Telangana News: దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో మంటలు

సికింద్రాబాద్‌ నుంచి దిల్లీ వెళ్తున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయి. భువనగిరి దగ్గరలోని పగిడిపల్లి మధ్య శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో....

Updated : 03 Jul 2022 12:23 IST

ఘట్‌కేసర్‌ - పగిడిపల్లి మధ్య ఘటన

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి దిల్లీ వెళ్తున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయి. భువనగిరి దగ్గరలోని పగిడిపల్లి మధ్య శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు చివరి బోగీలో ఈ మంటలు కనిపించాయి. ఇది లగేజీ బోగీ అని రైల్వే అధికారులు తెలిపారు. మంటలను గమనించిన సిబ్బంది డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు.

ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? లేదా? అన్న విషయాలు తెలియరాలేదు. తక్షణం సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైల్లో సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీప ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మంటలనార్పే ప్రయత్నం చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని