ImranKhan: ఇమ్రాన్.. తోషఖానా స్కామ్ అంటే?
తోషఖానా అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు అక్కడి న్యాయస్థానం 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది.. అసలేంటీ తోషఖానా స్కామ్..ఇందులో ఇంకెవరైనా ఉన్నారా?
ఇంటర్నెట్డెస్క్: తోషఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని, పాక్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఇస్లామాబాద్లోని జిల్లా, సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేస్తూ.. లక్ష పాకిస్థాన్ రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని చెల్లించకపోతే..మరో ఆరు నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏంటీ తోషాఖానా అవినీతి కేసు?ఈ కేసులో ఇరుక్కున్న నేతలు ఇంకెవరైనా ఉన్నారా?
ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలోనే కేసు నమోదైంది. పాక్ ప్రముఖులు ఎవరైనా ఉన్నత పదవుల్లో ఉండి విదేశాల నుంచి బహుమతులు అందుకుంటే.. పదవి నుంచి వైదొలగిన తర్వాత వాటిని తోషాఖానాలో జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు. కానీ, ఇమ్రాన్ఖాన్ మాత్రం చాలా తక్కువ ధర చెల్లించి వాటిని తన వద్దే ఉంచుకున్నారని, మరికొన్నింటిని తోషఖానాకు తెలియకుండా విదేశాల్లోనే అమ్మేశారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా దాదాపు 11.9 కోట్ల పాకిస్థాన్ రూపాయల విలువైన బహుమతులను చాలా తక్కువ మొత్తంలో చెల్లించి తీసుకున్నారన్నది పిటిషనర్ల వాదన. దీనిపైనే తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది.
రూ.15 లక్షల వాచీకి కేవలం రూ.2.94 లక్షలే..
ఇమ్రాన్ ఖాన్ తాను ప్రధానిగా ఉన్న సమయంలో దాదాపు 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వాటిలో అత్యంత విలువైన 5 చేతి గడియారాలు కూడా ఉన్నాయి. వీటి ధర దాదాపు రూ.38 లక్షల పాకిస్థాన్ రూపాయలు ఉంటుందని అంచనా. కానీ వీటన్నింటినీ 2018 అక్టోబరులో ఇమ్రాన్ కేవలం రూ2.5 లక్షలు చెల్లించి తీసుకున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కేవలం ఇవే కాకుండా వివిధ సందర్భాల్లో ఇమ్రాన్ ఖాన్ తన వద్ద ఉంచుకున్న వస్తువుల జాబితాను పాక్ ప్రభుత్వం విడుదల చేసింది. 2018, సెప్టెంబరులో రూ.8.5 కోట్ల విలువైన వివిధ గ్రాఫ్ వాచీలను కేవలం రూ.2కోట్లు చెల్లించి ఇమ్రాన్ తనవద్దే ఉంచుకున్నారు. వీటిలో రూ.56 లక్షల విలువైన కఫ్ లింక్స్, రూ.15 లక్షల విలువైన పెన్ను, రూ.80.75 లక్షల విలువైన ఓ ఉంగరం కూడా ఉన్నాయి. రూ. 15 లక్షల విలువైన రోలెక్స్ వాచీని ఇమ్రాన్ కేవలం రూ.2.94 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు.
‘అరెస్టు ఊహించిందే.. లండన్ ప్లాన్లో ఇది మరొక అడుగు!’
వీటితోపాటు 2018 నవంబరులో రూ.9 లక్షల విలువైన మరో రోలెక్స్ వాచీతోపాటు మరికొన్ని విలువైన వస్తువులకు ఇమ్రాన్ కేవలం రూ.3.38 లక్షలు మాత్రమే చెల్లించారు. 2019 అక్టోబరులో రూ.19 లక్షల విలువైన బాక్స్డ్ వాచీకి రూ.9.35 లక్షలు చెల్లించారు. సెప్టెంబరు 2020లో మరో రోలెక్స్ వాచీతోపాటు రూ.44 లక్షల విలువైన వస్తువులకు రూ.24 లక్షలు చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అదే నెలలో ఇమ్రాన్ భార్య బుర్షా బీబీ రూ. కోటి విలువైన ఓ నెక్లెస్ను, రూ.24 లక్షల విలువైన బ్రాస్లెట్ను, రూ.28 లక్షల విలువైన ఉంగరాన్ని, రూ.18.5 లక్షల విలువైన చెవిరింగులను కేవలం రూ.90 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. పాక్ నిబంధనల ప్రకారం 300 డాలర్ల కంటే ఎక్కువ విలువైన బహుమతిని పొందిన సమయంలో కచ్చితంగా తోషఖానాకి తెలియజేయాలి. కానీ, ఇమ్రాన్ మాత్రం చాలా బహుమతులను తోషఖానా దృష్టికి తీసుకురాలేదని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.
అందరి చిట్టా వచ్చేసింది
తాజా పరిస్థితుల నేపథ్యంలో 2002 నుంచి 2022 మధ్య దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులు, ఫెడరల్ కేబినెట్ సభ్యులు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, రిటైర్డ్ జనరల్లు, న్యాయమూర్తులు, జర్నలిస్టులతో సహా ప్రభుత్వ కార్యాలయాల అధికారులు విదేశాల నుంచి అందుకున్న బహుమతుల వివరాలను పాకిస్థాన్ తాజాగా బహిరంగపరిచింది. ఈ జాబితాలో అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి, ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్, షౌకత్ అజిజ్, యూసఫ్ రాజా గిలానీ, రాజా పర్వేజ్ అర్షాఫ్, జఫ్రుల్లా ఖాన్తో పాటు మాజీ అధ్యక్షులు ఆసిఫ్ అలి జర్దారీ, పర్వేజ్ ముషారఫ్ తదితర ప్రముఖులు ఉన్నారు.
నవాజ్ షరీఫ్
2008-2017 మధ్య కాలంలో మూడు సార్లు ప్రధానిగా ఎన్నికైన నవాజ్ షరీఫ్ దాదాపు రూ.11.95 కోట్ల విలువైన మెర్సిడెజ్ బెంజ్ వాహనం, ఏడు చేతి గడియారాలు, ఇతర బంగారు ఆభరణాలను రూ. 2.43 లక్షలు చెల్లించి తన వద్దే ఉంచుకున్నారు.
అసిఫ్ అలి జర్దారీ
మాజీ ప్రధాని అసిఫ్ అలీ జర్దారీ దాదాపు రూ. 10 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ, టయోటా లెక్సస్ తదితర ఖరీదైన వాహనాలతోపాటు ఇతర విలువైన బహుమతులను కేవలం రూ.1.6 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు.
ఇలా పలువురు పాక్ ప్రముఖులు తోషఖానా నిబంధనలకు విరుద్ధంగా తక్కువ మొత్తంలో చెల్లించి విదేశాల పొందిన బహుమతులను ఆధీనం చేసుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. తాజా తీర్పు నేపథ్యంలో వారందరిపైనా విచారణ చేపడతారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర