గొర్రెల పంపిణీలో ‘క్యాష్బ్యాక్’ అట!
గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధిదారులకు ‘క్యాష్బ్యాక్’ ఇస్తానని ప్రచారం చేసిన ఓ ప్రైవేట్ వ్యక్తి.. అధికారులకు నజరానాలు అందించి విక్రయదారులకు చెల్లించాల్సిన సొమ్మును తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు.
లబ్ధిదారులకు ఇస్తానంటూ ప్రచారం.. అధికారులకు నజరానాలు
లోలోనా సంస్థ పేరిట గుత్తేదారు అక్రమాలు
విజిలెన్స్ విచారణలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధిదారులకు ‘క్యాష్బ్యాక్’ ఇస్తానని ప్రచారం చేసిన ఓ ప్రైవేట్ వ్యక్తి.. అధికారులకు నజరానాలు అందించి విక్రయదారులకు చెల్లించాల్సిన సొమ్మును తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. అతనికి పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు సహకరించారని విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చింది. గొర్రెల పంపిణీ పథకం కింద లబ్ధిదారులకు మొదటి విడతలో ఒక్కో యూనిట్ (20 గొర్రెలు, ఒక పొట్టేలు)కు ప్రభుత్వం రూ.1.25 లక్షల చొప్పున మంజూరు చేసేది. రెండో విడతలో 2021 ఆగస్టు 4 నుంచి యూనిట్ ధరను రూ.1.75 లక్షలకు పెంచింది. యూనిట్ ధర పెరిగాక సయ్యద్ మొయిద్ అనే గొర్రెల రవాణా గుత్తేదారు రంగంలోకి దిగాడు. లబ్ధిదారులు గొర్రెల కోసం నేరుగా తమ సంస్థను సంప్రదిస్తే రూ.20 వేల క్యాష్బ్యాక్ ఇస్తానంటూ లోలోనా క్యాటిల్ హాస్టల్ పేరిట కరపత్రాలు, గోడపత్రికలను పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్, జిల్లా కార్యాలయాల్లో పంచిపెట్టాడు. పథకం నిబంధనల ప్రకారం.. అధికారులు, లబ్ధిదారులు కలిసి నేరుగా విక్రయదారుల వద్దకు వెళ్లి కొనాలి. అనంతరం విక్రయదారుల ఖాతాల్లో అధికారులు సొమ్ము జమ చేయాలి. కానీ, మొయిద్ వద్ద దాదాపు 50 వేల యూనిట్లు కొనుగోలు చేసినట్లు అధికారులు రికార్డుల్లో చూపారని విజిలెన్స్ ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.
పోలీసులకు విక్రయదారుల ఫిర్యాదుతో..
గతేడాది ఆగస్టు 13 నుంచి 23 మధ్యకాలంలో ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 18 మంది పెంపకందారుల నుంచి 133 యూనిట్ల కోసం 2,793 గొర్రెలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు, లబ్ధిదారులతో పాటు మొయిద్ కూడా ఉన్నాడు. గొర్రెలను మోయిదే కొన్నట్లు విక్రయదారులకు అధికారులు చెప్పారు. రికార్డుల్లో మాత్రం మొయిద్ నుంచి శాఖ కొన్నట్లు చూపించారు. అందుకు అధికారులకు మొయిద్ ‘క్యాష్బ్యాక్’ ఇచ్చినట్లు తెలిసింది. విక్రయదారులకు చెల్లించాల్సిన రూ.2.10 కోట్ల సొమ్మును అతని ఖాతాలోకి అధికారులు బదిలీ చేశారు. అతను విక్రయదారుల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉండగా అలా చేయలేదు. నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవటంతో విక్రయదారులు హైదరాబాద్కు వచ్చి పశుసంవర్ధకశాఖ ఉన్నతాధికారులను నిలదీశారు. తాము మొయిద్ ఖాతాలో డబ్బులు వేశామని, వారికి అతనే ఇవ్వాల్సి ఉందని వారు బదులిచ్చారు. దీంతో అమ్మకందారులు లోలోనా లైవ్స్టాక్ సంస్థ కార్యాలయానికి వెళ్లి మొయిద్ను నిలదీశారు. డబ్బుల కోసం తన వద్దకు రావద్దని.. అధికారుల వద్దకే వెళ్లాలని అతను బెదిరించాడు. దీంతో గచ్చిబౌలి పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. ఇలాంటి మరెన్నో మోసాలు గొర్రెల కొనుగోలులో చేటుచేసుకున్నాయని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. లబ్ధిదారులకు క్యాష్బ్యాక్ ఇస్తానని మొయిద్ ప్రచారం చేసినా.. అధికారులకే దాన్ని చెల్లించాడని అనుమానిస్తున్నారు. అందుకుగాను అతనికి లబ్ధి చేకూర్చేందుకు అధికారులు కావాలనే యూనిట్ ధర పెంచారా అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ముందుగా డైరెక్టరేట్ నుంచి సమాచారం తీసుకొని.. జిల్లాల వారీగా విచారణ ప్రారంభించారు. మొయిద్ వద్ద ఎన్ని యూనిట్లు కొనుగోలు చేసినట్లు చూపారు.. తదితర అంశాలపై విచారణ జరుపుతున్నారు. నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఇప్పటికే విచారణ జరిపినట్లు తెలిసింది. మిగిలిన జిల్లాల్లోనూ అధికారులు పర్యటించనున్నారు. మొయిద్, అధికారుల బ్యాంకు ఖాతాలను సైతం సేకరించి, వాటి ఆధారంగా విచారణ ముమ్మరం చేయాలని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!
‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. -
నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి
సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. -
మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన
రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ అరుణ్కుమార్ మిశ్రా స్పష్టంచేశారు. -
అధిక ధరకు...బియ్యం టెండర్లు!
సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. -
జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ
రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. -
మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం..ఈవో ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!
సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్ పేపర్-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్ ఇచ్చారు. -
తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. -
కుంగిన బ్లాక్లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు
ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు