Manipur terror attack: మణిపుర్లో ఉగ్రదాడి
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో తీవ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. కుటుంబంతో కలిసి వెళుతున్న సైనిక అధికారి వాహనమే లక్ష్యంగా ఐఈడీల(అధునాతన పేలుడు పరికరం)తో దాడికి పాల్పడ్డారు. అనంతరం కాల్పులు జరిపారు.
కమాండింగ్ అధికారి, భార్య, కుమారుడు సహా ఏడుగురి దుర్మరణం
అస్సాం రైఫిల్స్ అధికారి వాహనమే లక్ష్యంగా మెరుపు దాడి
రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఉగ్ర ఘాతుకానికి బలైన కర్నల్ విప్లవ్ త్రిపాఠి దంపతులు
ఇంఫాల్, దిల్లీ, ఈనాడు-గువాహటి: ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో తీవ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. కుటుంబంతో కలిసి వెళుతున్న సైనిక అధికారి వాహనమే లక్ష్యంగా ఐఈడీల(అధునాతన పేలుడు పరికరం)తో దాడికి పాల్పడ్డారు. అనంతరం కాల్పులు జరిపారు. ఈ మెరుపు దాడిలో మొత్తం ఏడుగురు మరణించారు. అస్సాం రైఫిల్స్ 46వ(ఖూగా) బెటాలియన్ కమాండింగ్ అధికారి కర్నల్ విప్లవ్ త్రిపాఠి కుటుంబసభ్యులతో కలిసి శనివారం ఉదయం వాహనంలో ప్రయాణిస్తున్నారు. మిలిటెంట్లు చురాచాంద్పుర్ జిల్లాలోని సెహకాన్ గ్రామం వద్ద ఆ వాహనమే లక్ష్యంగా ఐఈడీలను పేల్చారు. అనంతరం సమీపంలోని ఎత్తైన ప్రాంతాల నుంచి తూటాల వర్షం కురిపించారు. త్రిపాఠి బెహియాంగ్ కంపెనీ నుంచి బేస్కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు సిబ్బంది తీవ్రవాదుల కాల్పులను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పేలుళ్ల తీవ్రతకు త్రిపాఠి(41)తోపాటు ఆయన భార్య అనుజ (34), కుమారుడు అబిర్ (5), నలుగురు సిబ్బంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి చేసింది తామేనంటూ నిషేధిత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), మణిపుర్ నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎంఎన్పీఎఫ్)లు శనివారం రాత్రి ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన త్రిపాఠి, ఇతర సిబ్బంది కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ పేర్కొన్నారు. మణిపుర్ ముఖ్యమంత్రి బీరెన్సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు రాష్ట్ర బలగాలు, పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయని వెల్లడించారు. మిజోరంలో పనిచేసే త్రిపాఠి ఈ ఏడాది జులైలో మణిపుర్కు బదిలీ అయ్యారు.
చిన్నారి అబిర్ త్రిపాఠి
* తీవ్రవాదుల దాడిలో త్రిపాఠిసహా ఏడుగురు మరణించడంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తీవ్రవాదుల పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండించారు.
2018లోనూ..
మణిపుర్లోని చందేల్ జిల్లాలో జూన్ 4, 2018న సైన్యం వాహనశ్రేణిపై ఈ తరహా దాడే జరిగింది. ఆర్మీలోని 6 డోగ్రా రెజిమెంట్కు చెందిన 18 మంది సిబ్బంది ఆ దాడిలో మరణించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో దాదాపుగా ప్రశాంతత నెలకొంది.
హెలికాప్టర్లో క్షతగాత్రుల తరలింపు
చైనాతో సంబంధాలు
మణిపుర్, ఈశాన్య రాష్ట్రాల్లోని వివిధ తిరుగుబాటు సంస్థలకు చైనాతో సంబంధాలు ఉన్నాయి. ఈ మేరకు ఆయా సంస్థల సభ్యులకు ఆయుధాలను సమకూర్చడం లేదా గెరిల్లా తరహా పోరాటాలపై శిక్షణ వంటి విషయాల్లో డ్రాగన్ దేశం నుంచి సహకారం లబిస్తోంది. నిషేధిత పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లిపాక్ (పీఆర్ఈపీఏకే) ఏటా నవంబరు 13ని బ్లాక్డేగా పాటిస్తుంది. నవంబరు 12, 1978న సీఆర్పీఎఫ్, మణిపుర్ రాష్ట్ర పోలీసుల సంయుక్త ఆపరేషన్లో పీఆర్ఈపీఏకే అగ్రనేతలు కొందరు మరణించారు. అప్పటి నుంచి నవంబరు 13ని ఆ సంస్థ బ్లాక్డేగా పాటిస్తోంది. మరోవైపు, ఈ ప్రాంతంలో పీఆర్ఈపీఏకే ఉనికి దాదాపుగా లేనట్లే. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) అనే సంస్థ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనికి చురాచాంద్పుర్ జిల్లాలో మయన్మార్ వైపు సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో రెండు శిబిరాలు ఉన్నాయి. కేడర్, ఆయుధాల పరంగా చూస్తే పీఆర్ఈపీఏకే గతంలో బలంగా ఉండేది. ప్రస్తుతం పీఎల్ఏ ఆ స్థానాన్ని ఆక్రమించింది. 2011 జులైలో మణిపుర్లోని వేర్పాటువాద సంస్థలు కోఆర్డినేషన్ కమిటీ-కోర్కామ్ పేరుతో సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఈ కోర్కామ్లో పీఎల్ఏకు కూడా సభ్యత్వం ఉంది. శనివారం నాటి దాడిలో తమ ప్రమేయం కూడా ఉందని స్వయంగా ఆ సంస్థే వెల్లడించింది. మరోవైపు, ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సరిహద్దుల విషయమై భారత్-చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో పొరుగు దేశమైన మయన్మార్ తిరిగి సైనిక పాలనలోకి జారుకుంది. ఈశాన్య భారతంలో క్షీణత దిశగా పయనిస్తున్న తిరుగుబాటు సంస్థలు ఈ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి పుంజుకుని ఉనికిని చాటుకునేందుకు యత్నిస్తాయనడం సుస్పష్టం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?