రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేవారు.. పత్రాలను వెంట ఉంచుకోవాలి
సరిహద్దు చెక్పోస్టులు 24 గంటలూ పనిచేస్తాయి
ఈసారి 85 ఏళ్లు దాటిన వారికే ఇంటి నుంచి ఓటు
ఏప్రిల్ 15 వరకు ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చు
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. రూ.50 వేలకు పైగా నగదును వెంట తీసుకువెళ్లే వారు అందుకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని, లేకుంటే అధికారులు స్వాధీనం చేసుకుంటారని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. బీఆర్కే భవన్లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘గతంలో 80 సంవత్సరాలు దాటిన వారికి ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయం ఉండగా.. ఈ దఫా ఆ వయసు 85 సంవత్సరాలకు పెరిగింది. దివ్యాంగుల విషయంలో గత నిబంధనలే అమలవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 85 సంవత్సరాలు దాటిన ఓటర్లు 1,94,822 మంది, దివ్యాంగ ఓటర్లు 5,26,340 మంది ఉన్నారు’’ అని వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల తరవాత 12.49 లక్షల మంది ఓటర్ల నమోదు
ఓటు నమోదుకు ఏప్రిల్ 15 వరకు అవకాశం ఉందని వికాస్రాజ్ వెల్లడించారు. అప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు. ఓటు నమోదు, నియోజకవర్గ మార్పు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ‘‘ఓటర్ల జాబితాలో సవరణల ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేశాం. గత అసెంబ్లీ ఎన్నికల తరవాత రాష్ట్రంలో 12,49,625 మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారు. 8,58,491 మంది పేర్లను జాబితా నుంచి తొలగించగా... 7.69 లక్షల మంది తమ వివరాలను సరి చేసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి. 57 వేల బ్యాలెట్ యూనిట్లు, 44 వేల కంట్రోల్ యూనిట్లు, 48 వేల వీవీ ప్యాట్స్ ఉన్నాయి. ఈవీఎంల తొలిదశ తనిఖీ ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేశాం. సిబ్బందికి వివిధ దశల శిక్షణ పూర్తయింది. లోక్సభ ఎన్నికల షెడ్యూలే కంటోన్మెంట్ ఉపఎన్నికకూ వర్తిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల అధికారి స్థాయిలోనే ముద్రించాలని స్పష్టంచేశాం. ఈవీఎం యంత్రాలపై ఏర్పాటు చేసే అభ్యర్థుల వివరాలతో కూడిన పత్రాలను రాష్ట్రస్థాయిలో హైదరాబాద్లోని ప్రభుత్వ ముద్రణాలయంలో ముద్రిస్తాం. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను అమలు చేయనున్నాం’’ అని వెల్లడించారు. సమావేశంలో ఎన్నికల అధికారులు లోకేశ్కుమార్, సర్ఫరాజ్ అహ్మద్, సత్యవాణి పొల్గొన్నారు.
రూ.50 వేలకుపైగా నగదు తరలింపునకు బ్యాంకుల నుంచి విత్డ్రా రశీదులు, చెల్లింపుల పత్రాలు, నగలకు అయితే సంబంధిత ఆర్డర్ కాపీ, తరలింపు పత్రం తదితరాలను వెంట ఉంచుకోవాలని అధికారులు ఇప్పటికే వెల్లడించారు.
1.80 లక్షల మంది సిబ్బంది..
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేశాం. ఎన్నికల కోసం సుమారు 1.80 లక్షల మంది సిబ్బందిని, శాంతిభద్రతల పరిరక్షణకు 60 వేల మంది సిబ్బందితోపాటు 145 కంపెనీల సీఐఎస్ఎఫ్ వారిని వినియోగించనున్నాం. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు 24 గంటలూ పని చేసేలా ఏర్పాట్లుచేశాం. అన్నిటినీ సీసీ కెమెరాలతో అనుసంధానం చేశాం.
మండలి ఉపఎన్నిక యథాతథం..
శాసనమండలి ఉపఎన్నిక ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుంది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి మార్చి 28న పోలింగ్, ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ వెల్లడించింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక కోసం ఓటర్ల నమోదు సాగుతోంది.
వికాస్రాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM