Weather Forecast: దక్షిణ కోస్తా, రాయలసీమకు వాయు‘గండం’

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం రాత్రి వాయుగుండంగా మారింది. చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఇది..

Updated : 30 Aug 2022 14:38 IST

నేటి సాయంత్రానికి కరైకాల్‌, శ్రీహరికోట మధ్య తీరందాటే అవకాశం

ఈనాడు-అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం రాత్రి వాయుగుండంగా మారింది. చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఇది.. గురువారం సాయంత్రానికి తమిళనాడులోని కరైకాల్‌, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని  నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

చెన్నై సహా 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌  
తమిళనాడులోని చెన్నై సహా ఉత్తర జిల్లాలకు అతి భారీ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.   చెన్నైలో గురువారం అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర చెన్నై, తమిళనాడు డెల్టా ప్రాంతాల్లోని 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అక్కడక్కడ  వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో చలి పెరుగుతోంది. బుధవారం తెల్లవారుజామున అత్యల్పంగా సత్వార్‌ (సంగారెడ్డి జిల్లా)లో 11.1, ఆదిలాబాద్‌లో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని