‘పాలమూరు’కు నీటి కేటాయింపులపై రెండు రాష్ట్రాల పట్టు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ జారీ చేసిన జీవో 246 చట్ట విరుద్ధమని ఏపీ, నీటి లభ్యత ఉన్నందునే డీపీఆర్ ఆమోదానికి జీవో జారీ చేశామని తెలంగాణ వాదనలు వినిపించాయి.
డీపీఆర్ ఆమోదం కోసమే నీటి లభ్యతపై జీవో ఇచ్చామన్న తెలంగాణ
ఆ జీవోపై ట్రైబ్యునల్లో ఏపీ అభ్యంతరాలు
ఇప్పుడు నీటి పంపిణీ అధికారం తమకు లేదన్న ట్రైబ్యునల్
ఈనాడు, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ జారీ చేసిన జీవో 246 చట్ట విరుద్ధమని ఏపీ, నీటి లభ్యత ఉన్నందునే డీపీఆర్ ఆమోదానికి జీవో జారీ చేశామని తెలంగాణ వాదనలు వినిపించాయి. ఏపీ మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దిల్లీలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 ముందు శుక్రవారం రెండు రాష్ట్రాలకు చెందిన సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ట్రైబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ బ్రిజేష్కుమార్ ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ట్రైబ్యునల్ ఇప్పుడు నదీ జలాల కేటాయింపులు చేయదని, కేటాయింపులు పూర్తికాని పక్షంలోనే ప్రాజెక్టుల వారీగా నిర్దిష్ట కేటాయింపులు చేస్తుందని స్పష్టం చేసింది. మైనర్ ఇరిగేషన్లో వినియోగం కింద 45 టీఎంసీలు, గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లిస్తున్న నేపథ్యంలో ఎగువన వినియోగించుకునే వెసులుబాటున్న 45 టీఎంసీలను నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ పాలమూరు ఎత్తిపోతలకు కేటాయింపులు చేసిందని ఏపీ పేర్కొంది. ట్రైబ్యునల్ మధ్యంతర పిటిషన్లను పరిష్కరించదని, అపెక్స్ కౌన్సిల్ తగిన వేదిక అంటూ గతంలో తెలంగాణ సూచించిన విషయాన్ని ఏపీ ప్రస్తావించింది. అపెక్స్ కౌన్సిల్కు న్యాయాన్ని నిర్ధారించే అధికారాలు లేవని, మధ్యవర్తిత్వం మాత్రమే వహిస్తుందని తెలిపింది. దీనికి స్పందించిన ట్రైబ్యునల్ అంతర్రాష్ట్ర జల వనరుల వివాదాల చట్టం ప్రకారం విచారణలు ఇప్పటికే ముగిశాయని పేర్కొంది.
మళ్లింపు జలాల పంపిణీయే..
గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు మళ్లించిన 45 టీఎంసీల నీటిని పంచుకునేందుకు సరైన యంత్రాంగం అవసరమని ఏపీ వాదించింది. తెలంగాణ మైనర్ ఇరిగేషన్ కింద 89.15 టీఎంసీలను కాకుండా 175 టీఎంసీలను వినియోగిస్తోందంటూ మిషన్ కాకతీయ ఉత్తర్వులను ఏపీ ఉదహరించింది. తెలంగాణ ఏపీఆర్ఏ చట్టం, అపెక్స్ కౌన్సిల్, కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీలకు పాలమూరు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించలేదని పేర్కొంది. దీనికి స్పందించిన తెలంగాణ సీనియర్ న్యాయవాది.. ఇప్పటికే డీపీఆర్ను కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీకి తెలంగాణ సమర్పించిందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు పొందేందుకే నీటి లభ్యతను చూపాల్సి వచ్చిందా? అంటూ ఈ సందర్భంగా ట్రైబ్యునల్ ప్రశ్నించింది. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు పొందాలంటే సీడబ్ల్యూసీ నుంచి నీటి లభ్యత ఉన్నట్లు ఆధారాలు చూపాల్సి ఉన్నందునే తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు జీవో-246 జారీ చేసిందని తెలంగాణ పేర్కొంది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాదులు జైదీప్ గుప్తా, జి.ఉమాపతి, తెలంగాణ తరఫున సీఎస్ వైద్యనాథన్, రామకృష్ణారెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. అనంతరం ట్రైబ్యునల్ విచారణను వచ్చే నెల 12, 13 తేదీలకు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి