Imran Khan: జైల్లో నాపై విష ప్రయోగం జరగొచ్చు..! పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
జైల్లో తనపై విష ప్రయోగం జరగొచ్చని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
ఇస్లామాబాద్: తనపై మూడోసారి హత్యాయత్నం జరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆందోళన వ్యక్తం చేశారు. దేశం విడిచి వెళ్లేందుకు నిరాకరిస్తుండటంతో.. జైల్లో తనపై మరో హత్యాయత్నం జరగొచ్చని, అది విష ప్రయోగం (Slow Poisoning) రూపంలోనూ ఉండొచ్చని పేర్కొన్నారు. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసు (Cipher Case)లో ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యుల ద్వారా ‘ఎక్స్’ వేదికగా ఓ సందేశాన్ని విడుదల చేశారు. ఇటీవల స్వదేశానికి తిరిగివచ్చిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
‘దేశంలో చట్టాలను పూర్తిగా అపహాస్యం చేశారు. ఈరోజు జరుగుతున్నదంతా ‘లండన్ ఒప్పందం’లో భాగమే. పరారైన వ్యక్తికి.. ఓ అవినీతిపరుడు, అతడి సహాయకుల మధ్య కుదిరిన ఒప్పందం ఇది. శిక్ష పడిన ఓ నేరస్థుడు క్లీన్ చిట్తో తిరిగి రాజకీయాల్లోకి రావడానికి ఏకైక మార్గం.. ప్రభుత్వ సంస్థలను నాశనం చేయడమే. మన న్యాయ వ్యవస్థ పూర్తిగా పతనమైపోవడం చూస్తున్నాం కదా’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ముస్లింలీగ్ (ఎన్) అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాలుగేళ్ల తర్వాత ఇటీవల స్వదేశానికి చేరుకున్న క్రమంలో ఇమ్రాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రహస్యపత్రాల దుర్వినియోగం కేసు.. ఇమ్రాన్కు ఎదురుదెబ్బ!
తనపై ఉన్న కేసులన్నీ బూటకపు, రాజకీయ ప్రేరేపితమైనవని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసే వరకు, లేదా ఆ తర్వాత కూడా చాలా కాలంపాటు తనను జైల్లో ఉంచేందుకే ఆ కేసులు మోపినట్లు ఆరోపించారు. దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించాలని, ఎప్పుడు ఎన్నికలు ప్రకటించినా.. ప్రచారాన్ని ప్రారంభించాలని తన పార్టీ (పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్) శ్రేణులను ఆదేశించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. అధికారిక రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో ఇమ్రాన్పై ప్రత్యేక కోర్టు ఇటీవల నేరాభియోగాలను మోపిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టేయాలని, బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్లనూ కోర్టు తిరస్కరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)