విదేశీ పర్యటనలు ఇక భారమే!
ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారు ఉపశమనం కోసం ఇటీవల విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. ముఖ్యంగా కొవిడ్ తర్వాత ఇలాంటి వారి సంఖ్య పెరిగింది.
టూర్ ప్యాకేజీ మొత్తంపై 20% టీసీఎస్ విధింపు
అక్టోబరు నుంచి అమల్లోకి కొత్త విధానం
ఈనాడు, హైదరాబాద్: ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారు ఉపశమనం కోసం ఇటీవల విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. ముఖ్యంగా కొవిడ్ తర్వాత ఇలాంటి వారి సంఖ్య పెరిగింది. అయితే... విదేశీ పర్యాటకంపై కొత్త పన్ను విధానం ప్రభావం చూపనుంది. టూర్ ఆపరేటర్ల ద్వారా ప్యాకేజీ రూపంలో వెళ్లేవారు టీసీఎస్ కింద (ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్) ముందస్తుగా చెల్లించే పన్ను భారీగా పెరగడమే ఇందుకు కారణం. అదనంగా చెల్లించాల్సిన పన్నును ఆదాయపు పన్నులో మినహాయింపు పొందే అవకాశమున్నా... దాని కోసం ఏడాదిపాటు ఎదురుచూడాల్సి వస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలు సహా ఆసియాలోని చైనా, సింగపూర్, వియత్నాం, ఇండోనేసియా, శ్రీలంక, గల్ఫ్ దేశాలకు పర్యాటకులు పెద్దసంఖ్యలో వెళుతుంటారు. ఇలాంటి వారిలో చాలామంది టూర్ ఆపరేటర్లను ఆశ్రయిస్తుంటారు. వీరి ద్వారా విదేశీ పర్యటనలు చేసేవారు... ప్రస్తుతం టూర్ ప్యాకేజీ మొత్తంలో 5% పన్ను చెల్లిస్తున్నారు. అక్టోబరు ఒకటి నుంచి అది 20 శాతానికి పెరగనుంది. వైద్యం, విద్య అవసరాలకు వెళితే మాత్రం మినహాయింపు ఉంది. కొవిడ్ తర్వాత విమాన ఛార్జీలు భారీగా పెరగడంతో విదేశీ పర్యటనలకు వెళ్లేవారి ఖర్చులూ అధికమయ్యాయి. ఇవి చాలవన్నట్లు పన్ను భారం అదనంగా పడనుంది. ఒక కుటుంబ విదేశీ టూర్ ప్యాకేజీ రూ.5 లక్షలు అనుకుంటే... ఆ మొత్తంపై టీసీఎస్గా మరో రూ.లక్ష చెల్లించాలి. టూర్ ఆపరేటర్ల ద్వారా కాకుండా విదేశాలకు సొంతంగా వెళితే మాత్రం టీసీఎస్ ప్రభావం ఉండదు. టీసీఎస్ భారాన్ని తగ్గించుకోవడానికి పర్యాటకులు విదేశీ పర్యాటక వెబ్సైట్లను, ఏజెంట్లను ఆరా తీస్తున్నారు. పర్యాటక వీసా, రానుపోను విమాన టికెట్లు టూర్ ఆపరేటర్ల ద్వారా తీసుకుని, విదేశాల్లో హోటల్ గదులు, వాహనాల బుకింగ్లు సొంతంగా చేసుకుంటే టీసీఎస్ భారం తగ్గుతుంది.
దేశీయ పర్యాటకానికి మేలు
కొత్త విధానం దేశీయ పర్యాటకం పెరిగేందుకు దోహదం చేస్తుందని పర్యాటక నిపుణులు చెబుతున్నారు. విదేశాలకు వెళ్లేందుకు పెద్దమొత్తంలో టీసీఎస్ చెల్లించాల్సి వస్తుండటంతో పర్యాటకులు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తారని అభిప్రాయపడుతున్నారు. విదేశాలకు వెళ్లి రావడం బదులు మన దేశంలోని పర్యాటక ప్రాంతాల్ని చూసొచ్చేందుకు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు.
మధ్య తరగతిపై అధిక ప్రభావం
టీసీఎస్ పెంపు ప్రభావం మధ్య తరగతి పర్యాటకులు, టూర్ ఆపరేటర్లపై అధికంగా పడుతుంది. ఏదైనా దేశానికి ఒక కుటుంబం వెళితే టీసీఎస్ రూపంలోనే మరో రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు పన్నుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని వెనక్కి పొందే అవకాశముంది. ఐటీ రిటర్నుల సమయంలో ఈ వివరాలను సమర్పిస్తే ఆదాయపు పన్నులో సర్దుబాటు చేస్తారు. ఒకవేళ చెల్లించాల్సిన ఆదాయపు పన్ను లేకుంటే సొమ్ము రిఫండ్గా వస్తుంది. అయితే... ఈ మొత్తాన్ని ముందస్తుగా చెల్లించడానికి సమకూర్చుకోవడం మధ్యతరగతి పర్యాటకులకు కష్టమైన విషయమే. ఈ ఇబ్బందుల్లేకుండా కొందరు విదేశీ వెబ్సైట్ల ద్వారా టూర్ ప్యాకేజీలకు ఆరా తీస్తున్నారు. అప్పుడు పన్ను భారం తగ్గినా ఏదైనా సమస్య వస్తే ఇక్కడి ఆపరేటర్ల మాదిరి, వారిని ప్రశ్నించలేరు.
వాల్మీకి హరికిషన్, డైరెక్టర్ స్కాల్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. -
రేపు తెలంగాణ ఈసెట్ ఫలితాలు
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. -
వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది. -
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బొగ్గు తరలింపుపై ప్రతిష్టంభన
సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వర్షాకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు. -
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..