Telangana Budget: సంక్షేమమే మంత్రం
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్కు రంగం సిద్ధం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి రూ. 2.65 లక్షల కోట్ల నుంచి రూ. 2.70 లక్షల కోట్ల మేర బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కరోనా పరిస్థితుల నుంచి బయటపడి రాష్ట్ర వృద్ధిరేటు బాగా పెరగడంతో గత ఏడాది కంటే రూ. 35,000 కోట్ల మేర బడ్జెట్ పరిమాణాన్ని పెంచనుంది. సొంత పన్నుల రాబడిలో వృద్ధిరేటును 20 శాతంగా అంచనా
నేడేే రాష్ట్ర బడ్జెట్
రూ. 2.70 లక్షల కోట్ల పద్దు?
దళితబంధుకు రూ. 20,000 కోట్లు!
సొంత రాబడులపైనే ధీమా
వృద్ధిరేటు ఆలంబనగా ముందుకు
ఈనాడు - హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్కు రంగం సిద్ధం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి రూ. 2.65 లక్షల కోట్ల నుంచి రూ. 2.70 లక్షల కోట్ల మేర బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కరోనా పరిస్థితుల నుంచి బయటపడి రాష్ట్ర వృద్ధిరేటు బాగా పెరగడంతో గత ఏడాది కంటే రూ. 35,000 కోట్ల మేర బడ్జెట్ పరిమాణాన్ని పెంచనుంది. సొంత పన్నుల రాబడిలో వృద్ధిరేటును 20 శాతంగా అంచనా వేస్తున్న సర్కారు పన్నేతర రాబడి, రుణాలపై ధీమాతో భారీ అంచనాలను రూపొందించింది. భారీగా ఉద్యోగాల భర్తీకి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం స్పష్టం చేయనుంది. వచ్చే ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నందున ఇదే పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఎన్నికల బడ్జెట్గానే భావించి కసరత్తు చేసినట్లు సమాచారం.. సంక్షేమం, వ్యవసాయానికి పెద్దపీట దక్కనుంది. దళితబంధుకు రూ. 20,000 కోట్లు, రైతుబంధుకు రూ. 15,000 కోట్ల మేర కేటాయించనున్నట్లు తెలిసింది. ఆసరాకు గతం కంటే రూ. 3000 కోట్లు పెరిగినట్లు సమాచారం. పథకాల వ్యయం రూ. 1.5 లక్షల కోట్లను దాటనుండగా నిర్వహణ వ్యయం రూ. 1.10 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా.
ప్రాధాన్య పథకాలకు పెద్దపీట
రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా, విద్యుత్ సబ్సిడీ, ఆసరా పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు పెరగనున్నాయి. హైదరాబాద్ అభివృద్ధికి, జలమండలికి నిధులను పెంచనున్నారు. పరిశ్రమలకు, ఆర్టీసీకి తోడ్పాటు కొనసాగనుంది. కొత్త ఉద్యోగాలపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వనుంది. ఆసరాకు రూ. 14,000 కోట్ల మేర కేటాయింపులు దక్కనున్నాయి. విద్యుత్ సబ్సిడీలకు 11,000 కోట్లకు పైగా కేటాయించనుండగా రైతు రుణమాఫీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలకు నిధులు పెరగనున్నాయి. వెనుకబడిన తరగతుల ఫెడరేషన్లకు ప్రత్యేక కేటాయింపులపై ప్రభుత్వం ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది.
సొంత రాబడుల దన్ను
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల రాబడి దాదాపు అంచనాల మేరకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆ అంచనాలను గణనీయంగా పెంచింది. ప్రస్తుతం రూ. 1.06 లక్షల కోట్లు ఉన్న పన్నుల రాబడి అంచనాలను వచ్చే ఏడాది 20 శాతం పెంచినట్లు సమాచారం. జీఎస్టీ, అమ్మకం పన్ను, రిజిస్ట్రేషన్ల రాబడి పైనా ప్రభుత్వం విశ్వాసంతో ఉంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధిరేటు ఈసారి 19.10 శాతంగా నమోదు కావడంతో ఎఫ్ఆర్బీఎం పరిధిలో రుణాలను పెంచుకోనుంది. కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాల కంటే తగ్గాయి.. భూముల అమ్మకం ద్వారా రాబడిని లక్ష్యంగా చేసుకుని పన్నేతర రాబడి అంచనాలు ఈసారి కూడా రూ. 30,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
ప్రైవేటులో రుసుములపై త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రాణాలు తీసిన పెద్దపులిని పట్టేశారు
మహారాష్ట్రలోని బల్లార్ష-కార్వా అటవీ ప్రాంతంలో నాలుగు నెలల కాలంలో నలుగురు వ్యక్తుల ప్రాణాలు తీసిన టి-86 అనే పెద్దపులిని ఎట్టకేలకు అటవీ అధికారులు సోమవారం రాత్రి పట్టుకుని చంద్రపూర్కు తరలించారు. -
రచయితలపై దాడుల విషయంలో ప్రభుత్వం మౌనం సరికాదు
కాకతీయ యూనివర్సిటీలో సమూహ కవులు, రచయితలపై ఏబీవీపీ జరిపిన భౌతిక దాడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం అరాచక శక్తులకు ఆజ్యం పోస్తోందని తెలంగాణ నిర్బంధ వ్యతిరేక వేదిక మండిపడింది. -
నామినేషన్ల తిరస్కరణపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సంబంధించి దాఖలైన నామినేషన్ల తిరస్కరణపై జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. -
కృష్ణా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణపై ఏపీ దాఖలుచేసిన పిటిషన్కు విచారణార్హత లేదు
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలతోపాటు వాటి అవుట్లెట్లన్నింటినీ కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, వాటిని కృష్ణా ట్రైబ్యునల్-1 తీర్పు ప్రకారం నిర్వహించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్కు విచారణార్హత లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. -
బాబూజీ స్మారక నాణెం విడుదల
బాబూజీ మహరాజ్ మార్గదర్శకాలు.. ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. -
మే 6 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
మే 6 నుంచి 31వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నేడు కర్ణాటకకు ఇంజినీర్ల బృందం
రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆ రాష్ట్రాన్ని కోరనుంది. -
సంక్షిప్త వార్తలు
నీటిపారుదలశాఖలో మంగళవారం పది మంది ఇంజినీర్లు పదవీ విరమణ పొందారు. మంచిర్యాల చీఫ్ ఇంజినీర్ గడ్డం శ్రీనివాస్ ఈ జాబితాలో ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర