స్వాధీనం చేసుకున్న వాటిని తిరిగిచ్చేలా ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్, ఇతర రికార్డులను కాపీ చేసుకోకుండా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలంటూ తెలంగాణ హైకోర్టుకు బ్రహ్మయ్య అండ్ కొ విజ్ఞప్తి చేసింది.
చట్టవిరుద్ధమైన సోదా ఉత్తర్వులను రద్దు చేయండి
సంబంధం లేని సమాచారాన్ని తీసుకెళ్లారు
తెలంగాణ హైకోర్టులో బ్రహ్మయ్య అండ్ కొ అనుబంధ పిటిషన్
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్, ఇతర రికార్డులను కాపీ చేసుకోకుండా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలంటూ తెలంగాణ హైకోర్టుకు బ్రహ్మయ్య అండ్ కొ విజ్ఞప్తి చేసింది. తమ కార్యాలయంలో సోదాల నిమిత్తం ఇచ్చిన నోటీసులను రద్దుచేయాలని కోరింది. ఈ మేరకు బ్రహ్మయ్య అండ్ కొ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం అనుబంధ పిటిషన్ దాఖలుచేసింది. వివరాలిలా ఉన్నాయి.. ‘గత వారం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసినప్పుడు పూర్తి సమాచారం అందుబాటులో లేదు. మార్చి 28 మధ్యాహ్నం 2.30 నుంచి 29న 5 గంటల వరకూ భాగస్వామి కోటేశ్వరరావును సీఐడీ అధికారులు తమ నియంత్రణలో ఉంచుకోవడంతో సమాచారం లేకపోయింది. కార్యాలయంలో సోదాల నిమిత్తం 30-35 మంది వచ్చినా, ఇద్దరే యూనిఫాం వేసుకుని, మిగిలినవారు మఫ్టీలో వచ్చారు. స్థానిక పోలీసులు ఎవరూ లేకుండా ప్రవేశించి బలవంతంగా ఇంటర్నెట్, సీసీటీవీ కనెక్షన్లను కట్ చేశారు. ఏపీ పోలీసులకు ఇక్కడ సోదా చేసే పరిధి లేదని అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోకుండా కార్యాలయంలో ఉన్నవారందరి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మార్గదర్శి సమాచారాన్ని ఇస్తామని చెబుతున్నా పట్టించుకోకుండా కంప్యూటర్లలోని సమాచారాన్ని కాపీ చేసుకుని, రికార్డులను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. సీఐడీ జారీచేసిన సోదా ఉత్తర్వులు ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబధించినవే తప్ప, మార్గదర్శి చట్టబద్ధ ఆడిటర్ పాత్రకు చెందినవి కావు. కంపెనీ చట్టం కింద మార్గదర్శికి చెందిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ను రూపొందించడమే మా బాధ్యత. చిట్ఫండ్ కింద ఎలాంటి ఆడిట్ నిర్వహించట్లేదు’ అని తెలిపింది.
సమాచారం తీసుకెళ్లిన వ్యక్తి అరెస్టు
మార్గదర్శి సమాచారాన్ని సమర్పించాలంటూ సీఐడీ అదనపు ఎస్పీ మార్చి 18న నోటీసు జారీచేశారని, అయితే ఆర్థిక సంవత్సరాంతం కావడంతో మూడు వారాల గడువు కావాలని కోరినట్లు బ్రహ్మయ్య అండ్ కొ తెలిపింది. దీనికి వారు నిరాకరించడంతో 28న ఉదయం 10 గంటలకు కె.శ్రావణ్ ల్యాప్టాప్తో విజయవాడ సీఐడీ కార్యాలయానికి వెళ్లగా ఆయనతో పాటు వెళ్లిన రజత్ను నిర్బంధించి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారంది. 29న శ్రావణ్ను అరెస్టుచేసి రిమాండుకు తరలించారని తెలిపింది. సమాచారం ఇచ్చినా హైదరాబాద్ కార్యాలయంలో బలవంతంగా సోదాలు ప్రారంభించారంది. ముగ్గురు భాగస్వాములు, 18 మంది ఉద్యోగులను నిర్బంధించి ఫోన్లను జప్తు చేశారని, మహిళా ఉద్యోగులను సాయంత్రం 5 గంటలకు, మధుమేహం ఉన్న ఒక భాగస్వామిని సాయంత్రం, మరొకరిని రాత్రి వదిలిపెట్టారన్నారు. 80 ఏళ్ల పి.కోటేశ్వరరావు ఆరోగ్యాన్నీ పట్టించుకోకుండా సోదాలు పూర్తయ్యేదాకా వారితోనే ఉంచుకున్నారని తెలిపింది. మార్గదర్శివే కాకుండా, ఖాతాదారులందరికీ చెందిన 12 ల్యాప్టాప్లు, 2 డేటా బ్యాకప్స్, 7 డెస్క్టాప్లలోని సమాచారాన్ని కాపీ చేసుకున్నారంది. మార్గదర్శితో సంబంధంలేని డాల్ఫిన్ హోటల్స్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఉషోదయ పబ్లికేషన్స్, ఈటీవీ, మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ కంపెనీ లిమిటెడ్, ఎల్.చిమన్లాల్ ఇండస్ట్రీస్లకు చెందిన సమాచారాన్ని తీసుకెళ్లారంది.
పంచనామాలో తప్పులు
సోదాల తర్వాత రూపొందించిన పంచనామాలో తప్పులుండటంతో అందులో సంతకం చేయడానికి కోటేశ్వరరావు నిరాకరించారంది. అయితే పంచనామా కాపీని ఇవ్వడం గానీ, వదిలిపెట్టి వెళ్లడం గానీ చేయలేదని తెలిపింది. సీఆర్పీసీ సెక్షన్ 165, 166లకు విరుద్ధంగా సోదాలు జరిగాయంది. చట్టప్రకారం కేసుతో సంబంధం ఉన్న వివరాలను తీసుకెళ్లాలని, దానికి విరుద్ధంగా సంబంధం లేని వాటిని, ఇతర ఖాతాదారుల సమాచారాన్ని తీసుకెళ్లారని సంస్థ తెలిపింది. అందువల్ల ప్రధాన పిటిషన్లోని అభ్యర్థనను సవరించడానికి అనుమతించాలని, తీసుకెళ్లిన సమాచారాన్ని కాపీ చేసుకోకుండా తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని కోరింది. లేనిపక్షంలో తమకు తీవ్రనష్టం వాటిల్లుతుందని పేర్కొంది. సోదా నోటీసులను రద్దుచేయాలని కోరింది. దీనిపై ఏపీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటరు దాఖలు చేస్తామనడంతో న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి అనుమతిస్తూ విచారణను ఈ నెల 13కు వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!