డీఎస్ఎల్ కోటా కింద రుణాల పంపిణీ పెద్దగా జరగలేదని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సాంకేతిక కమిటీ కన్వీనర్, తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంకు(టెస్కాబ్) ఎండీ నేతి మురళీధర్ ‘ఈనాడు’కు చెప్పారు. ఈ కోటా కింద రుణాలిస్తారనే విషయంపై రైతులకు, బ్యాంకుల సిబ్బందికి పెద్దగా అవగాహన లేకపోవడంతోనే పంపిణీ చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
పంట రుణాల్లోనూ నిబంధనలు పాటించని బ్యాంకులు
రైతుకు ఉన్న పొలాన్ని బట్టి రూ.లక్షా 60 వేల వరకూ ఎలాంటి పూచీ లేకుండా, పూచీకత్తుతో రూ.3 లక్షల వరకూ పంటరుణం ఇవ్వాలని ఆర్బీఐ ఆదేశాలున్నాయి. (ఈ ఆర్థిక సంవత్సరంలో వరి సాగుకు ఎకరాకు రూ.40 వేల రుణం ఇవ్వాలని బ్యాంకర్ల సమితి నిర్ణయించింది) అయినా పట్టాదారు పాసుపుస్తకాలను పూచీకత్తుగా పెట్టుకునే రుణాలిస్తున్నారని, గరిష్ఠంగా రూ.లక్షకు మించి ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.59 వేల కోట్ల పంట రుణాలివ్వాల్సి ఉండగా.. గత ఏడాది డిసెంబరు 31 నాటికి 53 శాతమే పంపిణీ చేశారు.
తిరస్కరిస్తే ఫిర్యాదు చేయవచ్చు
రైతుకు బ్యాంకులో పంట రుణానికి సంబంధించి పాత బాకీ ఉన్నా సరే ప్రైవేటు అప్పులు తీర్చడానికి అదనంగా రుణాలివ్వాలని ఆర్బీఐ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. డీఎస్ఎల్ కింద రుణం ఇవ్వడానికి తిరస్కరిస్తే స్థానిక లోక్అదాలత్లో ఫిర్యాదు చేయాలని హైకోర్టు సైతం తీర్పు ఇచ్చింది. అయితే ఎక్కువ మంది రైతులకు ఈ విషయం తెలియక బ్యాంకులపై ఫిర్యాదులేమీ చేయడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
-
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు