Imran Khan: ‘అరెస్టు ఊహించిందే.. లండన్ ప్లాన్లో ఇది మరొక అడుగు!’
తన అరెస్టును ముందే ఊహించినట్లు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ జిల్లా, సెషన్స్ కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
ఇస్లామాబాద్: తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను ఇస్లామాబాద్ జిల్లా, సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అయితే, తన అరెస్టు ఊహించిందేనని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ముందుగానే రికార్డు చేసి పెట్టుకున్న తన ప్రసంగాన్ని ఆయన ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. ‘ఇదంతా లండన్ ప్లాన్లో భాగమే. దాని అమలులో ఇది మరొక అడుగు. అయితే.. పార్టీ (PTI) కార్యకర్తలు శాంతియుతంగా, దృఢంగా ఉండాలి. పాక్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలి’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.
లాహోర్ హైకోర్టును ఆశ్రయించిన ఇమ్రాన్ పార్టీ..
ఇమ్రాన్ ఖాన్ను అక్రమ కస్టడీలో ఉంచారని ఆరోపిస్తూ ఆయన పార్టీ ‘పీటీఐ’.. లాహోర్ హైకోర్టును ఆశ్రయించింది. ఇమ్రాన్ను అపహరించారని పిటిషన్లో పేర్కొంది. వెంటనే విచారణ చేపట్టి.. ఆయన్ను హైకోర్టు ముందు హాజరుపరచాలంటూ పంజాబ్ పోలీసులను, ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించింది. ‘దాదాపు 200 మంది పోలీసులు ఇమ్రాన్ ఇంట్లోకి చొరబడి తుపాకీతో బెదిరించి అపహరించారు. కోర్టు తీర్పును చూపించకుండానే కిడ్నాప్ చేశారు. ప్రభుత్వం ఆయన్ను అక్రమ కస్టడీలో ఉంచింది. ఈ నేపథ్యంలో.. భద్రత దృష్ట్యా ఇమ్రాన్ ఖాన్ను హైకోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించాలి’ అని పీటీఐ నేత ఉమైర్ నియాజీ కోరారు. తోషాఖానా కేసులో తీర్పునూ సవాల్ చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇమ్రాన్ ఖాన్కు మూడేళ్ల జైలు శిక్ష.. ఏంటీ తోషాఖానా కేసు
దేశంలో అప్రకటిత మార్షల్ లా అమల్లో ఉందంటూ అంతకుముందు రోజు సైతం ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘వచ్చే ఎన్నికల్లో మా పార్టీ విజయం సాధిస్తుందని ప్రభుత్వం, సైన్యానికి భయం పట్టుకుంది. ఈ క్రమంలోనే నాతోపాటు నా మద్దతుదారులపై ప్రతీకార చర్యలు చేపడుతున్నాయి. కానీ, ఇవి మా పార్టీ ఓటు బ్యాంకును పెంచుతున్నాయి. ఇలా ఓటుబ్యాంకు పెరుగుతోన్న పార్టీని ఎలా అణచగలరు?’ అని ఇమ్రాన్ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. ఆగస్టు 9న పాక్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తామంటూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నడుమ ఇమ్రాన్ అరెస్టు కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
పండుటాకులే ఎండగడతాయి జగన్!
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
-
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
-
ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!
-
వడదెబ్బ చికిత్సలకు.. హీట్స్ట్రోక్ క్లినిక్లు
-
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది