Telangana: పశుసంవర్ధకశాఖలో కీలక పత్రాలు మాయం!
మాసబ్ట్యాంక్లోని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో కీలక పత్రాలు మాయమయ్యాయని నాంపల్లి స్టేషన్లో కేసు నమోదైంది.
మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ సహా ఆరుగురిపై కేసు
విద్యాశాఖ కార్యాలయం నుంచి ఫైళ్ల చోరీకి మరొకరి యత్నం
ఈనాడు - హైదరాబాద్, న్యూస్టుడే- నాంపల్లి, అబిడ్స్: మాసబ్ట్యాంక్లోని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో కీలక పత్రాలు మాయమయ్యాయని నాంపల్లి స్టేషన్లో కేసు నమోదైంది. మాజీమంత్రి కార్యాలయంలోకి వెళ్లిన కొందరు వ్యక్తులు సీసీ టీవీ కెమెరాలు నిలిపివేసి, గందరగోళం సృష్టించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అదే ప్రాంతంలోని విద్యాశాఖ పాత కార్యాలయం నుంచి దస్త్రాలను ఓ వ్యక్తి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. మాసబ్ట్యాంక్ పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఛాంబర్ ఉంది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో కిటికీ గ్రిల్స్ తొలగించి కొందరు కార్యాలయంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి కీలకపత్రాలు, కంప్యూటర్లలోని హార్డ్డిస్క్లు ఎత్తుకెళ్లినట్టు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్చల్ చేశాయి. అదే రోజు రాత్రి అక్కడ వాచ్మన్గా పనిచేస్తున్న ఎం.లక్ష్మయ్య ఆ కార్యాలయ తాళాలు తీసి ఉండటం గమనించారు. అనుమానం వచ్చి చూడగా లోపల ఫైళ్లు, కంప్యూటర్లు, బీరువాలు చిందరవందరగా కనిపించాయి. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్, కంప్యూటర్ ఆపరేటర్ మోహన్, ఎలీజాన్, వెంకటేష్, మరో ఇద్దరు ఎటువంటి అనుమతి లేకుండా కార్యాలయంలోకి ప్రవేశించారని లక్ష్మయ్య నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని పత్రాలు మాయమయ్యాయని పశుసంవర్ధకశాఖ అధికారులు మధ్యమండలం డీసీపీ శ్రీనివాస్కు తెలపగా.. ఆయన శనివారం సాయంత్రం కార్యాలయాన్ని పరిశీలించారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన వేళ చోటుచేసుకుంటున్న వరుస ఘటనలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, మాజీ మంత్రుల పేషీల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచి ఫైళ్ల చోరీకి ప్రయత్నం జరిగినట్లు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన మధ్య మండలం డీసీపీ శ్రీనివాస్, అబిడ్స్ ఏసీపీ ఆకుల చంద్రశేఖర్, సీఐ టి.నరసింహరాజు, డీఐ నరసింహ తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ కార్యాలయంలోనే విద్యాశాఖ కార్యాలయం ఉంది. శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ ఆటోతో అక్కడికి చేరుకుని సుమారు గంటపాటు వేచి ఉన్నాడు. అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం గమనించిన ఆటో డ్రైవరు పరారయ్యాడు. పోలీసులు అక్కడికి చేరుకుని కార్యాలయంలో.. వాచ్మన్గా పనిచేస్తున్న స్వామిగౌడ్ను విచారించారు. ఆటోలో వచ్చిన వ్యక్తి సంస్థ కార్యాలయంలో ఎలక్ట్రీషియన్గా పనిచేసే మహ్మద్ షరీఫ్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆటోలో ఏమైనా సామగ్రి తీసుకెళ్లారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డీసీపీ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ మాజీ మంత్రి సబితారెడ్డి కార్యాలయం ఉండేదని, ఆటో తీసుకొచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
‘దస్త్రాలు మాయమవడం అవాస్తవం’
పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో పత్రాలు మాయమైనట్లు వస్తున్న వార్తలు నిరాధారమని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొమ్మిది నెలల క్రితమే పశుసంవర్ధకశాఖ కార్యాలయాన్ని నూతన సచివాలయానికి తరలించారన్నారు. మంత్రి ఆమోదం కోసం వచ్చే దస్త్రాలను ఎప్పటికప్పుడు అక్కడికే పంపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం మారడంతో ఫర్నిచర్, ఇతర సామగ్రిని జీఏడీకి అప్పగించే ప్రక్రియలో భాగంగా మాసబ్ట్యాంక్లోని కార్యాలయానికి వెళ్లామని వివరణ ఇచ్చారు. ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమేనని పేర్కొన్నారు.
దస్త్రాల మాయంపై పటిష్ఠ దర్యాప్తు చేయండి: పీసీసీ
ప్రభుత్వ కార్యాలయాల నుంచి దస్త్రాలు మాయమవుతున్న ఘటనలపై పటిష్ఠ దర్యాప్తు నిర్వహించాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ శనివారం డీజీపీ రవిగుప్తాకు లేఖ రాశారు. గత ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలా దస్త్రాల్ని అపహరిస్తున్నట్లు అనుమానాలున్నాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్