KTR: డాక్టర్ కావాలనుకున్నా..
‘‘వైద్య వృత్తి ఎంతో పవిత్రమైంది. కష్టకాలంలో వైద్యులు పనిచేసే విధానం చూస్తే గర్వంగా ఉంటుంది.
నాన్న చెప్పిన మాటలతో విరమించుకున్నా
ఉమెన్ ఇన్ మెడిసిన్ సదస్సులో మంత్రి కేటీఆర్
గచ్చిబౌలి, న్యూస్టుడే: ‘‘వైద్య వృత్తి ఎంతో పవిత్రమైంది. కష్టకాలంలో వైద్యులు పనిచేసే విధానం చూస్తే గర్వంగా ఉంటుంది. మా అమ్మ కోరిక ప్రకారం డాక్టర్ కావాలనుకున్నా. అప్పట్లో ఎంసెట్ రాస్తే 1,600వ ర్యాంకు రావడంతో ఇక్కడ మెడిసిన్ సీటు రాలేదు. కర్ణాటకలో ప్రవేశపరీక్ష రాస్తే వచ్చింది. వైద్య వృత్తిలో డిగ్రీ, పీజీ చదివి.. సూపర్ స్పెషాలిటీ కోర్సు చేసి జీవితంలో స్థిరపడాలంటే వయసు 32కు చేరుతుంది. డాక్టరైన తరువాత అత్యవసర పరిస్థితుల్లో, అర్ధరాత్రిళ్లు పనిచేయాల్సి ఉంటుంది. ‘జీవితం, పనిని సమన్వయం చేసుకోగలవా..’ అని నాన్న అనడంతో నాలో ఆలోచన రేకెత్తింది. దీంతో బయోటెక్నాలజీ వైపు వెళ్లాను’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో నిర్వహించిన ‘ఉమెన్ ఇన్ మెడిసిన్’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హెల్త్కేర్, లైఫ్సైన్సెస్లోనే కాదు.. పరిశోధన రంగాల్లోనూ నేడు మహిళలు రాణిస్తున్నారన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ అందించిన హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థలకు సుచిత్ర ఎల్ల(భారత్ బయోటెక్), మహిమా దాట్ల(బయోలాజికల్-ఇ) నాయకత్వం వహిస్తున్నారని ఉదహరించారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా వర్కింగ్ ఉమెన్ ఉన్న రాష్ట్రం తెలంగాణయేనని పేర్కొన్నారు. మహిళల కోసం విశ్వవిద్యాలయం, ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు వీహబ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ‘‘హెల్త్కేర్ రంగంలో విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. టెక్నాలజీ, లైఫ్సైన్సెస్కు హైదరాబాద్ హబ్గా మారింది. రాష్ట్రంలో 40 లక్షల మంది ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ హెల్త్ ప్రొఫెల్స్ను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సిరిసిల్ల జిల్లాలో వివరాలు సేకరించగా ఎక్కువ మందిలో క్యాన్సర్ లక్షణాలున్నట్లు తేలింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ నిర్మించనున్న ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నాం. ములుగు జిల్లాలోని ప్రజల్లో ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు బయటపడ్డాయి. కొవిడ్ సమయంలో హైదరాబాద్ నగరంలోని చాలా ఆసుపత్రులు రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసినా.. ఏఐజీ మాత్రం రోగుల చికిత్సలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. తక్కువ ధరలకే సేవలందించడం గొప్ప విషయం. ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, ఇతర వైద్యులకు అభినందనలు’’ అని కేటీఆర్ అన్నారు.
సూపర్ స్పెషాలిటీ సేవల్లో మహిళా భాగస్వామ్యం పెరగాలి: డాక్టర్ నాగేశ్వరరెడ్డి
వైద్య రంగంలోకి వస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని డాక్టర్ నాగేశ్వరరెడ్డి అన్నారు. ఎంబీబీఎస్లో 65-70 శాతం మంది మహిళలుండగా పీజీ, సూపర్స్పెషాలిటీ కోర్సుల్లో 15-20 శాతానికి మించి లేరని తెలిపారు. దేశవ్యాప్తంగా 2,500 మంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు ఉండగా.. అందులో 123 మంది మాత్రమే మహిళలున్నారని చెప్పారు. వేయి మంది ఎండోస్కోపీ నిపుణుల్లో ఇద్దరే మహిళలున్నారన్నారు. పీజీ, సూపర్స్పెషాలిటీ కోర్సులు పూర్తిచేసే దిశగా మహిళలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, థోరాసిక్ సర్జరీ లాంటి విభాగాల్లో మహిళా వైద్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డా.సి.మల్లికార్జున్, ఫెర్నాండెజ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏవిటా ఫెర్నాండెజ్, స్టార్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ గోపీచంద్ మన్నం పాల్గొన్నారు. అనంతరం ఐఏఎస్ అధికారిణి శాంతికుమారి, సినీ నటి అక్కినేని అమల, ఐపీఎస్ అధికారిణి షికా గోయల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తదితరులతో డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఇష్టాగోష్ఠి నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.